Posts

Featured Post

వినియోగదారుల హక్కుల గురించి కరపత్రాలు పంపిణీ చేస్తున్న వినియోగదారుల సంఘం నాయకులు

Image
వినియోగదారుల హక్కుల గురించి కరపత్రాలు పంపిణీ చేస్తున్న వినియోగదారుల సంఘం నాయకులు నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ సేవలను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి – *మురికిపూడి ప్రసాద్, సీఆర్పీఎఫ్ పల్నాడు జిల్లా అధ్యక్షుడు*   *చిలకలూరిపేట* ................. వినియోగదారులు తమ హక్కులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ (NCH) సేవలను సద్వినియోగం చేసుకోవాలని సీఆర్పీఎఫ్ (కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం) పల్నాడు జిల్లా అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్ పిలుపునిచ్చారు. మంగళవారం చిలకలూరిపేట పట్టణంలో నరసరావుపేట సెంటర్, చోత్ర సెంటర్ కృష్ణ మహల్ సెంటర్లో సీనియర్ సిటిజన్లకు, రిటైర్డ్ ఉద్యోగులకు, గ్రామీణ ప్రాంత నాయకులకు వినియోగదారుల హక్కులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాణ్యత లేని వస్తువులు విక్రయించడం, అధిక ధరలు వసూలు చేయడం, లోపభూయిష్ట సేవలు అందించడం, ఆన్‌లైన్ మోసాలు వంటి సమస్యలు ఎదురైనప్పుడు వినియోగదారులు మౌనంగా ఉండకుండా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు...

ఘనంగా వరల్డ్ స్కిల్ యూత్ డే

Image
 విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీసేందుకె క్విజ్ పోటీలు.  ఘనంగా వరల్డ్ స్కిల్ యూత్ డే   సుండుపల్లి. సంబేపల్లి. విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే క్విజ్ పోటీలు దోహదపడతాయని ప్రిన్సిపాల్ వై పద్మావతి తెలిపారు. బుధవారం దేవపట్ల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు వరల్డ్  యూత్  స్కిల్ డే ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా విద్యార్థులకు డ్రాయింగ్. ఎస్సే రైటింగ్. క్విజ్. వంటి పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధికి తల్లిదండ్రుల సహకారం కూడా ఎంతో అవసరమని తెలిపారు. అలాగే విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత స్థానానికి చేరినప్పుడే ఇటు తల్లిదండ్రులకు అటు ఉపాధ్యాయులకు మంచి పేరు లభిస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుండి కష్టపడి చదివి ఎంతోమంది మేధావులుగా గుర్తింపు పడ్డారని వారిని ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. విద్యాభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం జరిగిందని  వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని చ...

జగన్నాధ స్వామి ని సాలూరు జమీందారు యువరాజు గారు చేతులు మీదుగా రథయాత్ర ఊరేగింపు

Image
 పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం లో  దాసరివీధి నుంచి కోటవీధి వరకు జగన్నాధ స్వామి ని సాలూరు జమీందారు యువరాజు గారు చేతులు మీదుగా రథయాత్ర ఊరేగింపు జరిగింది దీనికి యవన్మంది భక్తులు పాల్గొని  జగన్నాధ రథాన్ని తీసుకురావడం జరిగింది

మున్సిపల్ మంచినీరు సరఫరా చేసే ప్రధాన పైప్ లైన్ లీకేజ్...

Image
 న్యూస్9: నరసరావుపేట  మున్సిపల్ మంచినీరు సరఫరా చేసే ప్రధాన పైప్ లైన్ లీకేజ్... ¡¡ వృధాగా మంచినీరు..... శ్రీ సుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల మెయిన్ గేట్ సమీపంలో లీకేజీ కావడంతో ఆ ప్రాంతమంతా  జలమయం అయింది. కళాశాలకు వెళ్లేందుకు విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఇబ్బందిగా మారింది మున్సిపల్ అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.

