Posts

Showing posts from July, 2026

ఘనంగా వరల్డ్ స్కిల్ యూత్ డే

Image
 విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీసేందుకె క్విజ్ పోటీలు.  ఘనంగా వరల్డ్ స్కిల్ యూత్ డే   సుండుపల్లి. సంబేపల్లి. విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే క్విజ్ పోటీలు దోహదపడతాయని ప్రిన్సిపాల్ వై పద్మావతి తెలిపారు. బుధవారం దేవపట్ల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు వరల్డ్  యూత్  స్కిల్ డే ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా విద్యార్థులకు డ్రాయింగ్. ఎస్సే రైటింగ్. క్విజ్. వంటి పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధికి తల్లిదండ్రుల సహకారం కూడా ఎంతో అవసరమని తెలిపారు. అలాగే విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత స్థానానికి చేరినప్పుడే ఇటు తల్లిదండ్రులకు అటు ఉపాధ్యాయులకు మంచి పేరు లభిస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుండి కష్టపడి చదివి ఎంతోమంది మేధావులుగా గుర్తింపు పడ్డారని వారిని ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. విద్యాభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం జరిగిందని  వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని చ...

జగన్నాధ స్వామి ని సాలూరు జమీందారు యువరాజు గారు చేతులు మీదుగా రథయాత్ర ఊరేగింపు

Image
 పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం లో  దాసరివీధి నుంచి కోటవీధి వరకు జగన్నాధ స్వామి ని సాలూరు జమీందారు యువరాజు గారు చేతులు మీదుగా రథయాత్ర ఊరేగింపు జరిగింది దీనికి యవన్మంది భక్తులు పాల్గొని  జగన్నాధ రథాన్ని తీసుకురావడం జరిగింది

మున్సిపల్ మంచినీరు సరఫరా చేసే ప్రధాన పైప్ లైన్ లీకేజ్...

Image
 న్యూస్9: నరసరావుపేట  మున్సిపల్ మంచినీరు సరఫరా చేసే ప్రధాన పైప్ లైన్ లీకేజ్... ¡¡ వృధాగా మంచినీరు..... శ్రీ సుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల మెయిన్ గేట్ సమీపంలో లీకేజీ కావడంతో ఆ ప్రాంతమంతా  జలమయం అయింది. కళాశాలకు వెళ్లేందుకు విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఇబ్బందిగా మారింది మున్సిపల్ అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.

రాజకీయ పునరావాస కేంద్రాలుగా పౌరసరఫరాల శాఖ రాష్ట్ర విజిలెన్స్ కమిటీ నియామకాలు:

Image
మురికిపూడి ప్రసాద్  సి ఆర్ పి ఎఫ్ ఐ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ  రాజకీయ పునరావాస కేంద్రాలుగా పౌరసరఫరాల శాఖ రాష్ట్ర విజిలెన్స్ కమిటీ నియామకాలు:  మురికిపూడి ప్రసాద్  సి ఆర్ పి ఎఫ్ ఐ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ  ************ విజయవాడ........ పౌరసరఫరాల శాఖ రాష్ట్ర విజిలెన్స్ కమిటీ సభ్యుల నియామకంలో నిబంధనలు పాటించలేదని, రాజకీయ ఒత్తిళ్లకు లోబడి నియామకాలు జరిగాయని సీఆర్పీఎఫ్‌ఐ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మురికిపూడి ప్రసాద్ ఆరోపించారు.శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు, మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర విజిలెన్స్ కమిటీలలో వినియోగదారుల స్వచ్ఛంద సంస్థల (Consumer Voluntary Organisations) ప్రతినిధులకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఎంఎస్ నెం. 8 ప్రకారం వినియోగదారుల వ్యవహారాలతో సంబంధం లేని వ్యక్తులను కొన్ని జిల్లాల కమిటీలో నియమించడం చట్ట స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు.ఈ నియామకాల ద్వారా రాజకీయంగా అవకాశాలు లేని వ్యక్తులకు పదవులు కల్పిం...

ఒకే ప్రాపర్టీకి మళ్లీ మళ్లీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎందుకు?

Image
 ఒకే ప్రాపర్టీకి మళ్లీ మళ్లీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎందుకు? ఇల్లు, స్థలం లేదా ఇతర ఆస్తి ఒకసారి రిజిస్ట్రేషన్ అయ్యాక మళ్లీ అమ్మినప్పుడు కొత్త యజమాని పేరు నమోదు చేయడానికి కేవలం నామమాత్రపు ఫీజు తీసుకుంటే సరిపోతుంది ..కానీ ప్రస్తుతం భారతదేశంలో ప్రతి యాజమాన్య మార్పుజరిగినప్పుడు పూర్తి స్థాయి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. ఇలా ఎందుకు ? ఒకే ప్రాపర్టీ మళ్లీ మళ్లీ రిజిస్ట్రేషన్ చార్జెస్ ఎందుకు ? ఒకే ప్రాపర్టీ అది ల్యాండ్ లేదా ఫ్లాట్ లేదా కారు అనుకుందాం . ఆ ప్రాపర్టీ మొదటిసారి కొన్నప్పుడు చట్టబద్ధత కోసం  ప్రభుత్వం ఇప్పటికే ఒకసారి రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేసింది. అదే ఆస్తి పదేళ్లలో మూడు లేదా నాలుగు సార్లు చేతులు మారితే ప్రతి సారి లక్షల రూపాయల ఫీజులు ఎందుకు చెల్లించాలి? ప్రభుత్వాల వాదన ప్రకారం రిజిస్ట్రేషన్ అనేది కేవలం పేరు మార్పు మాత్రమే కాదు. కొత్త కొనుగోలుదారుడి హక్కులను చట్టబద్ధంగా నమోదు చేయడం, భవిష్యత్తులో వివాదాలు రాకుండా రికార్డులు నిర్వహించడం, ఆస్తి లావాదేవీలకు చట్టపరమైన రక్షణ కల్పించడం ఇందులో భాగం అని చెబుతున్నారు .. కానీ అందుకు లిమిటెడ్ చార్జెస్ వస...

డ్రైనేజీ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బొమ్మ మురళీకృష్ణ గారికి ఘన పదవీ విరమణ సన్మానం

Image
 డ్రైనేజీ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బొమ్మ మురళీకృష్ణ గారికి ఘన పదవీ విరమణ సన్మానం చీరాల: డ్రైనేజీ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా విధులు నిర్వహించిన శ్రీ బొమ్మ మురళీకృష్ణ గారి పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దంపతులను అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ పి. వెంకటరత్నం గారు, బాపట్ల డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీమతి ఐ. ధనలక్ష్మి గారు, నెంబర్-1 సబ్ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డి.వి. సుబ్బారావు గారు, చీరాల నెంబర్-2 సబ్ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్. మల్లికార్జునరావు గారు, చిలకలూరిపేట సెక్షన్-1 ఏఈఈ శ్రీ ఎస్. సుబ్బరామిరెడ్డి గారు, అంజిబాబు గారు, తెనాలి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ కె.వి.ఎల్. ప్రసాద్ గారు తదితరులు పాల్గొన్నారు. అలాగే చీరాల, రేపల్లె ప్రాంతాలకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డ్రైనేజీ శాఖ సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరై బొమ్మ మురళీకృష్ణ గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. సేవా కాలంలో ఆయన అందించ...