Posts

Showing posts from September, 2025

సంస్కరణల్లో భాగంగా జీఎస్టీ

Image
 జీఎస్టీ పోస్టర్ ను ఆవిష్కరించిన తాసిల్దార్ షేక్ మొహమ్మద్ హుస్సేన్.  కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ప్రధాన సంస్కరణల్లో భాగంగా జీఎస్టీ  అనేక వస్తువులు పై తగ్గించి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకు వచ్చింది. సోమవారం వినియోగదారుల సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు వారు రూపొందించిన జీఎస్టీ పోస్టర్ ను తహసిల్దార్ షేక్ మొహమ్మద్ హుస్సేన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారుల సంఘం ప్రజలలో gst తగ్గింపు సందేశాన్ని కరపత్రికల ద్వారా  వాణిజ్య కూడళ్లలో ప్రచారం చేయటం జరిగింది అని తెలిపారు. వినియోగదారులు  తగ్గిన gst నీ పరిగణనలోకి తీసుకొని వస్తువులు కొనుగోలు చేయాలన్నారు. అదే విధంగా పోస్టర్ పై ఉన్న qr కోడ్ స్కాన్ చేయడం ద్వారా gst కాలిక్యులేటర్ వస్తుందన్నారు. ప్రజలు అవగాహన కలిగి ఉండాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్స్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం పల్నాడు జిల్లా అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్, రవి నాయక్, విక్రమ్, విద్యాసాగర్   తదితర  రెవెన్యూ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

గాలిగోపురం వద్ద మీడియా ప్రతినిధులపై పోలీసుల ఓవరాక్షన్

Image
 న్యూస్ నైన్ ఛానల్: విజయవా *గాలిగోపురం వద్ద  మీడియా ప్రతినిధులపై పోలీసుల ఓవరాక్షన్*  *కెమెరామెన్లు పాత్రికేయులను అడ్డుకుంటున్న పోలీసులు*  *ఉన్నతాధికారులు చెబుతున్నా, తీరు మార్చుకొని పోలీసులు*  *విధులు నిర్వహించేందుకు వచ్చే పాత్రికేయులను అడ్డుకుంటున్న పోలీసులు*  *పోలీసులు మాత్రేమే విధులు నిర్వహిస్తున్నారా??* *జర్నలిస్ట్ లు  విధులు నిర్వహించడం లేదా*??

నేషనల్ యోగాసన స్పోర్ట్స్ చాంపియన్షిప్ కార్యక్రమం

Image
 న్యూస్ నైన్ ఛానల్ *ఎన్టీఆర్ జిల్లా విజయవాడ*: విజయవాడ సిద్ధార్థ కాలేజీలో 6వ జూనియర్ మరియు సీనియర్ సి నేషనల్ యోగాసన స్పోర్ట్స్ చాంపియన్షిప్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ పాల్గొన్నారు.  **గద్దె రామ్మోహన్ కామెంట్స్*: యోగాసనాలు భారతదేశ యొక్క ముఖ్య సంపద  యోగాసనాల వలన మనుషులు కొన్ని వందల సంవత్సరాలు జీవించగలుగుతున్నారు  మన శరీరంలోని అన్ని అవయవాలను సక్రమంగా పని చేసే శక్తి యోగాసనాలకు మాత్రమే ఉన్నది

చీరాల రోడ్డు మలుపు అత్యంత ప్రమాదకరం

Image
 చీరాల రోడ్డు మలుపు అత్యంత ప్రమాదకరం  కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్  పట్టణంలో కళామందిర్ సెంటర్ మీదుగా చీరాల వెళ్ళు రహదారి నరసింహ స్వామి గుడిమలుపు రోడ్డు అంతా కూడా పూర్తిగా దెబ్బతిందని, ఇప్పటికే సగం రోడ్డు కోతకు గురై గుంటలు పడినవని ఇది జాతీయ రహదారుల శాఖ మరియు పురపాలక సంఘం సమన్వయంతో పనిచేసే ఈ సమస్యను పరిష్కరించాలని మురికిపూడి ప్రసాద్ కోరారు. రహదారికి ఒకవైపు నివాస గృహాలు ఉన్నాయని వాటికి కాలువ లేకపోవడం వల్ల ఎన్ని సార్లు బాగు చేసినా కూడా నీళ్లు నిలబడి రోడ్డు దెబ్బతిన్నదని ప్రసాద్ అన్నారు.  కావున మున్సిపల్ అధికారులు కూడా సమస్యను పరిశీలించి రహదారి పక్కన నీళ్లు నిలబడకుండా చేయాలని ఆయన కోరారు