రాజకీయ పునరావాస కేంద్రాలుగా పౌరసరఫరాల శాఖ రాష్ట్ర విజిలెన్స్ కమిటీ నియామకాలు:

Image
మురికిపూడి ప్రసాద్  సి ఆర్ పి ఎఫ్ ఐ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ  రాజకీయ పునరావాస కేంద్రాలుగా పౌరసరఫరాల శాఖ రాష్ట్ర విజిలెన్స్ కమిటీ నియామకాలు:  మురికిపూడి ప్రసాద్  సి ఆర్ పి ఎఫ్ ఐ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ  ************ విజయవాడ........ పౌరసరఫరాల శాఖ రాష్ట్ర విజిలెన్స్ కమిటీ సభ్యుల నియామకంలో నిబంధనలు పాటించలేదని, రాజకీయ ఒత్తిళ్లకు లోబడి నియామకాలు జరిగాయని సీఆర్పీఎఫ్‌ఐ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మురికిపూడి ప్రసాద్ ఆరోపించారు.శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు, మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర విజిలెన్స్ కమిటీలలో వినియోగదారుల స్వచ్ఛంద సంస్థల (Consumer Voluntary Organisations) ప్రతినిధులకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఎంఎస్ నెం. 8 ప్రకారం వినియోగదారుల వ్యవహారాలతో సంబంధం లేని వ్యక్తులను కొన్ని జిల్లాల కమిటీలో నియమించడం చట్ట స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు.ఈ నియామకాల ద్వారా రాజకీయంగా అవకాశాలు లేని వ్యక్తులకు పదవులు కల్పిం...

ఒకే ప్రాపర్టీకి మళ్లీ మళ్లీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎందుకు?

Image
 ఒకే ప్రాపర్టీకి మళ్లీ మళ్లీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎందుకు? ఇల్లు, స్థలం లేదా ఇతర ఆస్తి ఒకసారి రిజిస్ట్రేషన్ అయ్యాక మళ్లీ అమ్మినప్పుడు కొత్త యజమాని పేరు నమోదు చేయడానికి కేవలం నామమాత్రపు ఫీజు తీసుకుంటే సరిపోతుంది ..కానీ ప్రస్తుతం భారతదేశంలో ప్రతి యాజమాన్య మార్పుజరిగినప్పుడు పూర్తి స్థాయి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. ఇలా ఎందుకు ? ఒకే ప్రాపర్టీ మళ్లీ మళ్లీ రిజిస్ట్రేషన్ చార్జెస్ ఎందుకు ? ఒకే ప్రాపర్టీ అది ల్యాండ్ లేదా ఫ్లాట్ లేదా కారు అనుకుందాం . ఆ ప్రాపర్టీ మొదటిసారి కొన్నప్పుడు చట్టబద్ధత కోసం  ప్రభుత్వం ఇప్పటికే ఒకసారి రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేసింది. అదే ఆస్తి పదేళ్లలో మూడు లేదా నాలుగు సార్లు చేతులు మారితే ప్రతి సారి లక్షల రూపాయల ఫీజులు ఎందుకు చెల్లించాలి? ప్రభుత్వాల వాదన ప్రకారం రిజిస్ట్రేషన్ అనేది కేవలం పేరు మార్పు మాత్రమే కాదు. కొత్త కొనుగోలుదారుడి హక్కులను చట్టబద్ధంగా నమోదు చేయడం, భవిష్యత్తులో వివాదాలు రాకుండా రికార్డులు నిర్వహించడం, ఆస్తి లావాదేవీలకు చట్టపరమైన రక్షణ కల్పించడం ఇందులో భాగం అని చెబుతున్నారు .. కానీ అందుకు లిమిటెడ్ చార్జెస్ వస...

