*నిరుపయోగంగా పడి వున్న కొన్ని ప్రభుత్వ శాఖల్లో సంస్కరణలను అమలు చేయాలి.*
కొంతమంది చేస్తున్న కాలక్షేప ఉద్యోగులపై ప్రత్యేక నిఘా ద్వారా చర్యలు చేపట్టాలి.
అవినీతి లో పట్టుబడ్డ ఉద్యోగుల ఫోటోలు సంబంధిత కార్యాలయం బయట పెట్టాలి.
అవినీతి నిరోధక శాఖ ను పోలీస్ శాఖ నుండి వేరు చేయాలి.
కాలయాపన లేని విధులను అమలు చేసే కఠిన చట్టాలు పాలనకు ఎంతయినా అవసరం వుంది.
నిత్యం వినియోగ దారులుతో పాటుగా సామాన్యుల నుండి మేధావులు అనునిత్యం తెలిసి తెలియకుండా కూరగాయల తూనికల కొలత నుండి ప్రతి నిత్యావసరాల సరుకులు వరకు మోసపోతూనే ఉంటామని,అందుకు కారణం ప్రధానంగా తూనికలు కొలతలకు సంబంధించిన శాఖ నిరంతరం అవినీతి మత్తులో వుంటు నిమ్మకు నీరెత్తి నట్లు వ్యవహరిం చటమే ఇందుకు బలమైన కారణం అని,ఎవరైనా ఈ శాఖ వారికి పిర్యాదు చేసినా ఫిర్యాది దారులను మానసిక వికలాంగుల వలె మార్చేస్తారని,ఈ శాఖ పనితీరు ఎవరికి అర్ధం కాదని,ఈ శాఖ ఎందు కుందో కూడా తెలియదని, క్రింది స్థాయి నుండి పై స్థాయి వరకు అవినీతి పుట్టఅని,కాటాలను (త్రాసు)తనిఖీ చేయటం కూడా చాలా పనిభారంగా ఈ శాఖ వారు భావిస్తారు.
ప్రమాద కరమైన రసాయనాలు తో మోసపూరితంగా ప్రజలను ఆకర్షించటానికి రంగులు, రంగు పూతలు పూస్తూ పండ్లు,ఆహార ప్రధార్థాలను కలుషితం చేస్తు రోడ్ల పైన, మాల్స్ ల్లోను బహిరం గంగా సరుకులు విక్రయిస్తు న్నారని,
ఆ విధమైన ఆహరం, పండ్లు తింటున్న ప్రజలు ప్రమాద కరమైన అనారోగ్యాలకు గురైతు ప్రాణాంతక వ్యాధులతో చనిపోతున్నారని, రసాయనిక చర్య లేకుండా ఏ విధమైన ఆహర ప్రదార్థాలు విక్రయాలు జరగటం లేదనేది యదార్థమని తెలిసినా ప్రజలు క్రయ విక్రయాలు జరపటం తప్పనిసరిగా మారుతుందని ప్రజలు ఆవేదన చెందు తున్నారు.
ఇక నిత్యం పాలు,పెరుగు, నెయ్యి, వంట నూనె తీవ్రంగా కల్తీ చేస్తున్నారని, మన ఫుడ్ ఇన్సపెక్టర్స్, విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ వారు గుడ్లప్పగిస్తు చూస్తు ఆ కల్తీ మాఫియా వద్ద అవినీతి చేస్తు ఆ కల్తీ సరుకులనే వారు సైతం భోంచేస్తు న్నారని,రోజుల తరబడి నిలువ వుంచిన మాంసం, చేపలు,మార్కెట్టులో విక్రయాలు జరుగుతున్నా సంబంధిత ఆరోగ్య శాఖ అవినీతి ముడుపులతో దాహం తీర్చుకుంటు ప్రమాద కర వైరస్ లతో ప్రజలు మరణాలకు కారకులవు తున్నారు
రైతు బజార్లలో కూడా నాణ్యమైన సరుకులు లభ్యం కావటం లేదని, పశుసంవర్ధక శాఖ పనితీరు నిర్వర్ధకంగా కొనసాగుతుందని,ఏటా కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతున్నా మెరుగైన సేవలు అందివ్వటం లేదని,పంచాయితీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కనీసం మెరుగైన పారిశుద్యం అందియ్యలేక పోతు న్నారని,ఎక్కువ శాతం ప్రభుత్వ సేవల్లో భాద్యతా రాహిత్యం కొట్టొచ్చినట్టు కనబడు తుందని,కాలం చెల్లిన పాలనా విధానాలు కారణంగా పౌర సేవలు అడుగంటి పోతున్నా యని,త్రాగునీరు సరఫరా సైతం పరిశుభ్రత లోపిస్తుందని,ఇందుకు పాలకుల వైఫల్యమే ప్రధాన కారణంగా భావించాలని నేతల లోపాన్ని ప్రజలు ఎత్తి చూపలేక పోతున్నారు.
