Posts

Showing posts from October, 2025

నరసరావుపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సిఐ)**గా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు.

Image
 గుంటూరు: సాధారణ బదిలీలలో భాగంగా గుంటూరు రేంజ్ కార్యాలయం నుండి బదిలీ అయిన సి.హెచ్. ప్రభాకర్ రావు గారు, **నరసరావుపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సిఐ)**గా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నరసరావుపేట పరిధిలో చట్టవ్యవస్థను కఠినంగా అమలు చేస్తూ ప్రజల భద్రతకు కట్టుబడి పనిచేస్తానన్నారు. స్థానిక ప్రజల సహకారంతో శాంతి భద్రతలను కాపాడటమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.

వినుకొండ రోడ్ వరద ప్రభావిత ప్రాంతాలలో అన్నదానం కార్యక్రమం

Image
 వినుకొండ రోడ్ వరద ప్రభావిత ప్రాంతాలలో అన్నదానం కార్యక్రమం పల్నాడు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డా. గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి (జీఎస్ఆర్ గారు) ఆదేశాల మేరకు మంథా తుఫాన్ కారణంగా తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో అన్నదానం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వినుకొండ రోడ్ పరిసర ప్రాంతాల్లోని వరద బాధితులకు నిమ్మకాయ పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమంలో టౌన్ కన్వీనర్ ఎస్.కే. కరీముల్లా గారు, 6వ వార్డు వైఎస్సార్సీపీ నాయకుడు మైలూరి మార్క్ గారు పాల్గొన్నారు. జీఎస్ఆర్ గారు ప్రజల సంక్షేమం పట్ల ఎల్లప్పుడూ ముందుండి పనిచేస్తూ, బాధితులకు అండగా నిలుస్తున్నారని నాయకులు తెలిపారు.

నరసరావుపేట లోని తుఫాను

Image
 న్యూస్ 9 రిపోర్టర్ *నరసరావుపేట లోని తుఫాను* *ప్రభావిత ప్రాంతాల్లో* *పర్యటించి ప్రజలకు పులిహోర* *పొట్లాలు మరియు మంచినీళ్లు అందించిన* *పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్* *పార్టీ కార్యనిర్వాహక* *అధ్యక్షులు డాక్టర్* *శ్రీ గోపిరెడ్డి* *శ్రీనివాస్ రెడ్డి గారు!  *తుఫాను సహాయక చర్యలను చేపట్టాలని* *ముఖ్యమంత్రి పదే పదే చేసిన హెచ్చరికలను* *బేఖాతరు చేసిన నరసరావుపేట ప్రభుత్వ యంత్రాంగం* !   *తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో*   *ప్రజలకు ఆహారం మరియు మంచినీటి* *సరఫరా కూడా చేయలేని దుస్థితిలో నరసరావుపేట* *ప్రభుత్వ యంత్రాంగం!*   *స్థానిక శాసనసభ్యులు అటు ఇటు* *తిరుగుతాడు తప్ప* *తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో* *ప్రజలు పడుతున్న* *ఇబ్బందులను గురించి* *పట్టించుకోవడం లేదు* !  *తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న* *ఇళ్లకు నష్టపరిహారం తక్షణమే అందజేయాలి* !  *సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం* *చేయటం వల్లనే  తుఫాను* *సహాయక చర్యలకు* *అంతరాయం!*    *తుఫాను సహాయక చర్యల్లో* *నిర్లక్ష్యాన్ని వీడండి _* *పల్నాడు జిల్లా వైఎస్ఆర్* *కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహ* *అధ్యక్ష...

తుఫాను సహాయక చర్యల్లో నరసరావుపేట అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారు!