డ్రైనేజీ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బొమ్మ మురళీకృష్ణ గారికి ఘన పదవీ విరమణ సన్మానం

Image
 డ్రైనేజీ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బొమ్మ మురళీకృష్ణ గారికి ఘన పదవీ విరమణ సన్మానం చీరాల: డ్రైనేజీ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా విధులు నిర్వహించిన శ్రీ బొమ్మ మురళీకృష్ణ గారి పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దంపతులను అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ పి. వెంకటరత్నం గారు, బాపట్ల డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీమతి ఐ. ధనలక్ష్మి గారు, నెంబర్-1 సబ్ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డి.వి. సుబ్బారావు గారు, చీరాల నెంబర్-2 సబ్ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్. మల్లికార్జునరావు గారు, చిలకలూరిపేట సెక్షన్-1 ఏఈఈ శ్రీ ఎస్. సుబ్బరామిరెడ్డి గారు, అంజిబాబు గారు, తెనాలి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ కె.వి.ఎల్. ప్రసాద్ గారు తదితరులు పాల్గొన్నారు. అలాగే చీరాల, రేపల్లె ప్రాంతాలకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డ్రైనేజీ శాఖ సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరై బొమ్మ మురళీకృష్ణ గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. సేవా కాలంలో ఆయన అందించ...

కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి

 కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి గీతా కులాల సంక్షేమ సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు కంచర్ల శ్రీనివాస్ చిలకలూరిపేట..... న్యూస్ 9 *ఈరోజు చిలకలూరిపేటలో గ్రాండ్ వెంకటేష్ కళ్యాణ మండపంలో జరిగిన ఒక నెల- ఒక నియోజకవర్గం - నాలుగు సందర్శనలు కార్యక్రమంలో భాగంగా విచ్చేసిన పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ కృత్తిక శుక్లా గారికి గీత కులాల సంక్షేమ సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు కంచర్ల శ్రీనివాస్ గీత కుల వృత్తిదారులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కలెక్టర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందించడం జరిగింది. ఇందులో ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  వృత్తిదారుల రక్షణకు, సంక్షేమానికి, జీవన ప్రమాణాలు మెరుగుపరుచుటకు ప్రతి సంవత్సరము ఆదరణ పథకము-3 క్రింద వృత్తిదారులకు పనిముట్లు అందజేసి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికీ  రెండు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు హామీ అమలుకు నోచుకోలేదు. వృత్తులలో గీత వృత్తి కత్తి మీద సాము లాంటిది మరియు అత్యంత సాహసోపేతమైనటువంటిది. కావున ఆదరణ-3 త్వరి...

ఇన్సూరెన్స్ కంపెనీలకు దిమ్మతిరిగే షాక్

Image
 🚨 ఇన్సూరెన్స్ కంపెనీలకు దిమ్మతిరిగే షాక్! 5 రోజులకే భార్య మృతి.. ₹50 లక్షలు ఇవ్వం అన్న కంపెనీకి కోర్టు ఊహించని తీర్పు! ⚖️🔥 ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రీమియం కట్టించుకునేటప్పుడు ఉన్న శ్రద్ధ, కష్టకాలంలో డబ్బులు ఇచ్చేటప్పుడు చూపించవు అనడానికి ఈ ఘటనే పెద్ద ఉదాహరణ. కానీ ఒక సామాన్యుడు న్యాయపోరాటం చేస్తే గెలుపు ఎలా ఉంటుందో చూడండి! ✊ 📍 విషాదం: విశాఖపట్నంకి చెందిన సవర రాధ గారు ₹50 లక్షల రూపాయలకు HDFC లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు పాలసీ తీసుకున్న కేవలం 5వ రోజే ఆమె మరణించారు. ❌ కంపెనీ మోసం: భార్య చనిపోయిన తీవ్ర బాధలో ఉన్న భర్త సుబ్బారావు గారు నామినీగా క్లెయిమ్ కి అప్లై చేస్తే.. "పాలసీ తీసుకున్న 5 రోజులకే చనిపోయారు కాబట్టి డబ్బులు ఇవ్వలేం" అని HDFC ఇన్సూరెన్స్ నిర్దాక్షిణ్యంగా రిజెక్ట్ చేసింది. 🏛️ ఇన్సూరెన్స్ కంపెనీ మోసాన్ని ఎదిరిస్తూ సుబ్బారావు గారు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా 'విశాఖపట్నం వినియోగదారుల ఫోరం (Consumer Forum)' ను ఆశ్రయించారు. 🔥 సంచలన తీర్పు: కేసు విచారించిన ఫోరం చైర్మన్ ఇన్సూరెన్స్ కంపెనీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. "మొదటి వాయిదా కట...

