ప్రజా ఉద్యమం"
న్యూస్ నైన్ ఛానల్: ఎన్టీఆర్ జిల్లా
విజయవాడ2 4-10-2025
మాజీ మంత్రి, పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో "వైయస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం" పై రూపొందించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం
మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కామెంట్స్
ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ ఆర్ సిపి కోటి సంతకాల కార్యక్రమం
ఈ నెల 28న ఉదయం 9 గంటలకు భవానీపురం బ్యాంక్ సెంటర్ వద్ద నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు వైసిపి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ల ప్రయివేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరుతూ ఎమ్మార్వో గారికి వినతిపత్రం అందజేయడం జరుగును
వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా సంఘాలు, ఇతర పార్టీ ల వారు, ప్రజలు విరివిరిగా పాల్గొని జయప్రదం చేయాలి
విజయవాడ పశ్చిమలో ప్రతి డివిజన్ లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం శరవేగంగా జరుగుంతుంది
ప్రజలు స్వచ్చందంగా బయటకు వచ్చి మద్దత్తు తెలుపుతున్నారు
గతంలో ఆంధ్ర రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజ్ లు ఉండేవి
జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలనే గొప్ప ఉద్దేశంతో జగన్ మోహన్ రెడ్డి గారు స్థలాలు కేటాయించి నిర్మాణ పనులు ప్రారంబించారు
ఎన్నికల ముందే 5 మెడికల్ కాలేజ్ లు ప్రారంభించి తరగతులు కూడా ప్రారంభించారు
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రారంభానికి చేరువలో ఉన్న మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులు ఆపేసారు
కుట్రతో ప్రభుత్వ ఆస్తులను, వైద్య కళాశాలలను, ప్రభుత్వ వైద్యశాలలను అమ్మెందుకు పెత్తందారులతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసే విధంగా వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది
ఉచిత వైద్యాన్ని, ఉచిత విద్యను జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజలకు అందించారు
విద్యకు, వైద్యానికి ప్రజలు డబ్బులు చెల్లించే విధంగా కూటమి పరిపాలన చేయడం బాధాకరం
ఆరోగ్యశ్రీ పధకాన్ని ప్రవేశపెట్టి ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించిన మహనీయుడు డా వైయస్ రాజశేఖర్ రెడ్డి
నేడు కూటమి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించడం లేదని, ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీని నిలిపివేస్తామని ధర్నా చౌక్ లో ధర్నాలు చేస్తున్నారు
పేద ప్రజలు ఎక్కడ వైద్యం చేయించుకోవాలి ?
జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఉచితంగా వైద్యం, వైద్య విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించాలని గొప్ప ఉద్దేశంతో అన్ని వసతులతో జిల్లాకో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసారు
నేడు కూటమి పిపిపి విధానాన్ని ప్రవేశపెట్టి వాట్టన్నిటిని అమ్మేసే విధంగా వ్యవహరించడం చాల బాధాకరం
కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిసి ప్రజలకు ఉచితంగా విద్యను వైద్యనీ అందించాలి
లేనిపక్షంలో ప్రజా ఉద్యమానికి కూటమి బలికాకతప్పదు
ఇప్పటికే కూటమి ప్రజలకు సంక్షేమ పధకాలు అందించడం లేదు, ఉచిత వైద్యం ను అందించడం లేదు, విద్యను అందించడం లేదు
కల్లబొల్లి కబుర్లతో,గ్రాఫిక్స్ తో కూటమి పరిపాలన చేస్తుంది, ప్రజలను మభ్యపెడుతున్నారు
ఉచిత గ్యాస్ సిలిండర్ పధకం ద్వారా ప్రజలకు తమ ఖాతాలో నగదు జమకావడం లేదు.
