ప్రజా సమస్యల పరిష్కార వేదిక
*పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ B.కృష్ణా రావు ఐపిఎస్ .*
★ ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్ధిక,ఆస్తి తగాదాలు,మోసం మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి 111 ఫిర్యాదులు అందాయి.
★ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించడానికి కృషి చేయాలని ఎస్పీ సూచించారు.
★ చిలకలూరిపేట మండలం కావూరు గ్రామానికి చెందిన ఫిర్యాది డ్వాక్రా గ్రూప్ యానిమేటర్ గా పనిచేస్తున్నట్లు, ఆమెకు చిలకలూరిపేట లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నందు అకౌంట్ ఉన్నట్లు,ఫిర్యాది ఖాతా నుండి 99,500/- రూపాయలు వేరే ఖాతా కు బదిలీ అయినట్లు బ్యాంక్ వారు తెలిపినట్లు, కావున తన ప్రమేయం లేకుండా వేరే ఖాతాకు బదిలీ అయిన విషయం గురించి విచారణ చేసి న్యాయం చేయవలసిందిగా ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది.
★ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలోఎస్పీ తో పాటు అదనపు ఎస్పీ (అడ్మిన్) JV. సంతోష్ హాజరు అయినారు.

Comments
Post a Comment