జర్నలిస్టుల స్వేచ్ఛను కాపాడండి

 

**


*మధురవాడ జర్నలిస్టుల ఆధ్వర్యం లో ధర్నా* 


*పీ.ఎం.పాలెం సిఐ కు వినతిపత్రం అందజేత*


మధురవాడ


అనంతపురం జిల్లా రాప్తాడు లో ఈనెల 18వ తేదీన సిద్ధం సభలో వైయస్సార్సీపి కొందరు కార్యకర్తలు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ పై కొందరు వ్యక్తులు అతి దారుణంగా దాడి చేసిన సంఘటనను ఖండిస్తూ మధురవాడ జర్నలిస్టు మిత్రుల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి మంగళవారం నిరసన కార్యక్రమం,మరియు పీ.ఎం.పాలెం సిఐ వై రామకృష్ణ కు మధురవాడ జర్నలిస్టులు వినతిపత్రం సమర్పించారు. దాడి చేసిన వ్యక్తులను చట్టపరంగా కఠినంగా శిక్షించి, పత్రిక స్వేచ్ఛను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. ముందుగా జీవీఎంసీ జోన్ -2 కార్యాలయం అంబెడ్కర్ విగ్రహం వద్ద ఆంధ్ర జ్యోతిపత్రికా ప్రతినిధి పై దాడిని నివసిస్తూ పత్రికా స్వేచ్ఛను కాపాడాలని నినదించారు. అంబేద్కర్ విగ్రహం నుండి పీఎం పాలెం పోలీస్ స్టేషన్ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మధురవాడ జర్నలిస్ట్ మిత్రులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లకు (CAPF) సైనిక స్నేహ మిలన్ కార్యక్రమం జరిగింది

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అమరావతి అధ్యక్షులు కే ఆర్ సూర్యనారాయణ రాజు మీడియా సమావేశం