ఇరిగేషన్ శాఖ వుందో లేదో అన్నట్టు వారి విధులు నిర్వహిస్తున్నారని,ఈ శాఖ ప్రభుత్వ ఖజానాకు బారంగా మారుతు న్నారని,ఏటా 100 ల కోట్లు ప్రభుత్వ ధనాన్ని టెండర్లు ద్వారా కాంట్రాక్ట్ పనులకు చెల్లిస్తారని,ఏ ఒక్కపని నాణ్యత పరిమాణాలకు, నిబంధనలుకు లోబడి ఉండవని,పని నిర్దారణకు సంబందించిన క్వాలిటీ సర్టిఫికెట్ జారి చేయు వద్దనుండి మొత్తం కాంట్రాక్ట్ సొమ్ము చెల్లించే వరకు అంత అవినీతి వ్యాపారమే జరుగు తుందని,బలహీనంగా వున్న ఏటి గట్లును పరిశీలించి వాటిని మెరుగుపరచడం,పేరుకు పోయిన నాచు,ఇతర చెత్తా చెదారం ను తొలగించి చెరువులను, నదులను పరిశుభ్రంగా వుంచటం వంటి పనులపై దృష్టి సారించకుండా తీవ్రమైన దుర్గందానికి కారకులైతున్నారని ప్రజలు వాపోతున్నారు.
కార్మిక శాఖ పని తీరు కార్మికుల సమస్యలు పరిష్కరించటం కన్నా యాజమాన్యం కు కొమ్ముకాయటం పైనే ఎక్కువ ఆశక్తి చూపి వారి నుండి అవినీతికి దారి చేసుకుంటున్నారని,ఈ శాఖ తీవ్రమైన అవినీతి కారణంగా కార్మికులకు ఉద్యోగ భద్రత లేదని, కనీస వేతన చట్టాలు అమలు కావటం లేదని, కార్మిక సంక్షేమం నీరు గారిపోతుందని,ఇందుకు అనుగుణంగా వుండే ఇన్సపెక్టర్స్ అండ్ బ్రెయిలర్స్ శాఖ పరిశ్రమల వద్దనుండి అవినీతి ముడుపుల వసూళ్లు పైన వున్న ద్యాస కాలం చెల్లిన బ్రెయిలర్స్ కొనసాగించటం కారణంగా తరచూ ఏదో ఒక ప్రమాదం చోటు చేసుకుంటు కార్మికులు ప్రాణాలు పోతున్నాయనే మానవత్వం లేని విధులు నిర్వహిస్తున్నారని ఆయన తీవ్ర మనస్తాపం చెందారు.
డిజాస్టర్స్ మేనేజ్మెంట్ శాఖ పని తీరు నిత్యం నిద్రావస్థలో వుంటు విధులు మరిచి పోతున్నారని,వరదలు, తుఫాన్లు,ముంపు వచ్చి నప్పుడు,వైరస్ విపత్తులు సంభవించి నప్పుడు మాత్రమే ఈ శాఖ విధులు నిర్వహిస్తున్నారని, విపత్తులు సంభవించ టానికి ముందస్తు చర్యలుగా జాగ్రత్తలు వహించటం గాని, ముందస్తు వ్యూహం తో రక్షణ చర్యలు చేపట్టడం గాని ఈ శాఖ వారు నిబద్దత గల విధులు చేపట్టరని,కోట్ల రూపాయలు నిధులు మాత్రం ఏటా ఖర్చు చేస్తున్నట్టు బిల్లులు డ్రా చేస్తుంటారని,ఇక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు అయితే కాలుష్యాన్ని నియంత్రి చటం కన్నావిషపూరిత రసాయనాలు,ప్రమాద కరమైన రసాయనిక మురుగు,ఇతర వ్యర్థాలు నదుల్లోను,చెరువుల్లోని నేరుగా కలిపేసుకోండని, ప్రతినెలా అందుకు తగ్గట్టు అవినీతి వాటా మాకు పంపండి అని ప్రయివేట్ దళారుల ద్వారా పారిశ్రామిక వర్గాల నుండి ముడుపులు తీసుకుంటు అధికార దుర్వినియోగ విధులు నిర్వహిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.