కూటమి అమలు చేసిన ఏ సంక్షేమ పథకంగా కూడా విజయవంతం కాలేదు
మెడికల్ కాలేజ్ ల ప్రైవేటీకరణను నిలిపివేయాలి లేని పక్షంలో ప్రజలతో కలిసి ఉద్యమాలు చేస్తాం
స్థానిక బ్రాహ్మణ వీధిలోని వైసిపి విజయవాడ పశ్చిమ కార్యాలయం నందు శుక్రవారం నాడు మాజీ మంత్రి, పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మెడికల్ కాలేజ్ ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా "వైయస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం" పై రూపొందించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పశ్చిమ వైసిపి కార్పొరేటర్లు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు
ఈ సందర్భంగా మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ వైసిపి అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పశ్చిమలో కోటి సంతకాల కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, దానిలో భాగంగానే ఈ నెల 28న ఉదయం 9 గంటలకు భవానీపురం బ్యాంక్ సెంటర్ లోని వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద నివాళులర్పించి పాదయాత్రగా ఎమ్మార్వో కార్యాలయం వద్దకు వెళ్లి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ల ప్రయివేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరుతూ ఎమ్మార్వో గారికి వినతిపత్రం అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా సంఘాలు, ఇతర పార్టీ ల వారు, ప్రజలు విరివిరిగా పాల్గొని జయప్రదం చేయాలనీ పిలుపునిచ్చారు. విజయవాడ పశ్చిమలో ప్రతి డివిజన్ లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం శరవేగంగా జరుగుంతుందని, ప్రజలు అందరూ స్వచ్చందంగా బయటకు వచ్చి మద్దత్తు తెలుపుతున్నారన్నారు. గతంలో ఆంధ్ర రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజ్ లు ఉంటె జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలనే గొప్ప ఉద్దేశంతో జగన్ మోహన్ రెడ్డి గారు స్థలాలు కేటాయించి నిర్మాణ పనులు ప్రారంబించి ఎన్నికల ముందే 5 మెడికల్ కాలేజ్ లు ప్రారంభించి తరగతులు కూడా ప్రారంభించారన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రారంభానికి చేరువలో ఉన్న మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులు నిలిపివేశారన్నారు. కుట్రతో ప్రభుత్వ ఆస్తులను, వైద్య కళాశాలలను, ప్రభుత్వ వైద్యశాలలను అమ్మెందుకు పెత్తందారులతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసే విధంగా వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. ఉచిత వైద్యాన్ని, ఉచిత విద్యను జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజలకు అందించారన్నారు. విద్యకు, వైద్యానికి డబ్బులు చెల్లించే విధంగా కూటమి పరిపాలన చేస్తుందని ఇది చాలా బాధాకరమన్నారు. ఆరోగ్యశ్రీ పధకాన్ని ప్రవేశపెట్టి ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించిన మహనీయుడు డా వైయస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. నేడు కూటమి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించడం లేదని, ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీని నిలిపివేస్తామని ధర్నా చౌక్ లో ధర్నాలు చేస్తున్నారన్నారు. పేద ప్రజలు ఎక్కడ వైద్యం చేయించుకోవాలని కూటమిని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఉచితంగా వైద్యం, వైద్య విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించాలని గొప్ప ఉద్దేశంతో అన్ని వసతులతో జిల్లాకో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసారని కానీ నేడు కూటమి పిపిపి విధానాన్ని ప్రవేశపెట్టి వాట్టన్నిటిని అమ్మేసే విధంగా వ్యవహరించడం చాల బాధాకరమన్నారు. కూటమి ప్రభుత్వం కళ్ళు తెరావాలని, ప్రజలకు ఉచితంగా విద్యను వైద్యనీ అందించాలనే తప్పనతో జగన్ మోహన్ రెడ్డి గారు పని చేసినట్లు కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగించాలని లేనిపక్షంలో ప్రజా ఉద్యమానికి కూటమి బలికాకతప్పదన్నారు. ఇప్పటికే కూటమి ప్రజలకు సంక్షేమ పధకాలు అందించడం లేదని, ఉచిత వైద్యం ను అందించడం లేదని, విద్యను అందించడం లేదని కల్లబొల్లి కబుర్లతో,గ్రాఫిక్స్ తో కూటమి పరిపాలన చేస్తుందని, ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పధకం ద్వారా ప్రజలకు తమ ఖాతాలో నగదు జమకావడంలేదన్నారు. కూటమి అమలు చేసిన ఏ సంక్షేమ పథకంగా కూడా విజవంతం కాలేదన్నారు. మెడికల్ కాలేజ్ ల ప్రైవేటీకరణను నిలిపివేయాలని లేని పక్షంలో ప్రజలతో కలిసి ఉద్యమాలు చేస్తామని కూటమిని హెచ్చరించారు





Comments
Post a Comment