విష్ణు బిల్డర్స్ నిర్మించిన మెగా టౌన్ షిప్ అపార్ట్మెంట్ లో మాకు కేటాయించిన సెల్లార్లో వేరే వాళ్ళు షాపులు నిర్మిస్తున్నారని
న్యూస్ 9 ఛానల్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం విజయవాడ అయప్పనగర్ లో విష్ణు బిల్డర్స్ నిర్మించిన మెగా టౌన్ షిప్ అపార్ట్మెంట్ లో మాకు కేటాయించిన సెల్లార్లో వేరే వాళ్ళు షాపులు నిర్మిస్తున్నారని న్యూ ఆర్టీసీ కాలనీ,ఎలక్ట్రిసిటీ కాలనీ పరిసర ప్రాంతాల అభివృద్ధి కమిటీ సెక్రటరీ బచ్చు వెంకటనారాయణ ,అపార్ట్మెంట్ వాసులు కె.రాజశేఖర్ రెడ్డి, కె దుర్గా వరప్రసాద్ రెడ్డి తండ్రి పాండురంగారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బచ్చు వెంకటనారాయణ,రాజశేఖర్ రెడ్డి ప్లాట్, షాప్ ల ఓనర్, దుర్గా వర ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ 1999 విష్ణు బిల్డర్స్ మెగా టౌన్షిప్ ను ప్రారంభించడం జరిగింది.అప్పట్లో కొంతమంది షాపులు నిర్మించడం జరిగిందని, అసోసియేషన్ తరుపు మేము వ్యతిరేకించడం జరిగిందన్నారు. అప్పటి మున్సిపల్ కమిషనర్ గా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ షాపులను తొలగించడం జరిగింది.తొలగించిన తర్వాత ఇప్పటివరకు కూడా ఎలాంటి నిర్మాణాలు జరగలేదని, ప్రస్తుతం వేరే అపార్ట్మెంట్ నుండి కొంతమంది వచ్చి మీ అపార్ట్మెంట్ పార్కింగ్ నేను కొనుగోలు చేశాను అని చెప్పి గోడలు కట్టడం జరిగిందని, 2 సంవత్సరాల క్రితం కమిషనర్ ...