మస్జీద్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని,తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జమైత్ అహలె హదీసు విజయవాడ సిటీ ప్రెసిడెంట్ నశీర్ అహ్మద్, వైఎస్ఆర్సిపి పార్టీ ఎమ్మెల్సీ రాహుల్లా.
న్యూస్ నైన్ ఛానల్2/01/25
ఎన్ టి ఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం*:
విజయవాడ,లబ్భీపేట లోని చెన్నుపాటి పెట్రోల్ బంక్ దగ్గర, డాక్టర్ వై.వి.రావు హాస్పటల్ రోడ్ లో కొత్తగా పునర్నిర్మించిన మస్జీద్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని,తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జమైత్ అహలె హదీసు విజయవాడ సిటీ ప్రెసిడెంట్ నశీర్ అహ్మద్, వైఎస్ఆర్సిపి పార్టీ ఎమ్మెల్సీ రాహుల్లా.
**ఎంపీ కేశినేని శివనాద్ మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు*:
ఎవరని సహాయం అడగకుండా కేవలం 8 నెలలలో నాలుగు ఫ్లోర్ లు మసీదు ను నిర్మించిన నిర్వాహకులకు అభినందనలు
విజయవాడలో అనేకచోట్ల సొంత ఖర్చులతో భవనాలను నిర్మిస్తున్నారు సోషల్ యాక్టివిటీస్ కోసం నాలుగో ఫ్లోర్ కేటాయించడం ఆనందం గా ఉంది ప్రతి ఒక్కరూ మసీదును సందర్శించి, మసీద్ ప్రాచుర్యాన్ని పెంపొందించాలన్నారు.
స్థలదాతకు,మసీదు నిర్వాహకులకు, మసీదు నిర్మాణానికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా విజయవాడ ప్రజలు తరుపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
**ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మసీదు నిర్వాహకులు నసీర్ అహ్మద్ మాట్లాడుతూ ఈ విధంగా తెలియజేశారు*:
దేవుని గృహం నిర్మించిన దానిలో నమాజు చేసుకుంటే అన్ని సమస్యలు తొలగిపోతాయి
మనకు ఉన్న అన్ని సమస్యలను తీర్చటానికి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం నమాజ్ చేసునేందుకు అనువైన స్థలం ఆ దేవుని దయవల్ల మసీదును ప్రారంభించుటకు ఇప్పుడు రావడం జరిగింది. దేవుని విధానాలను గౌరవిస్తూ వారికి ఏ అవసరమైనా సరే మేము తీర్చడానికి ముందున్నామన్నారు.
అల్లా యొక్క దయవల్ల నాలుగు అంతస్తుల మసీదును లిఫ్ట్ తో నిర్మించినందుకు చాలా ఆనందంగా ఉంది అని అన్నారు.
మసీదు నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.
విజయవాడలో ఉన్న 25 మసీదులు ప్రతి సంక్షేమ కార్యక్రమంలో పాలుపంచుకుంటాయని మసీద్ నిర్వాహకులు నసీర్ అహ్మద్ అన్నారు.

Comments
Post a Comment