బిక్కుబిక్కుమంటున్న కోవీషీల్డ్ గ్రహీతలు

 *బిక్కుబిక్కుమంటున్న కోవీషీల్డ్ గ్రహీతలు


*


బిక్కుబిక్కుమంటున్న కోవీషీల్డ్ గ్రహీతలు

దేశంలోని కోట్లాది మంది కోవీషీల్డ్ టీకానే తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నేరుగా కొవాక్సిన్, కొవిషీల్డ్ సేకరించి ప్రజలకు ఉచితంగా వేసింది. దేశంలో దాదాపు 85 శాతం మంది కొవాక్సిన్ లేదా కొవీషీల్డ్ మాత్రమే తీసుకున్నారు. రేర్ కండిషన్స్ లో తమ వ్యాక్సిన్ వల్ల శరీరంలో రక్తం గడ్డ కడుతుందని కొవిషీల్డ్ తయారీ కంపెనీ తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా ఆ వ్యాక్సిన్ తీసుకున్నవాళ్ల వెన్నులో వణుకు మొదలైంది.