రేపటి తరం" కోసం నెల్లూరులో కీలక తీర్మానం!
"రేపటి తరం" కోసం నెల్లూరులో కీలక తీర్మానం!
రానున్న పరీక్షా కాలంలో విద్యార్థులను మానసిక, శారీరక ఒత్తిడి మరియు డ్రగ్స్ మహమ్మారి నుండి దూరం చేసేందుకు నెల్లూరు నగరంలో జరిగిన తలిదండ్రుల రౌండ్ టేబుల్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
✨ ప్రధాన తీర్మానం:
విద్యార్థి-తలిదండ్రుల ప్రత్యేక సమావేశాలు: జిల్లా, రాష్ట్రం లోని ప్రతి పాఠశాల మరియు కళాశాలలో ప్రత్యేక "విద్యార్థి-తలిదండ్రుల" సమావేశాలను ఏర్పాటు చేయాలని తీర్మానించారు.
సహాయ సహకారాలు: ఈ కార్యక్రమాలను ప్రభుత్వ సహకారంతో పాటు, ప్రముఖ సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్ మరియు స్వచ్ఛంద సంస్థల సహాయంతో నిర్వహించనున్నారు.
🤝 నిర్వహణ:
ఈ తీర్మానాన్ని ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (PAAP) (రిజిస్టర్ నెంబర్ 6/2022) యొక్క ఆంధ్రప్రదేశ్ కమిటీ రూపొందించి, పోస్టర్ను విడుదల చేసింది.
సంప్రదింపు వివరాలు:
📞 +91 63053 13558
📧 parentsassociationap@gmail.com

Comments
Post a Comment