పేటలో కొండవీడు ఉత్సవాలకు ముందుగా 2k రన్.
*పేటలో కొండవీడు ఉత్సవాలకు ముందుగా 2k రన్.* కొండవీడు ఉత్సవాల ప్రారంభానికి భాగంగా పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 5న ఉదయం 7 గంటలకు ప్రీ-లాంచ్ మారదాన్/పబ్లిసిటీ రన్ (2కి.రన్) ఏర్పాటు చేస్తున్నారు.ఈ 2కి.రన్ చిలకలూరిపేట పట్టణంలోని స్థానికరైతు బజార్ నుంచి ప్రారంభమై చౌత్ర సెంటర్, కళామందిర్ సెంటర్, అడ్డరోడ్ సెంటర్ మీదుగా ఎన్ ఆర్ టి సెంటర్ వరకు సాగుతుంది.ఆసక్తి గలవారు చిలకలూరిపేట పురపాలకసంఘ కార్యాలయానికి ఫోన్ చేసి (9705359645) పేరు నమోదు చేసుకోవచ్చు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పట్టణ ప్రజలను మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబు కోరారు.