Image
 *తుఫాను సహాయక చర్యల్లో నరసరావుపేట అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారు!* *వర్ష ప్రభావిత ప్రాంతాల్లో నీట మునిగిన ఇళ్లకు మరియు డామేజ్ జరిగిన ఇళ్లకు సర్వే చేయించి వెంటనే ఆర్థిక సహాయం అందించాలి!* *చంద్రబాబు నాయుడు కాలనీలో 10 లైన్లు బరంపేటలో రెండు లైన్లు నీట మునిగిపోయాయి!* *బరంపేటలో విద్యుత్ స్తంభం విరిగిపడిన చెట్లు కూలి పోయినా సంబంధిత అధికారులు ఇప్పటివరకు పట్టించుకున్న పాపాన పోలేదు!* *ముఖ్యమంత్రి పదేపదే విజ్ఞప్తి చేసిన నిధులు విడుదల చేసినా నరసరావుపేట మున్సిపాలిటీ అధికారులు ఎక్కడా పునరావస కేంద్రాలు గాని ,వర్షాభావ ప్రాంతాల్లో పేదలకు ఆహార పొట్లాలు అందించటం గాని చేయలేకపోయాయి!* *నరసరావుపేట మున్సిపల్ అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు!*       ************ *వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఈరోజు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించటం జరిగింది,* *ఈ పర్యటనలో భాగంగా ఆయన సత్తనపల్లి రోడ్ లోని స్టేడియం మరియు చంద్రబాబు నాయుడు కాలనీ ,బరంపేట ప్రాంతాల లో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లా...

సత్తెనపల్లి రోడ్డు ,స్టేడియం

Image
  సత్తెనపల్లి రోడ్డు ,స్టేడియం, బీసీ కాలనీ ,బరంపేట ప్రాంతాల్లో వర్షంలోనే పర్యటించిన పల్నాడు డిస్ట్రిక్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు! *

మోకాల్లోతు లో వరద నీరు

Image
 నరసరావుపేట news9 రిపోర్టర్ : నరసరావుపేట సత్తెనపల్లి రోడ్ లోనే స్టేడియం పక్కన కెనాల్.. రోడ్డుమీద ప్రవహిస్తున్న.. వరద చంద్రబాబు నాయుడు కాలనీలో మోకాల్లోతు లో  వరద నీరు చేరుకున్నాయి.

కరెంటు పోల్ కూలీ రోడ్డు మీద పడింది

Image
 నరసరావుపేట పల్నాడు బస్టాండ్ మదర్ తెరిసా హాస్పిటల్ దగ్గర కరెంటు పోల్  కూలీ రోడ్డు మీద పడింది

బైపాస్ రోడ్డు పక్కన ఉన్న భారీ చింతచెట్టు తుఫాన్ గాలులకు పడిపోయింది

Image
 @నరసరావుపేట మండలంలోని రావిపాడులో సెయింట్ మేరీస్ స్కూల్ సమీపంలో నరసరావుపేట నుండి నకరికల్లు వెళ్లే బైపాస్ రోడ్డు పక్కన ఉన్న భారీ చింతచెట్టు తుఫాన్ గాలులకు పడిపోయింది  @ సంబంధిత అధికారులు వెంటనే చెట్టును తొలగించాలని స్థానిక ప్రజలు కోరారు థాంక్యూ  పల్నాడు పోలీస్ *థాంక్యూ  పల్నాడు పోలీస్*  జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు గ్రామీణ సీఐ  రామకృష్ణ ఆధ్వర్యంలో ఎస్. ఐ కిషోర్ దగ్గర ఉండి పడిపోయిన చెట్లను వేంటనే తొలగించారు.. త్వరిత గతిన పోలీసులు స్పందించిన తీరును ప్రజలు కొనియాడారు..

ఏపీ ఇంటర్ విద్యార్థులకు ముఖ్య గమనిక! పరీక్ష ఫీజు గడువు పొడిగింపు!

Image
 📢 ఏపీ ఇంటర్ విద్యార్థులకు ముఖ్య గమనిక! పరీక్ష ఫీజు గడువు పొడిగింపు! ⏳ ​ ​ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు (IPE) మార్చి 2026కు సంబంధించి ఫీజు చెల్లింపు గడువును ఇంటర్ బోర్డు మరోసారి పొడిగించింది. -​విద్యార్థుల సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ​ముఖ్యమైన తేదీలు: -​జరిమానా లేకుండా ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: అక్టోబర్ 31 వ తేది2025 -​రూ. 1000 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: నవంబర్ 6 వ తేదీ 2025 ​ముఖ్య సూచన: ​ఇదే చివరి అవకాశం అని ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. ​ఇకపై గడువు పొడిగింపు ఉండదు. ​ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ రెగ్యులర్, ఫెయిల్ అయిన విద్యార్థులు (ప్రైవేట్ అభ్యర్థులు) అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. -​మీ కళాశాలల ద్వారా త్వరగా ఫీజు చెల్లించండి. 👉 PAAP హెచ్చరిక: దోపిడీని ఆపండి! -తల్లిదండ్రులారా, మేల్కొనండి! - బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ నిర్ణయం చేసిన ఉత్తర్వుల కాఫీ చూపమని కోరండి.   -కార్పొరేట్ కాలేజీలు ట్యూషన్ ఫీజు పేరుతో భారీ మొత్తాలు డిమాండ్ చేసినా, బోర్డు పరీక్ష ఫీజు దానికి సంబంధించిన రసీదును ఖచ్చితంగా తీసుకోండి.   -మన బ...

