అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్. నూతన కమిటీ ఏర్పాటు ను ప్రకటించిన డాక్టర్ కుందవరం రాజా నందన్ విజ్ఞాన్..
న్యూస్ 9 ఛానల్ *అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ నూతన కమిటీ ఏర్పాటు ను ప్రకటించిన డాక్టర్ కుందవరం రాజా నందన్ విజ్ఞాన్* ఎన్టీఆర్ జిల్లావిజయవాడ : అంతర్జాతీయ మానవహక్కుల కమిషన్ (ఐహెన్ఆర్సీ) ఆంధ్రప్రదేశ్ చాప్టర్ నూతన కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ అధ్యక్షుడు డాక్టర్ కుందవరం రాజనందన్ విజ్ఞాన్ ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బట్టు రాజేష్ ను నియమించి నియామక పత్రాన్ని అందించారు. ఆయనతో పాటుగా రాష్ట్ర కమిటీ ప్రతినిధులకు సైతం నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రాజ నందన్ విజ్ఞాన్, బట్టు రాజేష్ విజయవాడ ప్రెస్ క్లబ్లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రానున్న రోజుల్లో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీ) కనీస వసతులు లేవన్నారు. 48 శాతం మంది వైద్యులు, 62 శాతం మందులు, 71 శాతం ఎక్స్రే సౌకర్యాలు అందుబాటులో లేక రోగులు అల్లాడుతున్నారన్నారు. ఆరోగ్యశ్రీ అమలు పూర్తిగా విఫలమైందదన్నారు. ఉచిత వైద్యం అందించకుండా ప్రైవేట్ సంస్థలకు అవుట్సోర్సింగ్ ఇవ్వడం సరి కాదన్నారు. రాజ్యాంగంలో...