*రాష్ట్ర డీజీపీకి టీడీపీ అధినేత నారాచంద్రబాబునాయుడు లేఖ*

జర్నలిస్టులు, మీడియా సంస్థలపై దాడుల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబునాయుడు లేఖ* 


*రెచ్చగొట్టే వ్యాఖ్యలతో మీడియాపై దాడులకు కారణమైన ముఖ్యమంత్రిపై తగు చర్యలు తీసుకోవాలని లేఖలో కోరిన చంద్రబాబు* 


*లేఖలో పేర్కొన్న అంశాలు..* 

• వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మీడియాపై దాడులు పెరిగిపోయాయి.. మీడియా స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలుగుతోంది. 

• మీడియా సంస్థలు, జర్నలిస్టులు, ఫోటో గ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్ పై దాడులు నిత్యకృత్యమయ్యాయి. 

• రానున్న ఎన్నికల నేపథ్యంలో కుట్రపూరితంగా వైసీపీ రౌడీలు మీడియాపై దాడులను తీవ్రతరం చేశారు. 

• గత వారం రోజుల వ్యవధిలో జరిగిన నాలుగు దాడులను లేఖలో ప్రస్తావించిన చంద్రబాబు. 

• అమరావతిలో న్యూస్ టుడే కంట్రీబ్యూటర్ పరమేశ్వరరావు, రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫోటో గ్రాఫర్ శ్రీకృష్ణ, కర్నూలులో ఈనాడు కార్యాలయంపై దాడి, మద్దికెరలో ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ వీరశేఖర్ పై దాడులను లేఖలో ప్రస్తావించిన చంద్రబాబు. 

• చొక్కా చేతులు మడతపెట్టండి అంటూ ముఖ్యమంత్రి హింసను ప్రేరేపించేలా వ్యాఖ్యలు చేయడమే రాష్ట్రంలో నేటి పరిస్థితికి కారణం. 

• ముఖ్యమంత్రిగానీ, మంత్రులుగానీ దాడులను ఖండించకపోగా వాటిని ప్రోత్సహించేలా వ్యాఖ్యానించారు.

• ముఖ్యమంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే ఈ దాడులు జరుగుతున్న కారణంగా సీఎం జగన్‍పై చర్యలు తీసుకోవాలి.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం