Skip to main content

Posts

Showing posts from January, 2025

రాష్ట్ర ప్రజలను మరోసారి చంద్రబాబు నాయుడు మోసం చేసాడు - మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు

 విజయవాడ 31-01-2025 ప్రచురణార్ధం *రాష్ట్ర ప్రజలను మరోసారి చంద్రబాబు నాయుడు మోసం చేసాడు - మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు* *చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు అమలు చేయని వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం మాత్రమే* *జగన్ మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ పధకాలు అందిస్తామని ఎన్నికల ముందు రాష్ట్రంలో ప్రజలను నమ్మబుచ్చి కూటమి ప్రభుత్వం అధికారం చెప్పట్టింది* *ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ఆలా చేయలేకపోతే ప్రజలకు తమ కాలర్ పట్టుకునే అవకాశం కూడా కల్పిస్తున్నామని నారా లోకేష్ అన్న మాట వాస్తవమా కాదా ?* *చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే పులి నోట్ల తలకాయి పెట్టినట్లు ఉంటుందని ప్రజలందరూ ఆలోచించాలని ఎన్నికల ముందే జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజలకు విన్నవించుకున్నారు* *కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలలలో రూ 1.19 లక్షల కోట్ల రూపాయలను అప్పులు తెచ్చారు, కానీ ఎక్కడ ఇచ్చిన ఏ ఒక్క హామీలను  నెరవేర్చలేదు* *వాలంటీర్లకు పది వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి కానీ నేడు అబ్బద్దపు మాటలతో కూటమి ప్రభుత్వం వాలంటీర్ల గొంతు కోసింది* *జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో రెండున్నర సంవత...

సీఐ శ్రీను గారి కుమార్తె వివాహ వేడుకల్లో శాసనసభ్యులు కృష్ణప్రసాదు గారు.

 సీఐ శ్రీను గారి కుమార్తె వివాహ వేడుకల్లో శాసనసభ్యులు కృష్ణప్రసాదు గారు. ఎన్టీఆర్ జిల్లా, హనుమాన్ జంక్షన్, 31.01.2025. గతంలో మైలవరం, ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వర్తించిన పలివెల శ్రీను గారి కుమార్తె వివాహ వేడుకలలో మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారు పాల్గొన్నారు. హనుమాన్ జంక్షన్ లో ఎస్వీ కన్వెన్షన్ హాల్లో నవితశ్రీ గారు, రాహుల్ గారి వివాహ వేడుకలు శుక్రవారం జరిగాయి. ఈ వివాహ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు నూతన వధూవరులను ఆశీర్వదించి, వారికి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. స్ధానిక పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ (ASER) 2024 ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని గ్రామీణ పాఠశాలల్లోని విద్యార్థులలో గణనీయమైన అభ్యాస అంతరాలను వెల్లడించింది,

 రెండు రాష్ట్రాల ప్రభుత్వాధినేతలారా... మా ప్రశ్నలకు సమాధానం చెప్పండి...?? విచారణకు సిద్ధం కండి... మా బిడ్డలకు అక్షరం నేర్పండి... ఉన్నత విద్య ను అందించండి.... ASER 2024 అధ్యయనం ప్రకారం... యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ (ASER) 2024 ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని గ్రామీణ పాఠశాలల్లోని విద్యార్థులలో గణనీయమైన అభ్యాస అంతరాలను వెల్లడించింది,  ఇది  అక్షరాస్యత మరియు సంఖ్యా నైపుణ్యాల జాతీయ ధోరణికి అద్దం పడుతుంది.  @ఇది అత్యంత ప్రమాదకరమైన పరిణామం.. @ తల్లిదండ్రులుగా ప్రభుత్వాలను రెండు విషయాలను అడుగుతున్నాం...?? ₹ మన బిడ్డల విద్య కోసం... ప్రభుత్వాలు ఏటా చేస్తున్న ఖర్చు ఎంత తెలుసా..? @ ఆంధ్రప్రదేశ్ లో విద్య కోసం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2023-24లో  పాఠశాల విద్య కోసం ...32,198.39 కోట్లు ... 2024-25 లో పాఠశాల విద్య కోసం  ...₹29,909 కోట్లు కేటాయించింది. @ నా తెలంగాణ విషయానికొద్దాం.. 2024-25 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ విద్యా బడ్జెట్... ₹21,292 కోట్లు,   2023-24లో కేటాయించిన ₹19,093 కోట్లు. - అక్షరం చదవడం రాయడం నేర్పని .. ఇటు వంటి విద్య కోసం..  వేలకోట్ల....

ఏపీలో వాట్సప్‌ గవర్నెన్స్‌.. ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్‌*

 *ఏపీలో వాట్సప్‌ గవర్నెన్స్‌.. ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్‌* దీనికోసం అధికారిక వాట్సప్‌ నంబర్‌ 95523 00009ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఆ ఎకౌంట్‌కు వెరిఫైడ్‌ ట్యాగ్‌ (టిక్‌ మార్క్‌) ఉంది. పౌరసేవలు అందివ్వడంతో పాటు ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వాట్సప్‌ గవర్నెన్స్‌ను ప్రభుత్వం తీసుకొచ్చింది.  తొలి దశలో మొత్తం 161 రకాల పౌర సేవలను ప్రభుత్వం అందించనుంది. రెండో విడతలో మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. తొలి విడతలో దేవాదాయ, ఇంధన, ఏపీఎస్‌ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్‌ తదితర శాఖల్లో ఈ సేవలు మొదలవుతాయి. వాట్సప్‌ సేవలతో ధ్రువపత్రాల కోసం పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలకనున్నారు. ప్రభుత్వం ఏదైనా సమాచారాన్ని పౌరులకు చేరవేయాలంటే ఈ వాట్సప్‌ ఖాతా ద్వారా సందేశాలు పంపిస్తుంది. ఒకేసారి కోట్ల మందికి ఈ సమాచారం చేరుతుంది. వరదలు, వర్షాలు, విద్యుత్తు సబ్‌స్టేషన్ల మరమ్మతులు, వైద్యారోగ్య, వ్యవసాయ, అత్యవసర, పర్యాటక, మౌలిక వసతుల అభివృద్ధి సమాచారం వంటివి అందిస్తారు.  ప్రజలు వినతులు, ఫిర్యాదులు ఇవ్వాలన...

ఉయ్యూరు....* *ముదునూరు గ్రామంలో...* *పేకాట.....*

 కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం ....🫵 *ఉయ్యూరు....* *ముదునూరు గ్రామంలో...*  *పేకాట.....* *పేకాట ఆడుతున్న 13 మందిని అదుపులోకి....* *13,850 నగదు స్వాధీనం....* *కేసు నమోదు దర్యాప్తు చేస్తున్న పోలీసులు....*

ఏపీలోకి ఎంటరైన 30 మంది మావోయిస్టులు.. DGP షాకింగ్‌ వ్యాఖ్యలు!

 Andhra Pradesh: ఏపీలోకి ఎంటరైన 30 మంది మావోయిస్టులు.. DGP షాకింగ్‌ వ్యాఖ్యలు! చత్తీస్ గడ్ లో ఇటీవల కాలంలో వరుస ఎన్ కౌంటర్లు జరుపుతున్న సంగతి తెలిసిందే. మావోయిస్టులను సమూలంగా రూపుమాపాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ వరుస దాడులు జరుగుతున్నాయి. ఇటీవల జరిపిన దాడిలో మావో అగ్రనేత చలపతి మృతి చెందారు. ఇది మావోయిస్టు పార్టీకి గట్టి దెబ్బే. దీంతో వారంతా తెలుగు రాష్ట్రాల్లో తలదాచుకునేందుకు తరలి వెళ్తున్నట్లు సమాచారం.. శ్రీకాకుళం : మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. ఆపరేషన్ కతార్ పేరుతో ముందుకు వెళుతోంది. ఇందులో భాగంగా చతిస్‌ఘడ్ రాష్ట్రంలో గత మూడు నెలలుగా భద్రత దళాలు, మావోయిస్టులకు మధ్య జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లు అందరిలో అలజడ రేపుతున్నాయి. ముఖ్యంగా మావోయిస్టులకు గట్టి పట్టున్న చత్తీస్‌ఘడ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మావోయిస్టులకు ఇది పెద్ద ఎదురు దెబ్బగానే అంతా భావిస్తున్నారు. చత్తీస్‌ఘడ్‌లో తాజాగా జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత చలపతి మృతి చెందగా ఆయన మృతదేహానికి శ్రీకాకుళం జిల్లాలోనే అంత్యక్రియలు నిర్వహించారు. చత్తీస్‌ఘడ్‌లో వరుసగా జరుగు...

మీడియా "నిజాలు-అబద్దాలుగా .., అబద్దాలు-నిజాలుగా".....మారుస్తోంది...!?*

 *కుంటి గుర్రాలపై గుడ్డి జర్నలిజం*  *రేస్ లో కొందరు జర్నలిస్టులు.* *మీడియా ప్రశ్నించేతత్వం మరిచింది...!* *మీడియా "నిజాలు-అబద్దాలుగా .., అబద్దాలు-నిజాలుగా".....మారుస్తోంది...!?*               జర్నలిజం అంటే సమాజాన్ని సంస్కరించు కోవడం కోసం ప్రతీ చెడును ప్రశ్నించడం అని మనందరికీ తెలిసిన విషయమే.ప్రతీ చెడుకి కారణమైన విషయాలను తెలుసుకోవాలంటే,ఎవరికైనా ప్రశ్నించేతత్వం ఉండి తీరాలి.ఈ తత్వం అందరి లో ఉందా....?అంటే....ఈ ప్రశ్నించేతత్వం చాలా తక్కువమందిలో మాత్రమే ఉంటుంది.ఇకపోతే ప్రశ్నించేతత్వానికి పర్యాయపదంగా ఉన్న జర్నలిజం "ప్రశ్న", 'ప్రశ్నించు' అనే విధానాన్ని తమలో ఇముడ్చుకుని ఉంది.సమాజంలో జరుగుతున్న ప్రతీ చెడును ప్రశ్నించి సమాధానం రాబట్టి "నిజం" ఈ సమాజానికి, ప్రభుత్వానికి బట్టబయలు చేయడమే జర్నలిజం ముఖ్యమైన పని అని తెలుసుకోవాలి. ఈ సమాజంలో ఎంతోమంది ప్రజలు,ఎన్నో వ్యవస్థలు, బలహీన వర్గాలు,పీడిత- బాధిత వర్గాల ప్రజలు  న్యాయంకోసం గొంతెత్తి ప్రశ్నించలేని పరిస్థితులు ఏనాటినుండో ఉన్నాయి. ఇటువంటివారి వాయిస్ వినిపించేందుకు,చూయించేందుకు వారి పక్షాన ఉండాల్సిన మీడియ...

కృష్ణాజిల్లా మచిలీపట్నం* *ఔరా...!? ఇవేం స్టెప్పులు కలెక్టర్ సారూ..!

 *కృష్ణాజిల్లా మచిలీపట్నం*  *ఔరా...!? ఇవేం స్టెప్పులు కలెక్టర్ సారూ..!*  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కలెక్టర్ దంపతుల డ్యూయెట్ సాంగ్ వీడియోలు  రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ లో పలు సినిమాల్లోని డ్యూయెట్ సాంగ్స్ కు స్టెప్పులు వేసిన కలెక్టర్ దంపతులు..   కలెక్టర్ దంపతుల డ్యాన్స్ వీడియోలను చూసి ఔరా అంటున్న ప్రజలు..  రిపబ్లిక్ డే అంటే ఓ పవిత్రమైన రోజు, దేశం గర్వించదగ్గ రోజు..  మన భారతదేశ రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు..  ఈ రోజు ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తి ఉప్పొంగుతుంది..  కానీ ఈ కలెక్టర్ గారు మాత్రం ఉదయం దేశ భక్తి సేవలో తరించి.. సాయంత్రం డ్యూయెట్ సాంగ్స్ కు డ్యాన్స్ వేసి జిల్లా అధికారులను అలరించడం చర్చనీయాంశంగా మారింది..  రిపబ్లిక్ డే సందర్భంగా ఆదివారం సాయంత్రం కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తన క్యాంప్ కార్యాలయంలో జిల్లా అధికారులకు 'AT HOME' పేరిట తేనేట్ విందు ఇచ్చారు..  ఈ వేడుకల్లో కలెక్టర్ బాలాజీ దంపతులు పలు డ్యూయెట్ సాంగ్స్ కు స్టెప్పులు వేశారు..  కలెక్టర్ దంపతుల డ్యాన్స్ కు జిల్లా అధికారులు మైమరచిపోయారు..  వాళ్లు కూడా కలె...

హెల్మెట్ తో డ్రైవ్ చెయ్యండి- సురక్షితంగా ఇంటికి వెళ్ళండి*

డీటీసీ కార్యాలయం, విజయవాడ. తేదీ: 28.01.2025 *హెల్మెట్ తో డ్రైవ్ చెయ్యండి- సురక్షితంగా ఇంటికి వెళ్ళండి* *బైక్ ర్యాలీని ప్రారంభించిన డిటిసి ఏ మోహన్ డిసిపి కృష్ణమూర్తి నాయుడు*       జిల్లాలో రోజు రోజుకు రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతున్నాయని, ప్రమాదాలు తగ్గించే దిశగా ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని డీటీసీ ఎ. మోహన్, డీసీపీ కృష్ణమూర్తి నాయుడు అన్నారు.          జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లా రవాణా పోలీసు శాఖల  ఆధ్వర్యంలో మంగళవారంనాడు బైక్  ర్యాలీ ని డీటీసీ ఎ. మోహన్, డీసీపీ కృష్ణమూర్తి నాయుడు ప్రారంభించారు. బందర్ రోడ్ లోని డిటిసి కార్యాలయం నుండి మొదలై పోలీస్ కంట్రోల్ రూమ్ మీదగా బెంజ్ సర్కిల్ మరల డిటిసి కార్యాలయం వరకు బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా డిటిసి మోహన్ మాట్లాడుతూ ప్రజలలో హెల్మెట్ పై పూర్తి అవగాహన కల్పించేందుకు రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా పోలీసు, రవాణాశాఖ అధికారులతో సంయుక్తంగా బైక్ ర్యాలీ ని నిర్వహించడం జరిగిందని ఆయన అన్నారు. జరిగిన రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ శాతం నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వలన ...

పోలీసుల వల్లే మా కొడుకు చనిపోయాడు మృతుడి తండ్రి ఆవేదన

 కడప  పులివెందుల  పోలీసుల వల్లే మా కొడుకు చనిపోయాడు  మృతుడి తండ్రి ఆవేదన  న్యాయం చేయాలంటూ రోడ్డుపై పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా  భార్య తల్లి తండ్రి పిల్లలతో కలిసి రోడ్డుపై న్యాయపోరాటం ఈ సంఘటన సంఘటన హృదయ విధారకం

ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్: డీజీపీ

 ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్: డీజీపీ AP: రాష్ట్రంలో సైబర్ క్రైమ్ పెరిగిందని.. ఇతర నేరాలు తగ్గి ఈ కేసులు పెరుగుతున్నాయని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. శ్రీకాకుళంలో మాట్లాడుతూ.. “సైబరైమ్ అనేది దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న అంశం. దీనిని ఎలా అదుపు చేయాలని ఆలోచిస్తున్నాం. ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్ పెట్టాలని యోచిస్తున్నాం. నిపుణులను ఉపయోగించుకోవడం.. ప్రజల్లో అవగాహన కల్పించడం ముఖ్యం” అని పేర్కొన్నారు.

బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జిల్లా అభివృద్ధిపై సమీక్ష సమావేశంలో

 బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జిల్లా అభివృద్ధిపై సమీక్ష సమావేశంలో ముఖ్యఅతిథిగా జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల, గృహ నిర్మాణశాఖల మంత్రి కొలుసు పార్థసారథి గారు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు, జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి గార్లతో కలిసి బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ప్రకర్ జైన్ గారు, వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు గారు ,చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య గారు అదికారులు పాల్గొన్నారు.

మాజీ ఎంపీ నందిగామ సురేష్ కు బెయిల్ మంజూరు చేసిన మంగళగిరి కోర్టు.

 BREAKING NEWS  మాజీ ఎంపీ నందిగామ సురేష్ కు బెయిల్ మంజూరు చేసిన మంగళగిరి కోర్టు.

సర్వీసులో ఉంటూ మరణించిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల అంత్యక్రియలకు రూ.15వేలు మంజూరు చేసే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది

 సర్వీసులో ఉంటూ మరణించిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల అంత్యక్రియలకు రూ.15వేలు మంజూరు చేసే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర స్త్రీ, పిల్లల, వికలాంగుల & సీనియర్సిటిజన్ల శాఖ కార్యదర్శి సూర్యకుమారి గారు నేడు 28-01-2025న ఉత్తర్వులు జారీచేశారు. మరణించిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు చెందిన చట్టబద్ధమైన వారసులకు ఈ సొమ్మును చెల్లించాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

టీడీపీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రులు, పార్టీ ఇంఛార్జ్‌లతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్*

 *టీడీపీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రులు, పార్టీ ఇంఛార్జ్‌లతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్*  *ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాలు, నేతల పనితీరు వంటి అంశాలపై ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్*  *CUBSలో సభ్యులుగా ఉంటేనే నామినేటెడ్ పదవులకు సిఫారసులు చేయాలని నేతలకు సూచన* *టెలీకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించిన అంశాలు :-* • ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపిలు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి....కార్యకర్తలకు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి. • చరిత్రలో తిరుగులేని విజయాన్ని అందించిన ప్రజలు, కార్యకర్తల ఆశలు తీర్చేందుకు, ఆకాంక్షల మేరకు ప్రతి ఒక్కరూ పనిచేయాలి. • 2029లో మళ్లీ గెలిచేలా ప్రతి ఒక్కరి పనితీరు ఉండాలి. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను, పథకాలను ప్రజలకు వద్దకు తీసుకువెళ్లాలి. • ప్రభుత్వ పని తీరును నిరంతరం పర్యవేక్షించుకుంటూ, మెరుగుపరుచుకుంటూ పనిచేయాలి. • 7 నెలల కాలంలో ఎన్నో పథకాలు, కార్యక్రమాలు, అభివృద్ది పనులు చేపట్టాం....ఈ విషయాలను నిరంతరం ప్రజలకు వివరించాలి. • ఎన్నికల హామీల్లో ఇచ్చిన పథకాలన్నీ అమలు చేస్తాం...ఈ విషయంలో ...

టీడీపీ కూటమి పాలనలో మత్స్యకారుల సంక్షేమం మళ్లీ మొదలైంది*

 *టీడీపీ కూటమి పాలనలో మత్స్యకారుల సంక్షేమం మళ్లీ మొదలైంది* *సబ్సిడీపై పడవలు, వేట సామగ్రి* *వెంకటాచలం మండలం తిక్కవరప్పాడు వద్ద సర్వేపల్లి రిజర్వాయరులో చేపపిల్లలు విడుదల చేసిన సందర్భంగా శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*  మీనోత్సవంలో భాగంగా ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన కింద సర్వేపల్లి రిజర్వాయర్ లోకి 5.62 లక్షల చేప పిల్లలను రిజర్వాయరులోకి వదిలాం చేప పిల్లల కోసం 60 శాతం నిధులు ప్రభుత్వం సమకూరిస్తే, 40 శాతం మత్స్యకార సొసైటీ భరిస్తుంది అనికేపల్లి, తిక్కవరప్పాడు, సర్వేపల్లితో పాటు 11 గ్రామాలకు చెందిన 500 మంది ఎస్సీ, ఎస్టీ మత్స్యకారులకు చేపల వేట ద్వారా లబ్ధిచేకూరుతుంది వేట సమయంలో చిన్నపిల్లలను కాకుండా పెద్దచేపలను మాత్రమే పట్టుకోవాలి గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో క్రమం తప్పకుండా చేపపిల్లలను వదిలి మత్స్య సంపద వృద్ధి కోసం కృషి చేశాం గత ఐదేళ్లలో రెండు, మూడు సార్లు మాత్రమే పిల్లలను వదిలారు. అది కూడా సక్రమంగా జరగలేదు  మత్స్యకార సంక్షేమ పథకాలన్నింటిని నిలిపేశారు మత్స్య శాఖ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలను టీడీపీ కూటమి ప్రభుత్వం తిరిగి అమలు చేస్తోంది బోట్లు, వలలు, వేట సామగ్రిని సబ్...

ఎంపి కేశినేని శివ‌నాథ్ ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన అనంత‌పురం ఎంపి

 *ప్ర‌చుర‌ణార్థం* *28-01-2025* ఎంపి కేశినేని శివ‌నాథ్ ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన అనంత‌పురం ఎంపి  విజ‌య‌వాడ : అనంత‌పురం ఎంపి అంబికా జి. ల‌క్ష్మీనారాయ‌ణగురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో   మంగ‌ళ‌వారం  విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఎంపి కేశినేని శివ‌నాథ్ కు  ఎంపి ల‌క్ష్మీనారాయ‌ణ పుష్ప‌గుచ్ఛం అందించారు. అనంత‌రం పార్ల‌మెంట్ లో జ‌ర‌గ‌బోయే బ‌డ్జెట్ స‌మావేశాల్లో చ‌ర్చించాల్సిన అంశాల‌తో పాటు రాష్ట్ర రాజ‌కీయాల‌పై మాట్లాడుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎన్టీఆర్ జిల్లా టిడిపి ఉపాధ్య‌క్షుడు గుర్రం కొండ‌య్య‌, విజ‌య‌వాడ  వాల్మీకి బోయ సంఘం అధ్య‌క్షుడు వ‌రిగే న‌రసింహారావుల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

