పరగాటి వారి పెళ్లి సందడిలో పాల్గొన్న శాసనసభ్యులు కృష్ణప్రసాదు
ఎన్టీఆర్ జిల్లా, కొండపల్లి మున్సిపాలిటీ, 22.05.2025.
పరగాటి వారి పెళ్లి సందడిలో గౌరవ మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారు పాల్గొన్నారు.
కొండపల్లి మున్సిపాలిటీకి చెందిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు పరగాటి సుబ్బారావు గారి కుమారుడు విజయ్ గారి వివాహం సునీత గారితో కొండపల్లిలోని బి కాలనీ ఆడిటోరియంలో గురువారం జరిగింది.
ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్న మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాదు గారు నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్డీఏ కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.