నాసా ముక్త్ భారత్ కుషాల్ భారత్,నాసా ముక్త్ భారత్ అభయం 5 సవంత్సరాల సెలబ్రేషన్
న్యూస్ 9 channel ఎన్టీఆర్ జిల్లా విజయవాడ1 8/11/25
నాసా ముక్త్ భారత్ కుషాల్ భారత్,నాసా ముక్త్ భారత్ అభయం 5 సవంత్సరాల సెలబ్రేషన్ ను విజయవాడ లయోలా కళాశాలలో జరిగింది. ఈ సెలబ్రేషన్ కు ముక్య అతిథులుగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలా వీరాంజనేయులు, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, ఈగల్ టీం సి ఐ, ఎస్ ఐ లు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి డోలా బాలా వీరాంజనేయులు, గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ నేటి యువత చెడు మార్మార్గంలో నడుస్తున్నారని,చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారన్నారు.
యువత అంతా కూడా బాగా చదివి ఉన్నత శిఖరానికి చేరుకోవాలని,చెడు వ్యసనాలకు అలవాటు పడితే సమాజంలో గుర్తింపు ఉండదన్నారు.ఏ అలవాటులు లేకపోతే సమాజంలోను, కుటుంబాలలో మంచి గుర్తింపు ఉంటుందన్నారు.విశాఖ నగరంలో సి ఐ ఐ సమావేశం జరిగిందని,వైజాగ్ లో 13 లక్షల పెట్టుబడులురావడం ద్వారా 13 లక్షల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయన్నారు .మత్తు పదార్థాలను ప్రోత్సహించవద్దు అని సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు అనిత, నారా లోకేష్ తదితరులు కోరుతున్నారన్నారు.

Comments
Post a Comment