శ్రీ శ్రీ శ్రీ బునీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి మలయప్ప స్వామి17వ వారీస్కోత్సవము అత్యంత వైభవంగా సాలూరు పురవీధుల్లో

Image
విజయనగరం జిల్లా సాలూరులో శ్రీ శ్రీ శ్రీ భూనీల సమేత శ్రీదేవి, భూదేవి మలయప్ప స్వామివారి 17వ వార్షికోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని సాలూరు పురవీధుల్లో భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని గోవింద నామస్మరణల మధ్య స్వామివారిని దర్శించుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు మరియు స్థానిక ప్రజలు విశేషంగా పాల్గొన్నారు.

కరపత్రాలు పంపిణీ చేసిన వినియోగదారుల సంఘం నాయకులు

Image
 నరసరావుపేట సెంటర్లో వినియోగదారులకు కరపత్రాలు పంపిణీ చేసిన వినియోగదారుల సంఘం నాయకులు న్యూస్ పేపర్లో ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు తినవద్దు... విష రసాయనాలతో ఆరోగ్యానికి ముప్పు కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం పల్నాడు జిల్లా జాయింట్ సెక్రటరీ బేబీ విక్రమ్ వినియోగదారులు హక్కులపై అవగాహన కలిగి ఉండాలి చిలకలూరిపేట.................... న్యూస్ పేపర్లో ప్యాక్ చేసిన లేదా ఉంచిన ఆహార పదార్థాలను తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి బేబీ విక్రమ్ వినియోగదారులకు తెలిపారు. న్యూస్ పేపర్ తయారీలో ఉపయోగించే ఇంక్‌లో ఉండే రసాయనాలు, ముఖ్యంగా ప్రింటింగ్ ఇంక్‌లోని హానికర పదార్థాలు ఆహారంలో కలిసే అవకాశం ఉందని, అందువల్ల ఆహార పదార్థాలను పేపర్లో చుట్టడం లేదా ఉంచడం సురక్షితం కాదని తెలిపారు. ముఖ్యంగా వేడి పదార్థాలు, నూనె పదార్థాలు న్యూస్ పేపర్‌ను తాకినప్పుడు రసాయనాలు ఆహారంలోకి చేరే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వివరించారు. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) కూడా న్యూస్ పేపర్లను ఆహార ప్యాకింగ్ కోసం ఉపయోగించరాదని సూచించిందని ...

సాయి కృష్ణ క్రిమినల్ అయితే శిక్షించాల్సిన బాధ్యత కోర్టులది.

Image
 *విజయవాడ ఎన్టీఆర్ జిల్లా* *గాదె సాయి కృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన వంగవీటి ఆశ కిరణ్.  సాయి కృష్ణ క్రిమినల్ అయితే శిక్షించాల్సిన బాధ్యత కోర్టులది.  ఒక మనిషిని చంపే హక్కు పోలీసులకు ఎవరు ఇచ్చారు... టెర్రరిస్ట్ కసబ్ ను ఉరి వేసి మృతదేహాన్ని కుటుంబానికి అందించిన గొప్ప వ్యవస్థ మనది.. ఇప్పుడు తన బిడ్డ మృతదేహం కోసం తల్లి విలవిలాడుతుంది.. గాదె సాయికృష్ణ శవాన్ని తల్లికి ఇచ్చి న్యాయం చేయండి.  మనిషిని మాయం చేయడం ఏంటి అని ప్రశ్నించారు...

