ఎన్నో నకిలీ స్వచ్ఛంద సంస్థలు వెలిశాయి... మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి శ్యామ్ ప్రసాద్

 పత్రికా ప్రకటన



కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛంధ సంస్థల గుర్తింపు గ్రామీణ గిరిజన ప్రాంతాలలో ఏ

విధమైన సేవలు ఎవరు చేయవచ్చును అని పటిష్టమైన చట్టాలు రూపొందించకపోవడంతో

ఎన్నో స్వచ్ఛంద సంస్థలు వెలిశాయని నకిలీ స్వచ్ఛంద సంస్థలు మహిళలను

అమయాకులైన గిరిజనులను పౌరులను మోసం చేస్తున్నాయని మానవ హక్కుల కౌన్సిల్

రాష్ట్ర కార్యదర్శి శ్యామ ప్రసాద్ అన్నారు. చాలా రాష్ట్రాలలో కులాలు మతాల పేరున విద్య

వైద్య సంస్థలు వెలిశాయని కానీ నేరాలు జరిగి పత్రికలలో వచ్చిన తర్వాత ప్రభుత్వాలు

కంటితుడుపుగా చర్యలు తీసుకుంటూ చట్టాలను అవహేళన చేస్తున్నాయని అన్నారు

సేవా సంస్థల్లో ముఖ్యంగా వినియోగదారుల హక్కులు, పర్యావరణ హక్కులు, మానవ

హక్కులు ప్రభుత్వం నుండి గుర్తింపు లేకపోయినా వాహనాలపై కార్యాలయాలపై

ఉపయోగించి ప్రభుత్వ కార్యాలయాలుగా అమాయకులను మోసం చేస్తున్నాయని శ్యామ

ప్రసాద్ ఆరోపించారు. గతంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ స్వచ్ఛంద సంస్థలు

పనితీరు హక్కులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రోత్సహించేదని గత దశాబ్ద

కాలంగా స్వచ్ఛంద సంస్థలు ప్రోత్సహించడం లేదని అన్నారు. మా సంస్థ లక్ష్యాలు,

ఆశయాలు, హక్కుల పరిరక్షణ మాత్రమే అని విద్యార్థులలో యువకులలో మానవ

హక్కులు, పర్యావరణ హక్కులు, మహిళలు బాలల హక్కులు వినియోగదారుల హక్కులపై

అవగాహన కల్పించడమే మా సంస్థ ఆశయమని ముఖ్యంగా ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ

ద్వారా రక్తదానం వంటి కార్యక్రమాలు ఎక్కువగా ప్రోతహిస్తున్నామని రాష్ట్ర అధ్యక్షులు పి

జగన్మోహన్ రావు అన్నారు.

గత 26 సంవత్సరాలుగా మానవ హక్కుల కౌన్సిల్ సభ్యులుగా ఉన్న గుండు అప్పలరాజు

మాట్లాడుతూ హక్కుల పరిరక్షణకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్

లో ఆవిర్భవించిన మానవ

హక్కుల పై అవగాహన కల్పించడం మాత్రమే లక్ష్యంగా శ్రమిస్తున్నదని అన్నారు. అయితే

మా సంస్థలో స్వలాభం స్వార్థం కోసం సభ్యత్వం తీసుకొని అటు ప్రజలను ప్రభుత్వ

ఉద్యోగులను తప్పుదారి పట్టిస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయని అన్నారు

సేవాభావం లేకుండా స్వచ్ఛంద సంస్థ సభ్యులుగా కొనసాగుతున్న వారిని తొలగించాలని

రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ప్రొఫెసర్ పై సత్యనారాయణ రాష్ట్ర కార్యవర్గాన్ని ఆదేశించారని

అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా శ్రమిస్తున్న సేవా సంస్థలను స్వచ్ఛంద

సంస్థలను గుర్తించాలని నిర్ణయించినందున మా సంస్థలో సభ్యులందరినీ తొలగిస్తూ

జాతీయ మానవ హక్కుల కమిషన్, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వివరాలు అందజేస్తామని

తెలిపారు. జూన్ 5 పర్యావరణ దినోత్సవ సందర్భంగా నిర్వహిస్తున్న సమావేశంలో తమ

విద్యార్హతలు గుర్తింపు కార్డులతో వచ్చినవారి వివరాలు క్షుణంగా పరిశీలించి మానవ

హక్కుల పరిరక్షణకు కృషి చేసేవారిని

గుర్తించి పోలీసు ఉన్నతాధికారుల అనుమతితో 2025

జూలై 12న నిర్వహిస్తున్న 26వ వార్షికోత్సవానికి ఆహ్వానిస్తామని అన్నారు. మానవ హక్కుల

కౌన్సిల్ పేరున నమోదయిన వాట్సప్ గ్రూపులతో తమ సంస్థకు సంబంధంలేదని ఉన్నత

న్యాయస్థానం ఫిర్యాదు దాఖలు చేస్తామని అన్నారు.