ఘ‌నంగా అంబేద్క‌ర్ జ‌యంతి కార్య‌క్ర‌మం

 *ప్ర‌చుర‌ణార్థం* *14-04-2025*


డా. బి.ఆర్. అంబేద్కర్. తరతరాలకు తరగని స్ఫూర్తి నందించిన జాతి వైతాళికుడు

ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) కార్యాల‌యంలో ఘ‌నంగా అంబేద్క‌ర్ జ‌యంతి కార్య‌క్ర‌మం










విజ‌య‌వాడ‌: నవభారత వికాసానికి బాటలు వేసిన దార్శనికుడు.. సర్వ మానవాళి సమానత్వానికి కృషి చేసిన కారణజన్ముడు డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్క‌ర్ 135వ జ‌యంతి కార్య‌క్ర‌మం సోమ‌వారం గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో    ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈకార్య‌క్ర‌మానికి ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజ‌య్ వ‌ర్మ అధ్య‌క్ష‌త వ‌హించారు. ముందుగా  అంబేద్క‌ర్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి అంజ‌లి ఘ‌టించారు. 


ఈ సంద‌ర్భంగా మాజీ ఉడా చైర్మ‌న్ తూమాటి ప్రేమ‌నాథ్,  మాజీ మేయ‌ర్ కోనేరు శ్రీధ‌ర్, ఏపీ స్టేట్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కుల  ర‌ఘురామ‌రాజు, 

 డిక్కీ జిల్లా ఉపాధ్య‌క్షురాలు ఊడిగ రాజామ‌ణి మాట్లాడుతూ స‌మ‌స‌మాజ నిర్మాణం కోసం అంబేద్క‌ర్ చెప్పిన‌ పే బ్యాక్ సోసైటీ నినాదాన్ని ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ఆచ‌రిస్తున్నార‌ని కొనియాడారు. భారత సమాజాన్ని నిరంతరం నడిపిస్తున్న మహాశక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని.. ఆయన భావాలకు మరణం లేదని , అంబేద్క‌ర్ జ‌యంతిని  భారత ప్రజలు  మాత్రమే కాదు.. అంతర్జాతీయంగా ఎన్నో దేశాలు ఆ మహ నీయుడ్ని స్మరించుకుంటూ ఘనమైన నివాళులు అర్పిస్తున్నార‌న్నారు.


డా. బి.ఆర్. అంబేద్కర్. తరతరాలకు తరగని స్ఫూర్తి నందించిన జాతి వైతాళికుడు.ఆయన తన జ్ఞాన కిరణాలను అనేక రంగాలపై ప్రసరింప జేశాడు. దేశంలోని ప్రతి రంగంపై ఆయన ప్రభావం ఉంది. అద్భుతమైన తన మేధాశక్తితో అవిశ్రాంతంగా శ్రమించి, దేశం సర్వోతో ముఖాభివృద్ధి చెందడానికి

ఎన్నో ప్రణాళికలు రచించిన మహనీయుడంటూ అంబేద్క‌ర్ సేవ‌ల‌ను కొనియాడారు..


 అంబేద్క‌ర్ పుట్టిన రోజును ఐక్య‌రాజ్య‌స‌మితి సింబ‌ల్ ఆఫ్ నాలెడ్జ్  (జ్ఞాన దినం) గా  ప్రకటించడం,

కొలంబియా యూనివర్సిటీలో చదువుకుని ప్రపంచ మేధావులైన వారిలో ఒకరిగా అంబేద్కర్ పేరు ప్రకటించడం భార‌త‌దేశానికి చాలా గర్వకారణమైన విషయమ‌న్నారు. తెలుగుదేశం పార్టీ బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల అభ్యున్న‌తి కోసం కృషి చేస్తుంద‌ని, స‌మాజంలో పేద‌రికం నిర్మూలించ‌టానికి ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు అంబేద్క‌ర్ స్పూర్తితోనే పీ4 విధానం కార్య‌క్ర‌మం మొదలు పెట్టార‌న్నారు. పీ4 విధానం కార్య‌క్ర‌మంతో పేద ప్ర‌జ‌లకి ఆర్థికంగా  ఎంతో మేలు జ‌రుగుతుంద‌న్నారు. నేటి యువ‌త‌రం అంబేద్క‌ర్ ఆలోచ‌న‌లు, ఆశ‌యాల‌ను ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని సూచించారు. అనంత‌రం ఈ స‌భ‌కు అధ్య‌క్ష‌త వ‌హించిన ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్య‌క్షుడు సొంగా సంజ‌య్ వ‌ర్మ‌ను నాయ‌కులు ఘ‌నంగా స‌న్మానించారు. 



ఈ కార్య‌క్ర‌మంలో  తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్య‌నిర్వ‌హ‌క కార్య‌ద‌ర్శి బొప్ప‌న భ‌వ‌కుమార్, రాష్ట్ర కార్య‌ద‌ర్శి చెన్నుపాటి గాంధీ, తెలుగు దేశం పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి ప‌రిశ‌పోగు రాజేష్ (ద‌ళిత‌ర‌త్న‌), రాష్ట్ర తెలుగు మ‌హిళాఉపాధ్య‌క్షురాలు షేక్ ఆషా, టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు ప‌ర్చూరి ప్ర‌సాద్, రాష్ట్ర మైనార్టీసెల్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఫైజ‌న్, జిల్లా తెలుగు మ‌హిళా అధ్య‌క్షురాలు చెన్నుపాటి ఉషారాణి, డిక్కీ జిల్లా ఉపాధ్య‌క్షురాలు ఊడిగ రాజామ‌ణి, అంగ‌న్ వాడీ మీడియా కోఆర్డినేట‌ర్ చెరుకూరి మాధ‌వి,35వ డివిజ‌న్ బుదాలి నంద‌కూమారి , స్థానిక కార్పొరేట‌ర్ జాస్తి సాంబ‌శివ‌రావు, తూర్పు నియోజ‌క‌వ‌ర్గ ఎస్సీ సెల్ అధ్య‌క్షుడు దేవ‌ర‌ప‌ల్లి ఆంజేయులు,  విజ‌య‌వాడ అర్బ‌న్ మాజీ సెల్ అధ్య‌క్షుడు జీవిన‌ర‌సింహారావు, , ఎన్టీఆర్ జిల్లా బీసీ గౌడ్ సాధికారిక  కన్వీనర్ పామర్తి కిషోర్ బాబు,ఎన్టీఆర్ జిల్లా ఎమ్.ఎస్.ఎమ్.ఈ ప్రోగ్రామ్ కో-ఆర్డినేట‌ర్స్ మాదిగాని గురునాథం, మాజీ కార్పొరేట‌ర్  కాకు మ‌ల్లిఖార్జున యాద‌వ్, టిడిపి సీనియ‌ర్ న‌రసింహాచౌద‌రి, టిడిపి నాయ‌కులు సంకె విశ్వ‌నాథం, అంబేద్క‌రిస్ట్ మధిర ప్ర‌భాక‌ర్, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీసెల్ అధికార ప్ర‌తినిధి చుక్కా న‌రేష్ కుమార్, ప‌ల్లె పోగు ప్ర‌సాద్, ఎన్టీఆర్ జిల్లా తెలుగు దేశం పార్టీ కార్య‌ద‌ర్శి పాల‌డుగు దుర్గాప్ర‌సాద్, ఎన్టీఆర్ జిల్లా టి.ఎన్.టి.యు.సి అధికార ప్ర‌తినిధి కోడూరు ఆంజ‌నేయ‌వాసు ల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.