15 సెల్ ఫోన్ లను రికవరీ

Image
 చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పోయినటువంటి 15 సెల్ ఫోన్ లను రికవరీ చేసి ఈరోజు చిలకలూరిపేట అర్బన్ పి.యస్ ఇన్స్పెక్టర్ P. రమేష్ . సెల్ ఫోన్ లను పోగొట్టుకున్న బాధితులకు అప్పగించడమైనది.

మండల విజిలెన్స్ కమిటీ సభ్యులుగా రవి నాయక్, బేబీ విక్రమ్ నియామక ఉత్తర్వులు అందుకుంటున్న రవి నాయక్, బేబీ విక్రమ్

Image
తాసిల్దార్ నుంచి నియామక ఉత్తర్వులు అందుకుంటున్న రవి నాయక్, బేబీ విక్రమ్ మండల విజిలెన్స్ కమిటీ సభ్యులుగా రవి నాయక్, బేబీ విక్రమ్ నియామకం చిలకలూరిపేట................ చిలకలూరిపేట మండల స్థాయి పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ కమిటీ సభ్యులుగా వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ప్రతినిధులు రవి నాయక్, బేబీ విక్రమ్‌లు నియమితులయ్యారు. ఈ మేరకు మండల తాసిల్దార్ షేక్ మొహమ్మద్ హుస్సేన్ గురువారం వారికి నియామక ఉత్తర్వుల ప్రతులను అందజేశారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థ (రేషన్ వ్యవస్థ) పారదర్శకంగా, సమర్థవంతంగా అమలవడానికి విజిలెన్స్ కమిటీల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా పర్యవేక్షించడం, లబ్ధిదారుల సమస్యలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకురావడం కమిటీ సభ్యుల ప్రధాన బాధ్యత అని తెలిపారు. వినియోగదారుల సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మురికిపూడి ప్రసాద్ మాట్లాడుతూ, గత నాలుగు సంవత్సరాలుగా రవి నాయక్, బేబీ విక్రమ్‌లు వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం–2019పై ప్రజలకు విస్తృత అవగాహన కల్...

ఎమ్మెల్యే ప్రత్తిపాటికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాధవ్ సింగ్

Image
 ఎమ్మెల్యే ప్రత్తిపాటికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాధవ్ సింగ్  చిలకలూరిపేట  మాజీ మంత్రి, స్థానిక శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ అమ్మనబ్రోలు మాధవ్ సింగ్ వార్డు నాయకులతో కలిసి ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పుష్పగుచ్ఛం అందజేసి, జ్ఞాపిక (మెమొంటో) బహుకరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాధవ్ సింగ్ మాట్లాడుతూ, రెండున్నర దశాబ్దాలుగా నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్తిపాటి పుల్లారావు ఎనలేని సేవలు అందించారని, ప్రజల మన్ననలు పొందిన నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారని పేర్కొన్నారు. ప్రజా సేవలో నిరంతరం అంకితభావంతో ముందుకు సాగుతున్న ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 25వ వార్డు మహిళా నాయకురాలు వనితా బాయ్, అద్దంకి అనితా బాయ్, దుర్గాబాయి తదితరులు పాల్గొని ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం–2019పై ప్రతి ఒక్కరి కి పూర్తి అవగాహన