మాజీ శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ తెలుగుదేశం పార్టీలో చేరారు

Image
 *చిలకలూరిపేట న్యూస్9: మాజీ శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ తెలుగుదేశం పార్టీలో చేరారు* *ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన టీడీపీకండువా కప్పుకున్నారు.*  *మర్రి రాజశేఖర్‌తో పాటు, మరో ఇద్దరు MLC లు కూడా టీడీపీలో చేరారు.* చిలకలూరిపేట నుంచి బయలుదేరిన మర్రి రాజశేఖర్ తన బృందంతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లారు. అక్కడ సీఎం చంద్రబాబు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

కరేడులో స్వచ్ఛందంగా భూ సేకరణ

Image
 *కరేడులో స్వచ్ఛందంగా భూ సేకరణ ఇప్పటికే 500 ఎకరాలు సేకరించాం రెవెన్యూ మినిస్టర్ అనగానే సత్యప్రసాద్* న్యూస్ నైన్ ఛానల్:అమరావతి 18.9.2025 అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు శాసనమండలిలో గురువారం కరేడు భూముల సేకరణపై సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్  పారిశ్రామిక హబ్ ను ఏర్పాటుచేయాలనే లక్ష్యంతో రైతుల నుండి భూములను సేకరణభూసేకరణ కారణంగా ఉపాధి కోల్పోయే కుటుంబాలకు ఉపాధిని కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే పారిశ్రామిక హబ్ ఏర్పాటు ద్వారా వచ్చే ఉద్యోగఅవకాశాల్లో  స్థానికులకే మొదటి అవకాశాలుకరేడులో మొత్తం ఇండోసోల్ కంపెనీ ఏర్పాటుచేయబోయే పారిశ్రామిక హబ్ కు 8,200 ఎకరాలు సేకరిస్తున్నాం.  రైతులను ఒప్పించి భూసేకరణ చేస్తున్నాం ఇప్పటికే 500 ఎకరాలు ఇచ్చేందుకు రైతులు లిఖిత పూర్వకంగా అంగీకారం పారిశ్రామిక హబ్ ఏర్పాటు ద్వారా తమ ప్రాంత రూపురేఖలు మారతాయని రైతులు నమ్మారు  నిజమైన పారిశ్రామికాభివృద్ధిని సాధించేందుకు మా సిఎం చంద్రబాబు కృషి  చేస్తున్నారు.  కియా పర...

ఆటో కార్మికులకు న్యాయం చేయాలని ధర్నా

Image
 సెప్టెంబరు 18, సాలూరు పట్టణం ఆటో కార్మికులకు న్యాయం చేయాలని ధర్నా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత మహిళలకు బస్సు పథకం వలన నష్టపోయిన ఆటో రంగా కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సాలూరు తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేసి అనంతరం తాసిల్దారి గారికి వినతిపత్రం అందించడం జరిగింది.   మనం జిల్లా సాలూరు పట్టణంలో సిఐటియు మరియు ఆటో డ్రైవర్ లు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్ వై నాయుడు మాట్లాడారు,  రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వెంటనే వాహన మిత్ర పథకం కింద ప్రతి ఆటో డ్రైవర్ కు 30,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు,  డ్రైవర్లకు ఉరితాడు లాంటి జీవో నెంబర్ 21న వెంటనే రద్దు చేసి రవాణా రంగ కార్మికులకు న్యాయం చేయాలని కోరారు.  రవాణా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆటో కార్మికులు మరియు రవాణా రంగంలో ఉండే కార్మిక వర్గానికి పథకాలు ఇవ్వాలని కోరారు.  ఈరోజు నుంచి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆటో కార్మికుల సమస్యలపై చర్చించి న్యాయం చేసేలా ప్రభుత్వం ప్రకటన విడుదల చేయాలని లేకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆటో కార్మికులు మరియు వారి క...

రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ మిషన్స్ డీలర్స్ కి అందించడం మరియు ట్రైనింగ్

Image
 పార్వతీపురం మన్యం జిల్లా. మన్యం జిల్లా సాలూరు. అందరికి నమస్కారం.  రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కొరకు ప్రభుత్వం వారు కొత్తగా ఈ పాస్ మిషన్స్ డీలర్స్ కి అందించడం జరిగినది.  డీలర్లు అందరికీ కొత్త ఈ పాస్ మిషన్ ఏ విధంగా వాడాలి అని చెప్పి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సాలూరు తాసిల్దార్ వారి కార్యాలయంలో సాలూరు డిపో డీలర్లు 58 మందికి ఉదయం ట్రైనింగ్ ఇవ్వడం అయినది.  మధ్యాహ్నం మక్కువ 28 డిపోలకి ఈపాస్ మిషన్లో ఏ విధంగా వాడాలో ట్రైనింగ్ ఇవ్వటమైనది.    సాయంకాలం పాచిపెంట 23 డిపోలకి డిపో డీలర్లకి ఏ విధంగా ఈ పాస్ మిషన్ వాడాలో ట్రైనింగ్ క్లాసు ఇవ్వటం అయినది. . ఇందులో   సురేష్ విజన్ టెక్  ట్రైనింగ్ అందరికీ ఇచ్చి ఉన్నారు.  ఈ ట్రైనింగ్ కాసులకి సాలూరు, పాచి పెంట, మక్కువ ఉప తాసిల్దారు ( పౌర సరఫరాలు) ముగ్గురు  తాసిల్దారు వారి కార్యాలయం లో హాజరైనారు.

58వ ఇంజనీర్స్ డే ఘనంగా నిర్వహణ

Image
 చిలకలూరిపేట న్యూస్9 : 📌 58వ ఇంజనీర్స్ డే ఘనంగా నిర్వహణ ఈ రోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి 164వ జయంతి సందర్భంగా 58వ ఇంజనీర్స్ డే ను CLESA-AP స్టేట్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొమ్మసాని కమలాకరరెడ్డి గారు అతిధిగా  చిలకలూరిపేట మునిసిపల్ ఆవరణలో ఘనంగా నిర్వహించాం. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ పి. శ్రీహరిరావు, చైర్మన్ షేక్ రఫాని, టీపీఎస్ వెంకటేశ్వరరావు, టిపిబిఓ రాజేష్ చౌదరి, టిపిబిఓ ఖాదర్, చిలకలూరిపేట లైసెన్సుడ్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షులు డేవిడ్ కృపాదానం, శ్యామప్రసాద్, చంద్ర కుమార్, శ్రీనివాసు, జబ్బార్ గారు, ఫిరోజ్ వార్డ్ ప్లానింగ్ సెక్రటరీలు తదితరులు పాల్గొని, ఇంజనీరింగ్ మహానేతకు నివాళులు అర్పించారు. *✍️ చిలకలూరిపేట లైసెన్స్డ్ ఇంజనీర్స్ అండ్ సర్వేయర్స్ అసోసియేషన్*

సీనియర్ సిటిజన్ టిడిఎస్ సమస్యను వెంటనే పరిష్కరించండి.

Image
 సీనియర్ సిటిజన్ టిడిఎస్ సమస్యను వెంటనే పరిష్కరించండి. చిలకలూరిపేట హెడ్ పోస్ట్ మాస్టర్ కు వినియోగదారుల సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్ వినతి పత్రం అందజేత.   నరసరావుపేట  పోస్టల్ డివిజన్ పరిధిలో సీనియర్ సిటిజన్ డిపాజిట్లపై టిడిఎస్ జమ వెయ్యలేదని. అంతేకాకుండా ఇదే సమస్యను పోస్టులు ఏజెంట్లు కూడా ఎదుర్కొంటున్నారని వినియోగదారుల సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్ అన్నారు. ఈ మేరకు సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ హెడ్ పోస్ట్ మాస్టర్ తోట రామకృష్ణకు ఏజెంట్లతో కలిపి ఆయన వినతి పత్రం అందించారు. అనంతరం నరసరావుపేట సూపర్డెంట్ ఆఫ్ పోస్ట్ అధికారితో ఈ సమస్య గురించి మాట్లాడారు. సమస్యను వెంటనే పరిష్కరిస్తామని నరసరావుపేట డివిజన్ సూపరింటెండెంట్  సాదిక్  ప్రసాద్ కు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ ఏజెంట్లు సీనియర్ సిటిజన్లు  పాల్గొన్నారు.

