నాన్నను.. కసిగా చంపేశాడు

నాన్నను.. కసిగా చంపేశాడు 





ఆ తండ్రి నడకలు రాని తన బిడ్డను నెత్తిన ఎక్కించుకుని ఊరేగాడు. బుడిబుడి తప్పటడుగుల కొడుకు కాలుజారి పడిపోతాడని భయపడి.. బిడ్డ చిటిక వేలు పట్టుకుని నడక నేర్పించాడు. జులాయిగా.. పోకిరిగా మారినా... పున్నామ నరకాన్ని తప్పించటానికి తలకొరివి పెడతాడని ఆశించాడు. కానీ ఆ కిరాతక బిడ్డ తన తండ్రిని రంపంతో కోసి ప్రాణం తీసి నేరుగా నరకానికి పంపాడు. సభ్య సమాజం తల్లడిల్లే ఈ దారుణం ప్రకాశం జిల్లా దొనకొండ మండలం ఇండ్లచెరువు గ్రామం ఎస్సీ కాలనీ లో  ఆదివారం తెల్లవారుజామున జరిగింది. ఆ ఊరి జనాన్ని కలచి వేసింది. అంతే హంతకుడిని పట్టుకుని స్థంభానికి కట్టేసి పోలీసులకు అప్పగించారు. ఈ గ్రామానికి చెందిన పైడిపోగు యేసయ్యను తనయుడు మరియదాసు దారుణంగా చంపేశాడు. ఈ అమానవీయ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,