మొంథా తీవ్ర వాయుగుండంగా మారింది:

Image
 మొంథా తీవ్ర వాయుగుండంగా మారింది: ఎన్డీఆర్ఎఫ్ (వీడియో) ఆంధ్రప్రదేశ్ :బంగాళాఖాతంలో ఏర్పడిన 'మొంథా' వాయుగుండం సోమవారానికి తుఫానుగా మారుతుందని ఎన్టీఆర్‌ఫ్ కమాండర్ వెల్లడించారు. అలాగే మంగళవారంకు తీవ్ర తుఫానుగా మారనుందని తెలిపారు. దీని నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైందని,. ముంపు ప్రాంతాల్లో ప్రజలకు సహాయ సహకారాలు అందించడానికి ఎన్డీఆర్ఎఫ్ ఆరు బృందాలను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.

విద్యాసంస్థలు సెలవు ప్రకటించిన కలెక్టర్.

Image
 విద్యాసంస్థలు సెలవు ప్రకటించిన కలెక్టర్. ఈ నెల 27 తేదీ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు, అంగన్‌వాడీ పాఠశాలలు, కళాశాలలకు సెలవు  ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు. మోంత తుఫాన్ కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా నివారించే ఉద్దేశంతో జిల్లాలోని అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు గురుకుల పాఠశాలలు,  కళాశాలలు ఇతర విద్యాసంస్థలు అన్నింటికి 27 తేదీ సెలవు  ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు .

తీవ్రమైన తుఫాను "మొంత" అంచనా దృష్ట్యా మరియు విద్యార్థుల భద్రత మరియు భద్రతను పరిగణనలోకి

Image
 ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్  సెక్రటరీ కార్యాలయం, ఇంటర్మీడియట్ విద్యా మండలి, ఆంధ్రప్రదేశ్, తాడేపల్లి, గుంటూరు తీవ్రమైన తుఫాను "మొంత" అంచనా దృష్ట్యా మరియు విద్యార్థుల భద్రత మరియు భద్రతను పరిగణనలోకి తీసుకుని, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు మరియు YSR కడప జిల్లాల కలెక్టర్లు 2025 అక్టోబర్ 27 నుండి 31 వరకు జిల్లాల్లోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు సెలవులు ప్రకటించారు. ఈ ఆదేశాలను కఠినంగా అమలు చేయాలని అన్ని RJDIES, DIEOలు మరియు RIOలను ఇందుమూలంగా ఆదేశించడమైనది. సంబంధిత గౌరవ జిల్లా కలెక్టర్ ప్రకటించిన సెలవుల షెడ్యూల్ ప్రకారం పైన పేర్కొన్న రోజుల్లో విద్యార్థులు తమ ఇళ్లలోనే ఉండేలా మరియు ఏ సంస్థ పనిచేయకుండా చూసుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో మరిన్ని సహాయం కోసం అన్ని RJDIES, DIEOలు మరియు RIOలు జిల్లా ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉండాలి.  ఈ విషయంలో ఏదైనా విచలనం లేదా నిర్లక్ష్యం తీవ్రంగా పరిగణించబడుతుంది. ______ ది పేరెంట్స్ అసోసి​యేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (PAAP) ​📞 అత్యవసర కాల్ & సంప్రదించడానికి: ...

