ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను తక్షణమే విడుదల చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ మరియు ఇండియా కూటమి నేతలు నిరసన
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను తక్షణమే విడుదల చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ మరియు ఇండియా కూటమి నేతలు నిరసన* ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ మరియు రాష్ట్ర కమిటీల పిలుపుమేరకు తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను బి.జె.పి పార్టీ రాజకీయ కక్ష తోటి జైల్లో నిర్బంధించడం హేయమైన చర్య అన్నారు. భారత రాజ్యాంగం కోర్టులో బెయిల్ ఇచ్చినప్పటికీ నిరంకుషితంగా దర్యాప్తు సంస్థలైన సి.బి.ఐ, ఈ.డీ లను దుర్వినియోగం చేయడం రాజ్యాంగ విరుద్ధమని తిరుపతి బస్టాండ్ వద్ద గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహనీయునికి ఇండియా కూటమి నేతలు వినతి పత్రం సమర్పించారు. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తక్షణమే విడుదల చేయాలని నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి *ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నీరు గట్టు నగేష్ , రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకట చలపతి, రాష్ట్ర కార్యదర్శి కల్లూరి బాలసుబ్రమణ్యం, రాష్ట్ర అధికార ప్రతినిధి కోడివాక చందు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి మాగంటి గోపాల్ రెడ్డ...