మండల విజిలెన్స్ కమిటీ సభ్యులుగా రవి నాయక్, బేబీ విక్రమ్ నియామక ఉత్తర్వులు అందుకుంటున్న రవి నాయక్, బేబీ విక్రమ్
తాసిల్దార్ నుంచి నియామక ఉత్తర్వులు అందుకుంటున్న రవి నాయక్, బేబీ విక్రమ్ మండల విజిలెన్స్ కమిటీ సభ్యులుగా రవి నాయక్, బేబీ విక్రమ్ నియామకం చిలకలూరిపేట................ చిలకలూరిపేట మండల స్థాయి పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ కమిటీ సభ్యులుగా వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ప్రతినిధులు రవి నాయక్, బేబీ విక్రమ్లు నియమితులయ్యారు. ఈ మేరకు మండల తాసిల్దార్ షేక్ మొహమ్మద్ హుస్సేన్ గురువారం వారికి నియామక ఉత్తర్వుల ప్రతులను అందజేశారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థ (రేషన్ వ్యవస్థ) పారదర్శకంగా, సమర్థవంతంగా అమలవడానికి విజిలెన్స్ కమిటీల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా పర్యవేక్షించడం, లబ్ధిదారుల సమస్యలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకురావడం కమిటీ సభ్యుల ప్రధాన బాధ్యత అని తెలిపారు. వినియోగదారుల సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మురికిపూడి ప్రసాద్ మాట్లాడుతూ, గత నాలుగు సంవత్సరాలుగా రవి నాయక్, బేబీ విక్రమ్లు వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం–2019పై ప్రజలకు విస్తృత అవగాహన కల్...