ప్రపంచంలో అతి చిన్న సినిమా*

Image
 *ప్రపంచంలో అతి చిన్న సినిమా* ఈ సినిమా నిడివి 2 నిమిషాలు మాత్రమే. దీన్ని రూపొందించడానికి దర్శకుడికి 30 నిమిషాలు పట్టింది. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు వచ్చింది  అవినీతి గురించి చాలా చెప్పబడింది, ఖచ్చితంగా చూడండి మరియు ఆలోచించండి మరియు చాలా మందికి చేరువచేయండి. 🇮🇳 జైహింద్🇮🇳

ప్ర‌జా ఉద్య‌మం"

Image
 న్యూస్ నైన్ ఛానల్: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ2 4-10-2025 మాజీ మంత్రి, పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో "వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌జా ఉద్య‌మం" పై రూపొందించిన పోస్ట‌ర్‌ ఆవిష్కరణ కార్యక్రమం మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కామెంట్స్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ ఆర్ సిపి కోటి సంతకాల కార్యక్రమం ఈ నెల 28న ఉదయం 9 గంటలకు భవానీపురం బ్యాంక్ సెంటర్ వద్ద నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు వైసిపి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ల ప్రయివేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరుతూ ఎమ్మార్వో గారికి వినతిపత్రం అందజేయడం జరుగును వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా సంఘాలు, ఇతర పార్టీ ల వారు, ప్రజలు విరివిరిగా పాల్గొని జయప్రదం చేయాలి విజయవాడ పశ్చిమలో ప్రతి డివిజన్ లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం శరవేగంగా జరుగుంతుంది ప్రజలు స్వచ్చందంగా బయటకు వచ్చి మద్దత్తు తెలుపుతున్నారు గతంలో ఆంధ్ర రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజ్ లు ఉండేవి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలనే గొప్ప ఉద్దేశంతో జగన్ మోహన్ రెడ్డి గారు స్థలాలు కేటాయించి నిర్మాణ పనులు ప్రారంబిం...

Amazonపై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ

Image
Amazonపై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ అమెజాన్ సంస్థకు కర్నూలు జిల్లా కన్స్యూమర్ ఫోరం నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఓ వినియోగదారుడు అమెజాన్లో రూ.80 వేలు చెల్లించి ఐఫోన్ 15+ ఆర్డర్ పెట్టగా.. ఐక్యూ ఫోన్ డెలవరీ అయ్యింది. కస్టమర్ కేర్కు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో బాధితుడు కన్స్యూమర్ ఫోరంను ఆశ్రయించాడు. దీంతో బాధితుడికి ఐఫోన్ డెలవరీ చేయని పక్షంలో రూ.80 వేలు+ రూ.25వేలు చెల్లించాలని కన్స్యూమర్ ఫోరం తీర్పు ఇచ్చింది.

పూనూరు గౌతమ్ రెడ్డి మీడియా సమావేశం

Image
 న్యూస్ నైన్ ఛానల్ఎన్ టి ఆర్ జిల్లా విజయవాడ*:  22/10/25 విజయవాడ,సత్యనారాయణపురంలోని రాష్ట్ర వైసీపీ ట్రేడ్ యూనియన్ కార్యాలయం నందు  వైసిపి రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి మీడియా సమావేశం. **పి. గౌతమ్ రెడ్డి కామెంట్స్*:  ఏపీలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతుంది  విద్యను ప్రైవేటీకరణ చేయడానికి చంద్ర బాబు నాయుడు ప్రోత్సహిస్తున్నారు దీనికి వైస్సార్ పార్టీ వ్యతిరేకిస్తుంది, కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపడుతుంది విజయవాడ లో ఆటో డ్రైవర్ కుమార్తెకు mbbs సీట్  ప్రీ గా వచ్చింది గతంలో చంద్రబాబు, లోకేష్ సమ్మిట్ పేరుతో ఇతర దేశాలకు వెళ్లి వచ్చారు వెళ్ళి రావడం తప్ప ఏపీలో  అభివృద్ధి చేసింది ఏమీ లేదు

