మరియు కార్నర్ పాయింట్స్ ఫ్లెక్సీలను తొలగించండి..

 *పోలీస్ అవుట్ పోస్ట్ చుట్టూ ఉన్న ఫ్లెక్సీలను మరియు కార్నర్ పాయింట్స్ ఫ్లెక్సీలను తొలగించండి.. లోక్ సత్తా పార్టీ..*

 





పట్టణంలో నరసరావుపేట సెంటర్, కళ్యాణి సెంటర్ లలో ఉన్న పోలీస్ అవుట్ పోస్ట్ చుట్టూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మరియు  జాతీయ రహదారి తో సహా వివిధ ప్రధాన కూడళ్ళల్లో, కార్నర్ పాయింట్స్ల లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మాదాసు భాను ప్రసాద్ కోరారు.  పట్టణంలోని వైయస్సార్ కాలనీకి చెందిన ముక్కుపచ్చలారని 9 సంవత్సరాల చిన్నారి వెంకటశృతి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం విచారకరమని అన్నారు. చిన్నారి వెంకట శృతి తల్లిదండ్రుల గర్భశోకాన్ని ఎవరూ తీర్చలేరని అన్నారు. నిత్యం రోడ్డు ప్రమాదాల కారణంగా ఎక్కడో ఒక చోట ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఇదిలా ఉంటే రోడ్డు ప్రమాదాల కారణంగా అనేకమంది క్షతగాత్రులై జీవితాంతం అంగవైకల్యం అనుభవిస్తూ మంచానికే పరిమితమై నరకయాతన అనుభవిస్తున్నారని అన్నారు. ఇటీవల జరిగిన విమానం ప్రమాదంలో 270 మందికి పైగా చనిపోవడం, కొద్ది రోజులకే హెలికాప్టర్ ప్రమాదంలో ఏడుగురు చనిపోవడం, ముంబై లోకల్ ట్రైన్ లో నుండి రైలు పట్టాలపై పడి పోయి ఐదుగురు చనిపోవడం, ఆర్ సి బి జట్టు విజయోత్సవ వేడుకలలో క్రికెట్ అభిమానులు 11 మంది చనిపోవడం లాంటివన్నీ ఆవేదన కలిగించే అంశాలన్నీ అన్నారు. ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసినా పోయిన ఏ ఒక్క ప్రాణాన్ని వెనక్కి తీసుకురావడం సాధ్యం కాదు అనేది వాస్తవమైనప్పుడు, నిర్లక్ష్యం కారణంగా, అజాగ్రత్త కారణంగా ఏ ఒక్క ప్రాణం పోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది అని అన్నారు. ఇప్పటికైనా ప్రధాన రహదారుల కార్నర్ పాయింట్స్ లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, పోలీస్ అవుట్ పోస్ట్ చుట్టూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించి ప్రమాదాలను అరికట్టాలని కోరారు.