Image
*వినియోగదారుల హక్కుల చట్టంపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం*  ఆర్టీసీ డిఎం యద్దనపూడి వేణుబాబు ఆర్టీసీ బస్టాండ్‌లో కరపత్రాల పంపిణీ – ప్రయాణికులకు అవగాహన వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం–2019పై ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని చిలకలూరిపేట ఆర్టీసీ డీఎం యద్దనపూడి వేణుబాబు పేర్కొన్నారు. శనివారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో వినియోగదారుల హక్కుల పరిరక్షణ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని వినియోగదారుల హక్కుల పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ప్రయాణికులకు కరపత్రాలు పంపిణీ చేసి చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో వినియోగదారులేనని, మార్కెట్‌లో వస్తువులు కొనుగోలు చేయడం నుంచి ఆన్‌లైన్ షాపింగ్, ఈ-కామర్స్ సేవలు, రియల్ ఎస్టేట్ రంగంలో ప్లాట్లు, గృహాలు కొనుగోలు చేసే వారందరూ వినియోగదారుల హక్కుల చట్ట పరిధిలోకి వస్తారని వివరించారు. వస్తువులు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని, వస్తువుల నాణ్యత, గ్యారెంటీ, వారంటీ వంటి అంశాలను పరిశీలించే హక్కు ప్రతి వినియోగదారునికి ఉందన్నారు. నాణ్యమైన వస్తువు లేదా సేవ పొందే హక్కుతో పాటు ...

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను తన సొంత ఖర్చులతో విమానంలో విశాఖపట్నం తీసుకువెళ్లారు..

Image
 న్యూస్ 9 ఛానల్ కృష్ణాజిల్లా పెనమలూరు మండలం కానూరు లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను తన సొంత ఖర్చులతో విమానంలో విశాఖపట్నం తీసుకువెళ్లారు.. ఈ సందర్భంగా పాఠశాల వ్యవస్థాపకుడు మరియు అభివృద్ధి కమిటీ అధ్యక్షులు అన్నే శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ ముందుగా పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు.. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 500 మార్కులపైగా 20 మంది విద్యార్థులకు రావడం శుభ పరిణామం అని అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి పట్టుదలతో చదివి జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు. అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థులను గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విశాఖపట్నం వరకు తీసుకువెళ్లి అక్కడ ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించుకుని అనంతరం సాయంత్రం తిరుగు ప్రయాణం అవుతామని అన్నారు. రాబోయే కాలంలో ఈ పాఠశాల నుంచి మరింత మంది విద్యార్థులు మంచి మార్కులు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం పి విజయలక్ష్మి, ఉపాధ్యాయుల సంఘం నేత కొనకల్ల రెడ్డమ్మ, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు కోకినాల అజ్రయ్య.. తదితరులు పాల్గొ...

అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్. నూతన కమిటీ ఏర్పాటు ను ప్రకటించిన డాక్టర్ కుందవరం రాజా నందన్ విజ్ఞాన్..

Image
 న్యూస్  9 ఛానల్ *అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ నూతన కమిటీ ఏర్పాటు ను ప్రకటించిన డాక్టర్ కుందవరం రాజా నందన్ విజ్ఞాన్* ఎన్టీఆర్ జిల్లావిజయవాడ :  అంతర్జాతీయ మానవహక్కుల కమిషన్ (ఐహెన్ఆర్సీ) ఆంధ్రప్రదేశ్ చాప్టర్ నూతన కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ అధ్యక్షుడు డాక్టర్ కుందవరం రాజనందన్ విజ్ఞాన్ ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బట్టు రాజేష్ ను నియమించి నియామక పత్రాన్ని అందించారు. ఆయనతో పాటుగా రాష్ట్ర కమిటీ ప్రతినిధులకు సైతం నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రాజ నందన్ విజ్ఞాన్, బట్టు రాజేష్ విజయవాడ ప్రెస్ క్లబ్లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రానున్న రోజుల్లో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీ) కనీస వసతులు లేవన్నారు. 48 శాతం మంది వైద్యులు, 62 శాతం మందులు, 71 శాతం ఎక్స్రే సౌకర్యాలు అందుబాటులో లేక రోగులు అల్లాడుతున్నారన్నారు. ఆరోగ్యశ్రీ అమలు పూర్తిగా విఫలమైందదన్నారు. ఉచిత వైద్యం అందించకుండా ప్రైవేట్ సంస్థలకు అవుట్సోర్సింగ్ ఇవ్వడం సరి కాదన్నారు. రాజ్యాంగంలో...