నెల్లూరు లో జరిగిన సంఘటన గురించి అమ్మి శెట్టి వాసు మీడియా సమావేశం

Image
 News9 channel ఎన్ టి ఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం**  నెల్లూరు లో జరిగిన సంఘటన గురించి అమ్మి శెట్టి వాసు మీడియా సమావేశం  *అమ్మి శెట్టి వాసు కామెంట్స్* నెల్లూరులో జరిగిన ఇద్దరి మనుషుల గొడవను రెండు కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తుంది వైఎస్ఆర్సిపి పార్టీ నాన్న నాన్న శవం మీద రాజకీయం చేసిన పార్టీకి వేరే మనుషుల మీద రాజకీయం చేయకు రెం డో తారీకు జరిగిన ఈ కిరాతకమైన హత్యను పోలీసు వారు దర్యాప్తు చేసి వారి మీద కేసు కట్టడం జరిగింది  మూడో తారీఖున హత్య చేసిన చంద్రయ్య ఆస్తులన్నీ జప్తు చేయడం జరిగింది లక్ష్మీ నాయుడు కుటుంబం 40 సంవత్సరాలుగా టీడీపీతో కలిసే ఉంది కమ్మ,కాపు కుల గొడవలు ఉంటే ఈన్నాళ్ళు ఆ కుటుంబం ఇలా కలిసి ఉండేద అని  ప్రశ్నిస్తున్నాం పవన్ కళ్యాణ్  పోరాడే తత్వం చూసే ప్రజలు 100కి 100 స్ట్రైక్ రేట్ ఇచ్చారు ఏ కాపు కులస్తులకు అన్యాయం జరిగిన పవన్ కళ్యాణ్ స్పందించాలని వైఎస్ఆర్సిపి వాళ్ళు రాద్ధాంతం చేస్తున్నారు ఎందుకు అర్థం కావట్లేదు  కుల రాజకీయం చేయటానికి జనసేన పార్టీ స్థాపించలేదు,ఏ కులానికి అన్యాయం జరిగిన జనసేన పార్టీ ముందుంటుంది  జక్కంపూడి రాజా,జగన్మోహ...

ట్రాఫిక్ సమస్యలను కట్టడి చేయటానికి నూతనంగా నిర్మించి విజ్ఞప్తి 167 ఏ జాతీయ రహదారిని ఉపయోగించుకోవాలని

Image
ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టడానికి 167 A జాతీయ రహదారి ఉపయోగించండి. వినియోగదారుల సంఘం విజ్ఞప్తి  చిలకలూరిపేట న్యూస్9: పట్టణంలో నానాటికి పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యలను కట్టడి చేయటానికి నూతనంగా నిర్మించిన 167 ఏ జాతీయ రహదారిని ఉపయోగించుకోవాలని  కంజ్యుమర్ రైట్ ప్రొటేక్షన్ ఫోరం పల్నాడు జిల్లా కార్యవర్గ సభ్యులు ఆదివారం  పట్టణ సీఐ పీ రమేష్ బాబు ను కోరుతూ ఎస్సై రహంతుల్లా ని కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని గడియార స్తంభం నుంచి కొద్ది దూరంలోనే 167 ఏ రహదారి అందుబాటులోకి వచ్చిందని, రహదారికి అందుకు వెళ్లే మార్గాలను ఒకసారి పరిశీలించి వాహనాల రాకపోకలను మళ్లించినట్లయితే కొంత మేరకు అయినా ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టవచ్చునని వారు పట్టణ సీఐ పి రమేష్ బాబును కోరారు.. ఈ సందర్భంగా వినియోగదారులు సంఘం ఇచ్చిన విజ్ఞప్తిని పరిశీలిస్తామని ఎస్ ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో  జిల్లా అధ్యక్షులు మురికిపూడి ప్రసాద్, కార్యదర్శి రవి నాయక్, కోశాధికారి బేబీ విక్రమ్, సహాయ కార్యదర్శి గాలయ్య పాల్గొన్నారు.

