*చంద్రబాబు నాయకత్వమే రాష్ట్రప్రగతికి ఇంధనం : మాజీమంత్రి ప్రత్తిపాటి*
- దేశంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు చంద్రబాబు వయసుని లెక్కచేయక శ్రమిస్తున్నారు.
- చంద్రబాబు, లోకేశ్ చొరవతోనే రూ.9.70 లక్షల కోట్ల పెట్టుబడులు.
- ప్రజలు మరో 15 ఏళ్లపాటు కూటమిప్రభుత్వానికి మద్ధతు పలకాలి.
- సుపరిపాలనకు ఏడాది వేడుకల్లో ప్రజలతో కలిసి పాల్గొన్న ప్రత్తిపాటి
కూటమిప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలాంటి భయాందోళనలు లేకుండా ప్రజలు గుండెలపై చేయివేసుకొని ప్రశాంతంగా జీవిస్తున్నారని, అందుకు కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వమని, అదే రాష్ట్రప్రగతికి ఇంధనమని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా పట్టణవ్యాప్తంగా జరిగిన మూడుపార్టీల విజయోవత్సవ వేడుకల్లో టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులతో కలిసి ప్రత్తిపాటి పాల్గొన్నారు. తొలుత పార్టీ కార్యాలయంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ప్రత్తిపాటి, కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అనంతరం స్థానిక శ్రీ పొట్టి శ్రీరాములు వీధిసహా పట్టణంలో పలుచోట్ల ఏర్పాటుచేసిన సంబరాల్లో ప్రత్తిపాటి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కమ్యూనిటీ నాయకులు కనమర్లపూడి రమేష్, రాచుమల్లు సూర్యారావు, కొత్త కోటేశ్వరరావు, మద్ది అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.