పారిశుద్ధి అవగాహన కార్యక్రమం

Image
 ఈరోజు సాలూరులోని కోటవీధిలో పారిశుద్ధి అవగాహన కార్యక్రమం జరిగింది.

సాతులూరు వద్ద రైతుల ధర్నా: హైవేపై నిలిచిన వాహనాలు

Image
 సాతులూరు వద్ద రైతుల ధర్నా: హైవేపై నిలిచిన వాహనాలు చిలకలూరిపేట:గుంటూరు - కర్నూలు హైవేపై  నాదెండ్ల మండలం సాతులూరు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సాతులూరు నుండి చందవరం వెళ్లే దారిలో ఉన్న AMR సంస్థ చెక్ పోస్ట్ వద్ద సిబ్బంది అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ గ్రామస్తులు, రైతులు భారీ ధర్నా చేపట్టారు. తమ వాహనాల రాకపోకలపై ప్రతిసారి డబ్బులు అడగడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, హైవేపై ట్రాక్టర్లు అడ్డుపెట్టి నిరసన తెలిపారు.ఈ క్రమంలో రైతులు, AMR సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తక్షణమే ఈ వసూళ్లను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డుపై బైఠాయించడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరిస్థితిని గమనించిన పోలీసులు రంగ ప్రవేశం చేసి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

గుమడాము గ్రామంలో హానుమాన్ జయంతి వేడుకలు

Image
 గుమడాము గ్రామంలో హానుమాన్ జయంతి వేడుకలు* తేది 12.05.2026 నాడు సాలూరు మండలం గుమడాము గ్రామంలో హానుమాన్ జయంతి వేడుకలు జరిగాయి. హనుమాన్ విగ్రహానికి పూల మాల వేసి అష్టోత్తర శతనామల పూజ చేసి హారతి ఇచ్చి పులిహార్ ప్రసాదాన్ని వచ్చిన భక్తులకు అందజేయటం జరిగింది. గుమడాము గ్రామంలో యువకులు ఐకమత్యంతో సేవా కార్యములు చేస్తూ ఈ రోజు పూజ చేసిన పంతులు గారికీ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న కోరుకొండ అప్పారావు గారు శాలువతో సన్మానం చేసి ఫలహారం సమర్పించుకున్నారు. గ్రామంలో యువకులు ఐకమత్యంతో మంచి పనులు చేస్తున్నందుకు అభినందనలు తెలియచేశారు.

ఇంటర్నేషనల్ నర్సెస్ డే శుభ సందర్భంగా వైద్య సిబ్బందికి ఈశ్వరీయ బహూమతిని ప్రధానం చేసిన బొబ్బిలి బ్రహ్మ కుమారీస్

Image
ఇంటర్నేషనల్ నర్సెస్ డే శుభ  సందర్భంగా వైద్య సిబ్బందికి ఈశ్వరీయ బహూమతిని ప్రధానం చేసిన బొబ్బిలి  బ్రహ్మ కుమారీస్ తే.12.05.2026 ది.మంగళవారం ఉదయం బసినేని పల్లి గ్రామం, సీతారాంపురం మండలం నెల్లూరు జిల్లా లో ఆశా వర్కర్స్ కి మరియు వైద్య సేవలు చేస్తున్న డాక్టర్స్ & నర్సెస్ లకు  *ఇంటర్నేషనల్ నర్సెస్ డే* శుభ సందర్భంగా బ్రహ్మ కుమారీస్ సంస్థ నుంచి BK రాజేశ్వరి అక్కయ్య (బొబ్బిలి సెంటర్ ఇన్చార్జి) గారు నర్సులు కు  రాజయోగ మెడిటేషన్ నేర్చుకోవాలి అని సందేశం ఇస్తూ *ఈశ్వరీయ బహుమతినీ ప్రధానం చేశారు.* ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజర్ కు కూడా ఈశ్వరీయ బహుమతినీ ప్రధానం చేశారు