ప్రతిఒక్కరం మనస్సాక్షిని ప్రశ్నించుకునే సమయం ఆసన్నమైంది

Image
 ప్రతిఒక్కరం మనస్సాక్షిని ప్రశ్నించుకునే సమయం ఆసన్నమైంది.....      *అధికారం కోసం నాయకులు దిగజారటంలో కొంత అర్థంఉంది. ఎందుకంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తులు సంపాదించడం, హోదాను అనుభవించడం, అధికారులపైన మరియు ప్రజలపైనపెత్తనం చలాయించవచ్చునుకాబట్టే.*       *కాకపోతే అంతేస్థాయిలో ప్రజలు ఎందుకు దిగజారిపోతున్నారో? అంతుపట్టడంలేదు. ఈరోజు డబ్బులుఉంటే కసబ్ లాంటి  నరహంతకుడ్నికూడా ఎన్నికల్లో గెలిపించే పరిస్థితిఉంది. దావూద్ ఇబ్రహీంలాంటి మాఫియావ్యక్తులను, అవినీతి అనకొండలను, నైతికత విలువలులేని వ్యక్తులనుకూడా డబ్బులుతీసుకుని గెలిపించే పరిస్థితులు దాపురిచ్చాయి. తర్వాత వాళ్లకింద బానిసలుగా బ్రతకడానికి కూడా సిగ్గు పడటంలేదు. ఆత్మఅభిమానం చంపుకొని, వాళ్లకి కూడా ప్రజలు  భజనచేస్తున్నారు. ఇది దేశానికి అత్యంత ప్రమాదకరం  ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావడానికి ప్రతిఒక్కరు కృషిచేయాలి. అవినీతి అంతం వైపు అడుగులు వేయాలి🫱🏾‍🫲🏼ఈ రాష్ట్ర ప్రజలు గూగుల్ సెర్చ్ చెయ్యండి.🇮🇳 జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ సమితి. CRPFI. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ రిలేషన్ సెక్రె...

ఉయ్యూరు రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఏవో , బాణాసంచా అమ్మకం దారులకు సూచనలు..

Image
 కృష్ణాజిల్లా.  పెనమలూరు నియోజకవర్గం.  ఉయ్యూరు రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఏవో , బాణాసంచా అమ్మకం దారులకు సూచనలు.. ఖచ్చితంగా ప్రతి షాప్ కి జీఎస్టీ లైసెన్స్ కలిగి ఉండాలి, కచ్చితంగా షాపులో పనిచేసే వారికి ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి.. మేం సర్కులర్ అందజేసిన తర్వాత కూడా అనుమతులు లేకుండా అమ్మకాలు జరిపితే లైసెన్సు మంజూరు కాదు.. ఇప్పటికే పలుచోట్ల కంకిపాడు మండలంలో అనుమతులు లేకుండా షాపులు అమ్మకాలు జరుపుకున్న వాటిపై విచారణకు ఆదేశించాము.. షాపు లైసెన్స్ కలిగిన వ్యక్తి మాత్రమే అమ్మకాలు జరపాలి, షాప్ లో ఎంతమంది పనిచేస్తున్నారు అనే వివరాలు పూర్తిగా అధికారులకు సమర్పించాలి,  షాపులో ఎవరెవరు పని చేస్తున్నారో వారి పూర్తి వివరాలు మూడు రోజులు ముందుగానే లోకల్ ఎమ్మార్వో గారికి సమర్పించాలి.. ఎన్ని అనుమతులకు లోబడి బాణాసంచా దుకాణాలు అమ్మకాలు నిజంగా జరుగుతున్నాయా...? అసలు బాణాసంచా అమ్మకాలపై జిఎస్టి అధికారులు ఇప్పటివరకు తనిఖీలు నిర్వహించిన దాఖలాలు లేవు.. గోసాల పరిధిలో అనుమతులు లేకుండా అమ్మకాలు జరిపిన షాపులపై రెవెన్యూ అధికారులు ఏమి చర్యలు చేపడతారో వేచి చూద్దాం..

నింగిలోకి వెళ్లిన మూడు శాటిలైట్లు.