విజయవాడలో ‘కలర్స్ హెల్త్ కేర్’ లాంచ్.. ప్రారంభించిన సినీనటి సంయుక్త

Image
 న్యూస్ నైన్ ఛానల్ కలర్స్ హెల్త్ కేర్ నూతన బ్రాంచ్ ని విజయవాడలో ప్రారంభించిన సినీనటి సంయుక్త ఎన్టీఆర్ జిల్లా విజయవాడ 10/9/25 విజయవాడలో ‘కలర్స్ హెల్త్ కేర్’ లాంచ్ చేసినసంయుక్త మీనన్.ప్ర‌ముఖ హెల్త్ కేర్ సంస్థ ‘కలర్స్’ హెల్త్ కేర్ విజయవాడలో కొత్త బ్రాంచీని ఏర్పాటు చేసింది. శ్రీనివాస్‌నగర్ బ్యాంకు కాలనీలో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ నూతన బ్రాంచ్‌ను హీరోయిన్ సంయుక్త మీనన్ ప్రారంభించారు. ఆధునిక సాంకేతికతతో ఏర్పాటు చేసిన సౌకర్యాలను ఆమె స్వయంగా పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా సంయుక్త మీనన్, కలర్స్ హెల్త్ కేర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట శివాజీ కూన ,డైరెక్టర్ అఫ్ ఆపరేషన్స్ కృష్ణ రాజ్ ,మేనేజంగ్ డైరెక్టర్ - డా. విజయ్ కృష్ణ" మాట్లాడుతూ  “ప్రతి ఒక్కరూ అందంగా, ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు. ఒకరిలా మనం అనుకరించడం కాదు, మనకు తగిన స్టయిల్ లో మనం ఉండాలి. ఆధునిక టెక్నాలజీతో నాణ్యమైన హెల్త్ కేర్ సేవలు అందిస్తున్న కలర్స్ హెల్త్ కేర్ నిర్వాహకులకు అభినందనలు. అందరూ అందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటాం. అలాంటి ఆహ్లాదకరమైన, విశ్వసనీయమైన సేవలను విజయవాడ ప్రజలకు అందించడానికి ఈ సంస్థ ముం...

గిరిజన సంఘాలు ఏకతాటి పైకి రావాలి

Image
 గిరిజన సమాఖ్యకు వన్నె తెచ్చే విధంగా కృషి చేయాలి.సీపీఐ నాయకులు. గిరిజన సంఘాలు ఏకతాటి పైకి రావాలి.ప్రజా సంఘాల నాయకులు. బి.శ్రీను నాయక్ కు ఘన సన్మానించారు.   చిలకలూరిపేట న్యూస్ 9 సెప్టెంబర్-9. ఆంద్రప్రదేశ్ గిరిజన సమాఖ్య ను వన్నె తెచ్చే విధంగా కృషి చేయాలని సీపీఐ ఏరియా కార్యదర్శి తాళ్లూరి బాబురావు అన్నారు. మంగళవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన తెలిపారు. గిరిజన సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి. కోటా నాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో  బాబూరావు మాట్లాడుతూ  గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. పిడిఎం రాష్ట్ర నాయకులు వెంకటేశ్వరరావు (వైవి) మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన ప్రజలపై అనుసరిస్తున్న ద్వంద వైఖరికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన సంఘాలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి దాసరి వరహాలు రావు, మహిళా సమాఖ్య ఏరియా కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో గిరిజన ప్రజలు అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారికోసం ఉద్యమాలు చేయా...

డూండీ గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నసమారాధన – పోలీసుల పటిష్ట బందోబస్తు

Image
 న్యూస్ నైన్ వెబ్  ఛానల్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ  డూండీ గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నసమారాధన – పోలీసుల పటిష్ట బందోబస్తు 📍 ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ – 06/09/2025 విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని విద్యాధరపురంలో డూండీ గణేష్ సేవా సమితి 72 అడుగుల మహా మట్టి గణపతి మేనేజ్‌మెంట్ కమిటీ ఆధ్వర్యంలో అన్నసమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి వేలాదిమంది భక్తులు హాజరై, భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ స్వయంగా పర్యవేక్షించి, వచ్చిన భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్నసమారాధనను విజయవంతంగా పూర్తి చేశారు. కార్యక్రమం కారణంగా మెయిన్ రోడ్డుపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్ ఏసీపీ రామచంద్రరావు, సీఐ సురేష్, ఎస్‌ఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో పోలీసులు సమర్థవంతంగా ట్రాఫిక్‌ను నియంత్రించారు. అదే విధంగా, లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా లా అండ్ ఆర్డర్ ఏసీపీ దుర్గారావు, సీఐ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్సైలు, కానిస్టేబుళ్లు కఠిన భద్రతా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా, ఈ రోజు జరిగే గణేష్ నిమజ్జనం దృష్ట్యా ఉదయం నుంచి రాత్రి వరకు ...