చిలకలూరిపేట: ఆర్టీసీ డ్రైవర్‌పై కొందరు వ్యక్తులు దాడి

Image
 *డ్రైవర్‌పై  దాడి: ఆసుపత్రిలో చికిత్స* చిలకలూరిపేట: ఆర్టీసీ డ్రైవర్‌పై కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటన  చిలకలూరిపేట డిపోకు చెందిన డ్రైవర్ గంటూరు నుంచి సుమారు 70 మంది ప్రయాణికులతో బస్సును తీసుకుని బయలుదేరారు. మార్గమధ్యంలో చౌడవరం వద్ద ప్రయాణికులు దిగాల్సి ఉండగా, అక్కడ వర్షం కురుస్తుండటంతో ప్రయాణికుల సౌకర్యార్థం బస్సును కొంచెం ముందుకు తీసుకెళ్లి ఆపేందుకు డ్రైవర్ ప్రయత్నించారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా బస్సుకు అడ్డంగా రావడంతో కండక్టర్ మరియు డ్రైవర్ అతడితో మాట్లాడారు. అయితే, బస్సు ఎందుకు ఆపలేదని ఆగ్రహించిన సదరు వ్యక్తి, తన అనుచరులతో కలిసి డ్రైవర్‌పై దాడికి దిగాడు. దాదాపు 10 మందికి పైగా వ్యక్తులు డ్రైవర్‌ను, కండక్టర్‌ను అసభ్య పదజాలంతో దూషిస్తూ విచక్షణారహితంగా కొట్టారని ఈ దాడిలో డ్రైవర్ తీవ్ర అస్వస్థతకు గురై, బీపీ పడిపోవడంతో స్పృహ కోల్పోయారు. వెంటనే సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది బాధితుడిని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన వ్యక్తులు కండక్టర్ ఫోన్‌లోని వీడియోలను బలవంతంగా డిలీట్ చేయించడమే కాకుండా, డ్రైవర్ లైసెన్స్ జిరాక్స్ తీసుకుని బెదిరిం...

మదర్స్ డే శుభ సందర్భంగా గాదెలవలస గ్రామం లో గ్రామీణ మహిళలకు సన్మానం చేసిన బ్రహ్మ కుమారీస్

Image
మదర్స్ డే శుభ  సందర్భంగా గాదెలవలస గ్రామం లో గ్రామీణ మహిళలకు సన్మానం చేసిన బ్రహ్మ కుమారీస్* తే.10.05.2026 ది.ఆదివారం ఉదయం గాదెలవలస గ్రామం, బొబ్బిలి మండలం విజయనగరం జిల్లా లో గ్రామీణ మహిళలకు *మదర్స్ డే* శుభ సందర్భంగా బ్రహ్మ కుమారీస్ సంస్థ నుంచి BK రాజేశ్వరి అక్కయ్య  గారు మహిళలకు సగౌరవంగా శాలువాలతో సన్మానం చేసి వారు చేస్తున్న సేవలను అభినందిస్తూ *ఈశ్వరీయ బహుమతినీ ప్రధానం చేశారు.* ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో వచ్చిన మహిళలను ప్రోత్సహిస్తూ , గ్రామ అభివృద్ధి కోసం *రాజయోగ మెడిటేషన్ నేర్చుకుంటూ ఆనందాన్ని సంతోషాన్ని పొందుతున్నారని ఆ మహిళలు చెప్పారు* మహిళలను చాలా గౌరవంగా సన్మానించడం వారికి ఈశ్వరీయ బహుమతినీ ప్రధానం చేయడం చాలా ఆనందంగా ఉందని బ్రహ్మ కుమారిస్ చేస్తున్న సేవలు అద్భుతమని గ్రామీణ మహిళలు అభినందనలు తెలియచేశారు