కాంచీపురం పెరుమాళ్ సిల్క్ షోరూంను ప్రారంభించిన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు.
*ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేతుల మీదుగా కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ షోరూం ప్రారంభోత్సవం*
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు
నియోజకవర్గం.
4/01/2026
విజయవాడ లబ్బీపేట పివిసి మాల్ దగ్గర కాంచీపురం పెరుమాళ్ సిల్క్ షోరూంను ప్రారంభించిన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు నిర్వాహకులు భయ్యా రవి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కాంచీపురం పెరుమాళ్ సిల్క్ షోరూమ్ లు మొత్తం నాలుగు స్థాపించారని, నెల్లూరు నుండి మొదలై విజయవాడ అమరావతి వరకు వ్యాపించాయన్నారు. దేశంలోనే అన్ని రాజధానుల కంటే అమరావతి రాజధాని ముందుకు దూసుకుపోతున్నది. విజయవాడ నగరానికి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు రావాలనేది నా కోరిక.
ప్రతి కుటుంబంలో ఒక ఎంట్రప్రెన్యూర్ ఉంటే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటూ ఉండేవారన్నారు. మేము చిన్నప్పటినుండి కాంచీపురం సిల్క్స్ గొప్ప సంస్థ అని వింటూ ఉండేవాళ్ళమన్నారు.
ఈ షో రూమ్ లో గద్వాల్,పోచంపల్లి,ఆరని,బెనారస్
శారీస్ కలవని, మగ్గం వర్క్ తో చేసిన బ్లౌజ్,కంచి పట్టు చీర కలిపి 999 రూపాయలకు అఫర్ లో ఇస్తున్నామన్నామని, మా వద్ద 399 నుండి 2 లక్షల వరకు పట్టు చీరలు కలవన్నారు. అందరికీ ఒకే ధర తో మంచి క్వాలిటీ గల చీరలు ను అందించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో నే ఇక్కడ స్థాపించడం జరిగిందన్నారు.రాబోయే రెండు సంవత్సరాలలో రెండు తెలుగు రాష్ట్రాలలో అనేకమైన బ్రాంచ్ లు ప్రారంభిస్తామన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో షోరూం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


Comments
Post a Comment