Image
 న్యూస్ 9  ఛానల్ : కేఎల్సి యూనివర్సిటీ వడ్డేశ్వరం  *కెఎల్ శాట్ శాటిలైట్ల ప్రయోగం సక్సెస్.* నింగిలోకి వెళ్లిన మూడు శాటిలైట్లు. వాతావరణం, గాలిలోని తేమ, నాణ్యత, ఉష్ణోగ్రతల సమతుల్యతల పైన పరిశోధనలకు పునాది. రాకెట్ ప్రయోగం దిశగా అడుగులు వేస్తామంటున్న కెఎల్ యు వైస్ చైర్మన్ కోనేరు నిఖిల కార్తికేయన్. అనుకున్నట్లుగానే కెఎల్ డీమ్డ్ యూనివర్శిటీ అధ్యాపకులు, విద్యార్దులతో కలిసి రూపొందించిన  దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా కెఎల్ యూనివర్శిటీ తలపెట్టిన కెఎల్ జాక్ నింగిలోకి వెళ్లి పరిశోధనలు ప్రారంభించింది. 1-బెలూన్ సహాయంతో మొదటి కెఎల్ జాక్ శాటిలైట్ ను నింగిలోకి పంపారు. అత్యల్ప బరువు కలిగిన విద్యా శాటిలైట్లలో కేఎల్ జాక్ శాటిలైట్ ఒకటి. శనివారం నాడు ఉదయం 5:45 నిముషాలకు కెఎల్ జాక్ శాటిలైట్ ను పీకో బెలూన్ సాయంతో కేంద్ర మంత్రి భూపతి రాజు, వర్శిటీ వైస్ చాన్సులర్ డాక్టర్ జి.పార్ధసారదివర్మలు, విద్యార్దులతో కలిసి నింగిలోకి వదిలారు. కెఎల్ జాక్ శాటిలైట్  గాలి నాణ్యతపై పరిశోధన చేయనున్నట్లు రూపకర్త డాక్టర్ కె.సిహెచ్.శ్రీకావ్య తెలిపారు.  2- కెఎల్ శాట్ 2 ను ప్లైట్ మోడ్ డ్రోన్ సహాయంతో కేఎల్...

విజయవాడ తూర్పు 22వ డివిజన్ కోటి సంతకాల సేకరణ- దేవినేని అవినాష్

Image
 *విజయవాడ తూర్పు 22వ డివిజన్ కోటి సంతకాల సేకరణ- దేవినేని అవినాష్* న్యూస్ నైన్ :ఎన్ టి ఆర్ జిల్లా విజయవాడ* 17/10/25 విజయవాడ, తూర్పు నియోజకవర్గం,22వ డివిజన్లో కోటి సంతకాల సేకరణ చేపట్టిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. **దేవినేని అవినాష్ కామెంట్స్*: ఈ కోటి సంతకాల సేకరణ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయకుండా అడ్డుకోవడమే వైసీపీ లక్ష్యం  జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలను కట్టి పేద విద్యార్థులకు లబ్ధి చేకూరాలని చూస్తే కూటమి ప్రభుత్వం దాన్ని ప్రైవేటుపరం చేసి పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం చేస్తుంది ఈ కోటి సంతకాల సేకరణ చేపట్టి మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా గవర్నర్ కలిసి పరిస్థితిని వివరిస్తాము  గవర్నర్ ను కలిసిన తర్వాత ఆ కాలేజీలను ప్రైవేటుపరం కాకుండా వైఎస్ఆర్సిపి తరఫున పోరాటం చేస్తాం

విజయనగరం జిల్లా. బొబ్బిలి మండల పేరెంట్స్ అసోసియేషన్

Image
 17-10-2025. పత్రికా ప్రకటన...................... విజయనగరం జిల్లా. బొబ్బిలి మండల పేరెంట్స్ అసోసియేషన్. అధ్యక్షులుగా బంటుపల్లి దివ్య  , ప్రధాన కార్యదర్శిగా తొత్తరపూడి సంతోష్ కుమారి గార్లు నియామకం... పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ప్రకటన విజయవాడ, అక్టోబర్ 17: పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (PAAP) రాష్ట్ర కమిటీ విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కొత్త అధ్యక్షులు& కార్యదర్శిగా నియమించింది. ఈ బాధ్యత   బంటుపల్లి దివ్య గారిని నియమిస్తున్నట్లు రాష్ట్ర కమిటీ ప్రకటించింది. తల్లిదండ్రుల సమస్యలను ప్రభుత్వానికి తెలపడం, విద్యా రంగంలో శాశ్వత మార్పులు తీసుకురావడం వంటి ముఖ్యమైన లక్ష్యాలతో పనిచేస్తున్న PAAP కమిటీ బొబ్బిలి మండల స్థాయిలో సంఘటితంగా తల్లిదండ్రులను సమీకరించి విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేయనున్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా మా ఇద్దర పై కమిటీ నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ, మండల వ్యాప్తంగా తల్లిదండ్రులతో కమిటీ నిర్మాణం, నాయకత్వ లక్షణాలు కలిగిన వారిని ఎదగజేయడం వంటి బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు.             ఈ ...