పటమట గంగానమ్మ జాతర మహోత్సవంలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అద్యక్షులు దేవినేని అవినాష్*
*Press Note from Devineni Avinash : 27-04-2025*
*పటమట గంగానమ్మ జాతర మహోత్సవంలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అద్యక్షులు దేవినేని అవినాష్*
విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 14వ డివిజన్,పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నిర్వహించిన గంగానమ్మ జాతర పండుగ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు,తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ అవినాష్ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నప్రసాద వితరణ చేసారు.ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ మన సంస్కృతీ సంప్రాదయాలకు ప్రతీకగా నిలిచే ఇలాంటి అమ్మవారి జాతరలను భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని, ప్రజలు ఎల్లవేళలా సుఖసంతోషాలతో ఉండలని ప్రార్థిస్తున్న అని అన్నారు.ఆ అమ్మవారి చల్లని ఆశీస్సులు ప్రజలందరి పై ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో 14వ డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబయ్య,జిల్లా గ్రీవెన్స్ సెల్ అద్యక్షులు శెటికం దుర్గా ప్రసాద్,మండల ప్రెసిడెంట్ గద్దె కళ్యాణ్ మరియు డివిజన్ వైసీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments
Post a Comment