విజయనగరం జిల్లా పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా దాసరి సురేష్ నియామకం
పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ప్రకటన
విజయవాడ, న్యూస్ నైన్ జూన్ 21:
పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (PAAP) రాష్ట్ర కమిటీ విజయనగరం జిల్లాకు కొత్త అధ్యక్షుడుగా నియమించింది. ఈ బాధ్యతకు దాసరి సురేష్ ని నియమిస్తున్నట్లు రాష్ట్ర కమిటీ ప్రకటించింది.తల్లిదండ్రుల సమస్యలను ప్రభుత్వానికి తెలపడం, విద్యా రంగంలో శాశ్వత మార్పులు తీసుకురావడం వంటి ముఖ్యమైన లక్ష్యాలతో పనిచేస్తున్న PAAP కమిటీ, జిల్లా స్థాయిలో సంఘటితంగా తల్లిదండ్రులను సమీకరించి విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేయనున్నట్లు వెల్లడించింది.ఈ సందర్భంగా అతని పై కమిటీ నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ, జిల్లా వ్యాప్తంగా తల్లిదండ్రులలో కమిటీ నిర్మాణం, నాయకత్వ లక్షణాలు కలిగిన వారిని ఎదుగజేయడం వంటి బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు.