పత్రికా ప్రచురణార్థం ✍️
ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పోస్టులన్నీ సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులతోనే భర్తీ చేయాలి-ఎస్టీయు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుల పోస్టులను కేటాయించడం జరిగిందని, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయ పోస్టులన్నీ సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల పదోన్నతుల ద్వారానే భర్తీ చేయాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కే కోటేశ్వరరావు రాష్ట్ర డైరీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.మంగళ
వారం చిలకలూరిపేటపట్టణంలోని ఎస్టీయు ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన సమావేశంలోవారు మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయ పోస్టులన్నీ సెకండరీ ఉపాధ్యాయులతోనే ఖర్చు చేయాలనే నిబంధన ఉన్నప్పటికీ,సదరు పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ కు(డీఎస్సీ) కి కూడా కేటాయిస్తున్నారనే సమాచారం రావడం చాలా బాధాకరమన్నారు.అలాగే మోడల్ ప్రాథమిక పాఠశాలలకు కేటాయించిన ప్రధానోపాధ్యాయుల పోస్టులను 100 శాతం సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల పదోన్నతుల ద్వారానే భర్తీ చేయాలని,అలా కాకుండా పాఠశాల సహాయకుల స్థాయిని తగ్గిస్తూ వారిని తాత్కాలిక ప్రాతిపదికన ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా నియమించడం అటు విద్యావ్యవస్థకు ఇటు ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తీసుకు వచ్చే విధంగా ఉందన్నారు.ఈ చర్యను ఉపాధ్యాయలోకం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, కావున ప్రభుత్వం మొండివైఖరి విడనాడి ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు ఉద్యమ బాట పట్టేలోగా దీనిని సరిదిద్దుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.పాఠశాల సహాయకుల సేవలను కేవలం ఉన్నత పాఠశాలల్లోనే వినియోగించుకుని,ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల పోస్టులను డైరెక్టర్ రిక్రూట్మెంట్ ద్వారా కాకుండా పదోన్నతుల ద్వారానే భర్తీ చేయాలని ఆయన కోరారు.మిగిలిన పాఠశాల సహాయకులను తాత్కాలికంగా నియమించినప్పటికీ భవిష్యత్ లో వీరి స్థానంలో సెకండరీ గ్రేడ్ టీచర్స్ కే ప్రమోషన్స్ ఇవ్వాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 59 మున్సిపల్ పరిధిలోని పాఠశాలల్లో అప్గ్రేడ్ అయిన స్కూల్ అసిస్టెంట్, PSHM పోస్టులను సెకండరీ గ్రేడ్ టీచర్ల కు పదోన్నతుల ద్వారానే భర్తీ చేయాలి అని ఎస్టియు డిమాండ్ చేస్తుందం తెలిపారు, గత 15 ఏళ్లుగా మున్సిపల్ పాఠశాలల్లో పదోన్నతులు అరకొరక ఇవ్వడం జరిగిందని ఈ ప్రభుత్వం అత్యధికంగా పోస్టులు సాంక్షన్ చేసినందు వల్ల 15 ఏళ్లుగా పదోన్నతులకు నోచుకోని ఉపాధ్యాయులందరికీ ఈ పదోన్నతుల్లో అవకాశం కల్పించాలని కోరారు, పల్నాడు జిల్లా కార్యదర్శి వినుకొండ అక్కయ్య పట్టణ అధ్యక్షులు మేకల కోటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి వడ్లను జయప్రకాష్ నాదండ్ల మండల అధ్యక్షులు షేక్ మక్బూల్ బాషా కార్యదర్శి దుర్గాప్రసాద్ ఎడ్లపాడు మండల అధ్యక్షులు జి కోటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ చిలకలూరిపేట మండల అధ్యక్షులు బొంత రవి ప్రధాన కార్యదర్శి షేక్ మస్తాన్ వలి సీనియర్ నాయకులు చావల మల్లేశ్వరరావు జిల్లా మహిళా కన్వీనర్ ఎం శారదతదితరులు పాల్గొన్నారు.