విజయ్ దివాస్ సందర్భంగా ఎన్సీసీ కాడెట్స్ క్యాండిల్ ర్యాలీ
*విజయ్ దివాస్ సందర్భంగా ఎన్సీసీ కాడెట్స్ క్యాండిల్ ర్యాలీ*
ప్రతి సంవత్సరం డిసెంబర్ 16న జరుపుకునే *విజయ్ దివాస్* సందర్భంగా, *05-Coy NCC* ఆధ్వర్యంలో *నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాల* ఆవరణలో ఘనంగా *విజయోత్సవ క్యాండిల్ ర్యాలీ* నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి *కళాశాల వైస్ చైర్మన్ శ్రీ మిట్టపల్లి చక్రవర్తి గారు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.* ఆయన మాట్లాడుతూ, 1971 భారత–పాకిస్తాన్ యుద్ధంలో భారత సైన్యం సాధించిన చారిత్రాత్మక విజయాన్ని స్మరించుకునే రోజే విజయ్ దివస్ అని తెలిపారు. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన అమర జవాన్ల త్యాగాలు ఎప్పటికీ స్మరణీయమని పేర్కొంటూ, యువతలో దేశభక్తి భావం మరింత బలపడాలని ఆకాంక్షించారు.
అనంతరం *కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎస్. వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ*, విజయ్ దివస్ వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ మరియు సేవాభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఎన్సీసీ శిక్షణ ద్వారా నాయకత్వ లక్షణాలు వికసిస్తాయని, ప్రతి క్యాడెట్ దేశ సేవనే పరమ లక్ష్యంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు.
కళాశాల ఎన్సీసీ అధికారి లెఫ్టినెంట్ మెడికొండ రాజేష్ బాబు గారి సారథ్యంలో నిర్వహించిన ఈ క్యాండిల్ ర్యాలీ, వీర సైనికుల త్యాగాలను స్మరించుకోవడం మరియు దేశభక్తి భావాలను ప్రజల్లో మరింత విస్తరింపజేయడం లక్ష్యంగా సాగింది.
*ఈ సందర్భంగా క్యాడెట్లు పెద్ద ఎత్తున దేశభక్తి నినాదాలు చేస్తూ, దేశంలోని ప్రతి ఒక్కరూ విజయ్ దివస్ను గర్వంగా గుర్తుచేసుకోవాలని పిలుపునిచ్చారు.*
ఈ *కార్యక్రమంలో సుమారు 150 మంది ఎన్సీసీ క్యాడెట్లు ఉత్సాహంగా పాల్గొని, జాతీయ ఐక్యత, త్యాగం మరియు కర్తవ్య నిష్ఠపై సమాజానికి బలమైన సందేశాన్ని అందించారు.*
ఈ కార్యక్రమంలో కళాశాల డీన్ డా. పి. హరికృష్ణ ప్రసాద్ గారు, సీనియర్ క్యాడెట్లు Ch. మణి కుమార్, P. గీతా, N. సాహిత్య రెడ్డి, K. గురుసాయి, B. కిషోర్ బాబుతో పాటు బోధనా మరియు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.



Comments
Post a Comment