జనసేన నాయకులు పంచాయతీ కార్యదర్శి మధ్య ఘర్షణ

 *జనసేన నాయకులు పంచాయతీ కార్యదర్శి మధ్య ఘర్షణ* ఎన్టీఆర్ జిల్లా:  గన్నవరం నియోజకవర్గం÷ విజయవాడ రూరల్ మండలం ఎనికెపాడు సెంటర్ లో జనసేన నాయకులకు పంచాయతీ కార్యదర్శి మధ్య ఘర్షణ.... వంగవీటి రంగా విగ్రహం, మహాత్మా గాంధీ విగ్రహాలు ఆవిష్కరించే విషయంపై జనసేన నాయకులు కార్యకర్తల మధ్య తోపులాట.... స్థానిక జనసేన కార్యకర్తలకు తెలియకుండా ఎందుకు నిర్వహిస్తున్నారు అంటూ కార్యకర్తలు నాయకులను నిలదీత.... జనసేన గన్నవరం నియోజకవర్గ ఇన్చార్జి చలమలశెట్టి రమేష్ బాబు ఎనికెపాడు పంచాయతీ కార్యదర్శి పై దురుసు వాక్యాలు.... ఎనికేపాడు పంచాయితీ కార్యదర్శిని పట్టుకొని నువ్వు ఎంత నీ బ్రతుకు ఎంత అన్న చలమల శెట్టి రమేష్ బాబు... పంచాయితీ కార్యదర్శిని పట్టుకొని నువ్వు మా పాలేరువి అన్న జనసేననేత చెలమలశెట్టి రమేష్ బాబు.

ఎల్.ఓ.సిలు అందజేసిన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్

 ఎల్.ఓ.సిలు అందజేసిన ఎమ్మెల్యే కృష్ణప్రసాదు ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, గొల్లపూడి, 28.01.2025. మైలవరం నియోజకవర్గంలో  5 గురికి లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్.ఓ.సి) కింద రూ.4.97 లక్షలు మంజూరయ్యాయి. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారు ఈ సాయాన్ని ఎల్.ఓ.సిల రూపంలో లబ్ధిదారులకు మంగళవారం అందజేశారు. వీటితోపాటు సీఎం చంద్రబాబు గారి సందేశ పత్రాలను కూడా లబ్ధిదారులకు అందజేశారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి కోలుకున్న విధానం గురించి ఆరా తీశారు.  ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబు గారికి, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమాల్లో ఎన్డీఏ కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు అండగా వైసిపి ‘పోరుబాట’

 విద్యార్థులకు అండగా వైసిపి ‘పోరుబాట’ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వర్గాలను దగా చేస్తున్న కూటమి ప్రభుత్వం పై పార్టీపరంగా పోరుబాటకు వైసిపి అధినేత జగన్ పిలుపునిచ్చారు.దీనిలో భాగంగా ఫిబ్రవరి 5వ తేదీన ఫీజు పై పోరుబాటకు వైసిపి సిద్ధమవుతోంది.ఫీజు రియింబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలంటూ అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలకు చేపట్టబోతోంది.పెండింగ్ బకాయిలు విడుదల చేయాలంటూ విద్యార్థులు,తల్లిదండ్రులతో కలిసి కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి వినతిపత్రం అందించనుంది.

ఎంపి కేశినేని శివ‌నాథ్ స్క్రోలింగ్ పాయింట్స్* *28-01-2025*

 *ఎంపి కేశినేని శివ‌నాథ్ స్క్రోలింగ్ పాయింట్స్* *28-01-2025* *ప్ర‌ధాన‌మంత్రి సూర్య‌ఘ‌ర్ ముఫ్త్ బిజిలి యోజ‌న పధకం పై విజయవాడ పటమట సెంటర్ లో అవగాహన ర్యాలీ  *ర్యాలీ లో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్, కలెక్టర్ లక్ష్మీ శ, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, విద్యుత్ శాఖ అధికారులు, టిడిపి నాయకులు  *పంటకాలువ రోడ్ నుంచి ఫన్ టైమ్ క్లబ్ వరకు సాగిన ర్యాలీ *పీఎం సూర్య ఘ‌ర్ తో ఎన్టీఆర్ జిల్లాలోని ప్ర‌తి ఇంట్లో నూతన వెలుగులు నిండాలని ఆకాంక్షించిన ఎంపీ కేశినేని శివనాథ్  *కుటుంబాల‌కు ఆర్థిక చేయూత‌కు, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు మేలు చేసే ప‌థ‌కం పీఎం సూర్య ఘ‌ర్ *సోలార్ ప్యానెల్ ఏర్పాటు తో సౌర‌శ‌క్తి ద్వారా కాలుష్యం లేని ప‌ర్యావ‌ర‌ణ హిత ఇంధ‌నాన్నిపొందే అవ‌కాశం *అధిక‌రాయితీతో , అతి త‌క్కువ ఖ‌ర్చుతో సోలార్ సిస్ట‌మ్ ఏర్పాటు చేసుకుని విద్యుత్ బిల్లుల భారం త‌గ్గించుకోవ‌చ్చు *ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ శ వచ్చిన దగ్గర నుంచి పీఎం సూర్య ఘర్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు  *జిల్లా అధికారులు,  కూటమి నాయకులు పీఎం సూర్య ఘర్ ద్వారా సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసుకొని, మరో మూడు ఇళ్ళకి సోలార్ ప్యా...