అవినీతి లేకుండా ఏ ప్రభుత్వ శాఖలోను పౌర సేవలు నడవటం లేదని, అవినీతి చేస్తు ఏసీబీ వారికి పట్టుబడి జైలుకు వెళ్లిన వారి ఫొటోలు సంబంధిత కార్యాలయాల వద్ద నోటిస్ బోర్డులో ప్రకటించి ప్రజలను అప్రమత్తం చేస్తు ఇతర ఉద్యోగులు నిజాయతిగా సేవలు అందించే విధంగా ప్రోత్సహించాలని, అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ )ప్రస్తుతం వున్నా లేనట్టుగానే వుందని, అవినీతి లో రెండవ స్థానంలో వున్న పోలీస్ శాఖ నుండే ఏసీబీ శాఖ విధులు అమలు కావటం మంచి పరిణామాలు కావని,ఏసీబీ,విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, స్పెషల్ బ్రాంచ్, ఇంటిలిజెన్స్ విభాగాలు పోలీస్ శాఖతో కలిసి ఉన్నన్నాళ్ళు ఆ శాఖల పనితీరు మెరుగుపడదని, ఇప్పుడున్న ఈ శాఖల పనితీరు యుద్ద ప్రాతి పదికన మార్పులు చేయకపోతే ఈ శాఖలు తో ప్రభుత్వానికి,ప్రజలకు ఎందుకు ఉపయోగం వుండదని,దూర ద్రుష్టి తో ప్రభుత్వాలు ఈ లోపాన్ని గుర్తించి ఈ శాఖల ను ప్రత్యేక విభాగాలుగా విభజించి ప్రత్యేక శాఖలుగా అధికారిక గుర్తింపు నివ్వాలని ప్రజలు కోరుతున్నారు.
అనేక ప్రభుత్వ శాఖల్లో ప్రజా విజ్ఞాపనలు, రెగ్యులర్ ఫైళ్లను నెలలు సంవత్సరాలు తరబడి కాల యాపనతో విధులు నిర్వహిస్తున్నారని, అత్యధిక శాతం ఉద్యోగులు కాలక్షేపంగా ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్నారని,సర్వీస్ రూల్స్ ను,పబ్లిక్ సర్వెంట్ యాక్ట్ ను కనీసం అనుసరించుటం లేదని, రోజులు,సంవత్సరాలు తరబడి కార్యాలయాలు చుట్టు తిరిగిన శ్రమ తప్ప ఫలితం వుండటం లేదని, పర్సెంటేజిలకు అలవాటు పడిన పై అధికారులు కాలయాపన విధులు పై దృష్టి సారించలేక పోతున్నారని,అనేక సందర్బాలలో *సమాచార హక్కు చట్టం* ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారికి కోరిన సమాచారం కన్నా వక్రీకరించి అవాస్తవాల తోనే సమాచారం ఇస్తు తీవ్ర జాప్యానికి కారకు లైతున్నారని,కొన్ని కొన్ని సందర్భాలలో అవినీతి ఉద్యోగులు సంఘ విద్రోహులతో చేతులు కలిపి శాంతి భద్రతల సమస్యలు కు కారకులవు తున్నారు.
* మండల్ సమాచార కేంద్రం. MCIC. ఇంచార్జ్ బొబ్బిలి
*కన్స్యూమర్ రైట్స్ ప్రోటక్షన్ ఫోరం. ఆంధ్రప్రదేశ్.🇮🇳CRPFI 🇮🇳 సత్యమేవ జయతే🇮🇳 జైహింద్🇮🇳