మురికిపూడి ప్రసాద్ సీఆర్పీఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ
మురికిపూడి ప్రసాద్ సీఆర్పీఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వాట్సాప్లో బ్లూ టిక్ ఆఫ్ చేసి, ఫోన్ ఎత్తకపోవడం జవాబుదారీతనం లోపానికే నిదర్శనం నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై 1902, అత్యవసర సమస్యలైతే 1100 ద్వారా పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేయాలి చిలకలూరిపేట............ రాష్ట్రంలో ఉన్నతాధికారుల నుంచి దిగువ స్థాయి అధికారుల వరకు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన బాధ్యత ఉందని సీఆర్పీఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మురికిపూడి ప్రసాద్ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రజలు తమ సమస్యలను వాట్సాప్ సందేశాలు, ఫోన్ కాల్స్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ, పలువురు అధికారులు వాట్సాప్లో రీడ్ రిసీట్స్ (బ్లూ టిక్)ను ఆఫ్ చేసి, ఫోన్ కాల్స్కు స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. దీంతో ప్రజలు పంపిన సందేశాలను అధికారులు చదివారా లేదా అన్నది కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతోందని అన్నారు. ఈ విధానం వల్ల ప్రభుత్వం అమలు చేస్తున్న వాట్సాప్ గవర్నెన్స్ లక్ష్యం దెబ్బతింటోందని పేర్కొన్నారు. ఫోన్కు స్పందించకపోవడం, వాట్సాప్ సందేశాలను పట్టించుకోకపోవడంతో ప్రజలు తప్పనిసరిగా అధికారులను నేరుగా కల...