రోడ్ ప్రమాదంలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు,
🚨 రోడ్డుప్రమాదంలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు
చిలకలూరిపేట:
చిలకలూరిపేట పేట నుంచి గుంటూరు–విజయవాడ ఫ్లై ఓవర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి.
బాపట్ల నుంచి ఒక ప్రేయర్ కార్యక్రమానికి హాజరై అక్కడ పోస్టర్లు అంటించి తిరిగి విజయవాడకు వెళ్తున్న సమయంలో, చిలకలూరిపేట బైపాస్ వద్ద నిద్రమత్తులో వాహనం డివైడర్ను ఢీకొట్టినట్లు సమాచారం.
ప్రమాద సమాచారం అందుకున్న 108 అత్యవసర సిబ్బంది వెంటనే స్పందించి గాయపడిన యువకులను చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments
Post a Comment