మంగళగిరి నియోజకవర్గం ఎర్రబాలెం గ్రామంలో దారుణం...

 మంగళగిరి నియోజకవర్గం ఎర్రబాలెం గ్రామంలో దారుణం... కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి గాజుల పావని(32) వివాహిత అకాల మృతి. కు.ని ఆపరేషన్ చేస్తూ...తెనాలి వైద్యుని నిర్గక్షం.  చిన్న ప్రేగుకు,  యూరినరీ బ్లాడర్ కు 2.5cm×2.5cm గాయంచేసి...నిర్లక్ష్యం గ వ్యవహరించిన తెనాలి వైద్యులు. మహిళ శరీరం ఒక్క రోజు వ్యవధిలోనే...విషితుల్యమై... సెప్టసీమియా కారణంగా షాక్ లోకి వెళ్లిన గాజుల పావని... హుటాహుటిన..గుంటూరు సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు....  వైద్యుల చివరి ప్రయత్నం ఫలించని కారణంగా మృతి. పోస్టుమార్టం కోసం శవాగారానికి తరలింపు.

ఏలూరు కలెక్టరేట్...

 *మన మంచి కలెక్టర్*  *పేద ప్రజల పెన్నిధి* *మన ఏలూరు -  మన వెట్రి సెల్వి గారు* *గిరిజన యువకుడు పట్ల కలెక్టర్ స్పందన భేష్* *కొనసాగుతున్న బహుజన సేన సామాజిక సేవలు* ఏలూరు కలెక్టరేట్... ప్రతి సోమవారం ఏలూరు జిల్లా నుండి అనేకమంది తమ సమస్యలపై పిజిఆర్ఎస్ ద్వారా కలెక్టర్ గారికి అందజేస్తూ ఉంటారు అయితే ఈరోజు గ్రీవెన్స్ లో టీ.నర్సాపురంకి చెందిన జె శ్రీను అనే వ్యక్తి మెరుగైన వైద్యం కోసం బహుజన సేన టీమ్ సహాయం కోరగా వారిని సంఘ అధ్యక్షులు మత్తే బాబి, సలహాదారులు ఊదరకొండ కుమార రాజా,జిల్లా ఉపాధ్యక్షులు దాసరి అబ్బులు,ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి గారి వద్దకు సమస్యను తీసుకుని వెళ్లడం జరిగింది,గాయాలతో తల్లడిల్లిన గిరిజన యువకుడి పట్ల కలెక్టర్ గారి స్పందన చూసి బాధితుని కుటుంబ సభ్యులు,ఇతర అర్జీదారులు సంతోషం వ్యక్తం చేశారు, బాధితుని ప్రస్తుత పరిస్థితి స్వయంగా తెలుసుకుని తక్షణమే మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.ఇది చూసిన పలువురు అర్జీదారులు ఏదేమైనా పనిచేసే ఇటువంటి కలెక్టర్ దొరకడం మన అదృష్టం అని అన్నారు. *బహుజన సేన - రేపటి తరం కోసం,రి.నెం 277/23 ఏలూరు 9347355557*

నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఏపీ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*

