పసుమర్రు మహిళ వినియోగదారు విజయం పట్ల హర్షం వ్యక్తం చేసిన వినియోగదారుల సంఘం నాయకులు
మండలంలోని పసుమర్రు గ్రామానికి చెందినటువంటి పి మరియమ్మ అనేమహిళ వినియోగదారుల కోర్టులో విజయం సాధించడం పట్ల పలనాడు జిల్లా వినియోగదారుల సంఘం అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు .
ఆయన తెలిపిన వివరాల ప్రకారం
పసుమర్రు గ్రామానికి చెందిన వంటి పచ్చికర్ల మరియమ్మ అనే మహిళకు పసుమర్రు యూనియన్ బ్యాంకు లో ఖాతా కలదు. రూ 16,500 పొదుపు చేసుకుంది. కాగా ఆమెకు తెలియకుండా ఆమె సొమ్ము 16,500 వేరొకరికి ఖాతాకు యూనియన్ బ్యాంకు సిబ్బంది ట్రాన్స్ఫర్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె బ్యాంకు అధికారులను సంప్రదించడం జరిగింది అయినా ఆమెకు సరిగ్గా సమాధానం చెప్పకపోవడంతో. ఆమె బ్యాంకింగ్ అంబుడ్స్ మెన్ కు పిర్యాదు చేశారు.
విచారణ జరిపిన బ్యాంకింగ్ అంబుడ్స్ మెన్ ఆమె ఖాతాకు 16,500తిరిగి ఆమె ఖాతాకు జమ చేయాలి బ్యాంక్ అధికారులు ఆదేశించడం జరిగింది. ఇదే సమయంలో మనోవేదనకు గురైన మహిళ ఈ విషయాన్ని గౌరవ న్యాయవాది గుదే రవితేజ ద్వారా వినియోగదారుల కోర్టు లో ఫిర్యాదు చేయడం జరిగింది. కేసు పూర్వపరాలు విచారించిన న్యాయమూర్తి ఖాతాదారు డబ్బులు ఆమె తెలియకుండా క్యాష్ ట్రాన్స్ఫర్ చేయడం సేవాలోపమని, మరియు మానసికంగా ఇబ్బంది పెట్టినందు పసుమర్ యూనియన్ బ్యాంకు కు 7000 పెనాల్టీగా ఆమెకు చెల్లించాలని అదేవిధంగా 2000 రూపాయల కోర్టు ఖర్చులకు చెల్లించాలని ఆదేశించడం జరిగిందని ప్రసాద్ తెలిపారు. వినియోగదారుల కోర్టు దావా నెంబర్ సీసీ 56/2023 అని తెలిపారు
ఈ సందర్భంగా తనకు జరిగిన అన్యాయానికి పోరాటం చేసిన మహిళను గౌరవ న్యాయవాది గుదే రవితేజను వినియోగదారుల సంఘం పల్నాడు జిల్లా కార్యవర్గ సభ్యులు డాక్టర్ విద్య సాగర్, రవి నాయక్, బేబీ విక్రమ్, గాలయ్య తదితరులు అభినందించారు