జనసేన పార్టీ కార్యాలయంపై గుర్తు తెలియని డ్రోన్ చక్కర్లు

 *జనసేన పార్టీ కార్యాలయంపై గుర్తు తెలియని డ్రోన్ చక్కర్లు* 



మంగళగిరి,పెన్ కౌంటర్ న్యూస్ : మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంపై గుర్తుతెలియని డ్రోన్ ఎగరడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈరోజు మధ్యాహ్నం 1:30 నుంచి 1:50 గంటల వరకూ దాదాపు 20 నిమిషాల పాటు డ్రోన్ ఎగిరినట్లు జనసేన నేతలు గుర్తించారు. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బందికి పార్టీ నేతలు తెలియజేశారు. దీంతో భద్రతాపరమైన కారణాల దృష్ట్యా డీజీపీ కార్యాలయానికి డిప్యూటీ సీఎం కార్యాలయ సిబ్బంది సమాచారం అందించారు. అలాగే గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు సైతం విషయాన్ని తెలియజేశారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లకు (CAPF) సైనిక స్నేహ మిలన్ కార్యక్రమం జరిగింది

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,