 *నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఏపీ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము* *యువగళం పాదయాత్రకు రెండేళ్లు పూర్తి కావడంతో.....మంత్రి లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే* *ప్రజలకు మంచి చేయడంలో....నాలో స్ఫూర్తి నింపిన నేతల్లో లోకేష్ ఒకరు....* గుడివాడ జనవరి 27:యువగళం పాదయాత్రతో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ ఏపీలో సరికొత్త అధ్యాయం సృష్టించారని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు.యువగళం పాదయాత్ర రెండేళ్లు పూర్తి కావడంతో మంత్రి లోకేష్ కు ఎమ్మెల్యే రాము శుభాకాంక్షలు తెలిపారు.  ఐటీ,మానవవనరుల శాఖ మంత్రివర్యులు నారా లోకేష్‌  ఒక సామాన్య వ్యక్తిగా  పాదయాత్ర చేసి ఈ రాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి యువ నేత లోకేషే కీలక పాత్ర పోషించారు అని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు.అయిదేళ్ల అరాచక పాలనపై సమరశంఖం పూరించి రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన చారిత్రాత్మక యువగళం పాదయాత్ర నేటితో రెండేళ్లు పూర్తి కావడం సంతోషకరమన్నారు. రాష్ట్రంలో 5కోట్లమంది ఆశలు, ఆశయాలను ప్రతిబింబిస్తూ కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాల చెంత నుంచి ...

నారాయణ, శ్రీ చైతన్య విద్యాసంస్థలకు తొత్తుగా మారిన కూటమి ప్రభుత్వం*

 రాయచోటి  అన్నమయ్య జిల్లా 27/01/2025 *నారాయణ, శ్రీ చైతన్య విద్యాసంస్థలకు తొత్తుగా మారిన కూటమి ప్రభుత్వం*  *కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఆత్మహత్యలు జరుగుతున్న పట్టించుకోని అధికారులు*  *ఫీజుల పేరుతో విద్యార్థుల ప్రాణాలను బలి కోరుతున్న కార్పొరేట్ విద్యా సంస్థలు*    * అంబేద్కర్ విగ్రహం ముందు వామపక్ష విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో నిరసన....* ---------------------------------------------        నారాయణ, శ్రీ చైతన్య విద్యాసంస్థలకు తొత్తుగా మారిన కూటమి ప్రభుత్వం అని పీ.డీ.ఎస్.యూ జిల్లా అధ్యక్షుడు నేతి నాగేశ్వర, ఎస్ఎఫ్ఐ జిల్లా నరసింహులు సర్వేపల్లి అన్నారు.            సోమవారం స్థానిక రాయచోటి పట్టణంలోని మాసాపేట అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నారాయణ, శ్రీ చైతన్య కళాశాలలు విద్యార్థులపై ఫీజులు చెల్లించాలని తీవ్రమైన వేధింపులు గురిచేస్తూ, ర్యాంకుల కోసం విద్యార్థుల మధ్య తారతమ్యాలు సృష్టిస్తూ విద్యార్థుల మరణాలకు కారణమైన కార్పొరేట్ విద్యా సంస్థల యజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని  డి...

ఆటోమోటివ్ ఇంజినీరింగ్‌లో సరికొత్త ఆవిష్కరణ అయిన *స్కోడా* కైలాక్ యొక్క ప్రత్యేకమైన లాంచ్

 మీడియా ఆహ్వానం*... *ప్రియమైన మీడియా మెంబర్* ఆటోమోటివ్ ఇంజినీరింగ్‌లో సరికొత్త ఆవిష్కరణ అయిన *స్కోడా* కైలాక్ యొక్క ప్రత్యేకమైన లాంచ్ ఈవెంట్‌కు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. ఈ ఈవెంట్ స్కోడాకు ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది, ఎందుకంటే మేము ఈ అత్యాధునిక వాహనాన్ని దాని విభాగంలో భద్రత మరియు లగ్జరీని పునర్నిర్వచించటానికి రూపొందించాము. వేదిక :- *మహావీర్ స్కోడా షోరూమ్, D.No. 5-28, NH 5, ప్రసాదంపాడు, విజయవాడ* తేదీ: 27 జనవరి 2025 (సోమవారం) *సమయం: సాయంత్రం 6:00 నుండి* *మీడియాలో విశిష్ట సభ్యునిగా, ఈ విశేషమైన సంఘటనను కవర్ చేయడంలో మీ ఉనికి అమూల్యమైనది. మీ మద్దతు మరియు భాగస్వామ్యం *స్కోడా* అంటే ఆవిష్కరణ మరియు శ్రేష్ఠతను ప్రదర్శించడంలో మాకు సహాయపడుతుంది ఈ ప్రత్యేక సందర్భం యొక్క మీ దయ మరియు కవరేజీ కోసం మేము హృదయపూర్వకంగా ఎదురుచూస్తున్నాము. హృదయపూర్వక నమస్కారములు, CH. రాజా (జనరల్ మేనేజర్, మహావీర్ స్కోడా) *Mīḍiyā āhvānaṁ*...