అమ్మ నీకు జోహార్.......

అమ్మ నీకు జోహార్....... వ్యవసాయ రంగంలో కష్టాలు వచ్చి.... నా తల్లి జైబోరన్నగారి లక్ష్మీదేవి యాదవ్ ఎన్నో కష్టాలను చవిచూసిందనీ ప్రజా సేవకుడు.... ప్రజాస్వామిక ఉద్యమకారుడు కామ్రేడ్ జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కన్నీరు పెట్టుకున్నారు.



ముందు వెనక నా అనేవారు లేక  17 డిసెంబర్ 1983 పసి బిడ్డలుగా ఉన్న... ( నా చెల్లి అప్పటికి పాలు అమ్మపాలు తాగుతుంది ) అనాధలుగా చేసి .... మమ్మల్ని వదిలి నేటికి 40 సంవత్సరాలు..అనీ బోసన్నా తన తల్లి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు... నరకాన్ని చవిచూస్తూ జన్మనిచ్చిన అమ్మ కంటిపాపలా మమ్ము  కాచి పెంచాల్సిన అమ్మ పసి పాదాలు తాకితే పులకరించాల్సిన అమ్మ బోసి నవ్వులు చూసి మురిసిపోవాల్సిన  అమ్మ బిడ్డల అడుగులు తడబడితే వేలు పట్టి  ముందుకు నడిపించాల్సిన అమ్మ   ప్రేమానురాగాలు అద్ది తీర్చి దిద్దాల్సిన అమ్మ  గోరుముద్దలు పెట్టి బిడ్డలను పెద్దవాళ్ళను చేయాల్సిన  అమ్మ బిడ్డలకు అనురాగ ఋణం పంచాల్సిన అమ్మ బాల్యంలోనే మమ్ముల ఒంటరి చేసి వెళ్ళిపోయావా తల్లి....



అమ్మ.... నీకు జోహార్... అమ్మ నువ్వెక్కడ ఉన్నా నీ మనసు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నా... నీ బిడ్డలుగా నీ మీద ఒట్టేసి చెప్తున్నా.... సమాజంలో బ్రతికినంత కాలం నాకు చేతనైతే సమాజానికి సహాయపడతాను తప్ప అపకారికి కూడా ఉపకారం చేయాలన్న నీ మాటను నిలబెడతాను తప్ప తల్లిగా నీకు చెడ్డ పేరు తేనని హామీనిస్తున్న... 40 సంవత్సరాల క్రితం  17 డిసెంబర్ 1983 న మమ్ములను అనాధలుగా చేసి చనిపోయిన నా తల్లికి మా మూలంగా ఎలాంటి చెడ్డ పేరు తేనని ,తేమని  నీ బిడ్డలుగా మీ మీద ఒట్టేసి చెప్తున్నా... అని ప్రజా నేస్తం అవార్డు గ్రహీత కార్మిక ,కర్షక ,ప్రజారాజ్య స్థాపన కోసం తన వంతుగా ప్రజల కోసం పోరాడుతున్న సమసమాజ స్వప్నికుడు.. కమ్యూనిస్టు, విప్లవకారుడు కామ్రేడ్ జై బోరన్న గారి నేతాజీ సుభాష్ చంద్రబోస్.

తన తల్లి అమర  రైతు బోరా లక్ష్మి దేవి యాదవ్ గుర్తుకొచ్చి నేడు ఒక కన్నీటి లేఖ రాశారు...