శ్రీకర రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ ఎంపీ సినీ నటులు మురళీమోహన్

Image
 *శ్రీకర రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ ఎంపీ సినీ నటులు మురళీమోహన్* న్యూస్ నైన్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ 5/9/25 విజయవాడ,గురుణానక్ కాలనీ లో శ్రీకర రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ ఎంపీ,సినీ నటులు మురళీ మోహన్, జబర్దస్త్ ఫేమ్ వర్ష, శ్రీకర రియల్ ఎస్టేట్ సి ఎం డి దేవినేని సుధీర్. ఈ సందర్భంగా మురళీమోహన్, వర్ష , దేవినేని సుధీర్లు మాట్లాడుతూ జీవితంలో బిజినెస్ కి అవ్వాలనేదే కల అని,కిసాన్ ఇంజనీరింగ్ బిజినెస్ ప్రారంభించామన్నారు.100 రూపాయలతో జీతం తో జీవితం ప్రారంభించానని, శోభన్ బాబు ఇచ్చిన సలహాతో భూమి పై పెట్టుబడి పెట్టానన్నారు.హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ప్రారంభించి లాభాలు సాధించామని, ల్యాండ్ కొనే ముందు భవిష్యత్తులో జరిగే అభివృద్ధి వివరాలు తెలుసుకోవాలన్నారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ నీతిగా నిజాయితీగా ఉంటే అభివృద్ధి చెందుతారని,అమరావతి ఈ పాటికి అభివ్రుద్ది చెందాల్సిన అవసరం ఉందని,గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో అమరావతి నీ అభివృద్ధి చెందనివలేదని, దేశానికి ఒకే రాజధాని ఉందని, రాష్ట్రానికి కూడా ఒకే రాజధాని ఉండాలన్నారు. ప్రస్తుతం ప్రజల్లో చైతన్యం వచ్చిందని, కూటమి ప్రభుత్వం మ...

ఆటో కార్మికులు ఆకలి కేకలు పట్టించుకోని కూటమి ప్రభుత్వం

Image
 *ఆటో కార్మికులు ఆకలి కేకలు పట్టించుకోని కూటమి ప్రభుత్వం* న్యూస్ నైన్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ 5/9/25 - ప్రమాణాలు ఉల్లంఘించి ఆటో కార్మికుల పొట్ట కొడుతున్న  రాపిడ్, ఓలా, ఉబర్ బైక్ సర్విస్ లు ,      ఆటో కార్మికుల ఆకలి కేకలు పట్టించుకోని కూటమి ప్రభుత్వం, ఎన్నికల హామీలో భాగంగా ఆటో డ్రైవర్లు కి రూ. 15000లు ఇవ్వాలని, ఓలా, ఉబర్, రాపిడ్ సర్వీస్ రద్దు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని ఎం. రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇప్టూ అనుబంధ సంఘం ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్ టి యు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.రామకృష్ణ మాట్లాడుతూ  రాష్ట్ర వ్యాప్తంగా ఆటో రంగంపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులు రోడ్డున పడ్డారని విమర్శించారు.  రాపిడ్, ఓలా, ఉబర్ బైక్ సర్విస్ లు ఎటువంటి ప్రమాణాలు పాటించడం కూడా సర్వీస్ కంపెనీలు తమ ఆదాయం పెంచుకుంటూ ఆటోవాలా పొట్ట కొడుతున్నప్పటీకి  ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఆటో కార్మికులకు సంక...

సాలూరు, పార్వతీపురం మణ్యం జిల్లా : కోట వీధి వేపచెట్టుదగ్గర వినాయక చవితి అన్నప్రసాదం..

Image
 కోట వీధి వేపచెట్టుదగ్గర వినాయక చవితి అన్నప్రసాదం సాలూరు, పార్వతీపురం మణ్యం జిల్లా : వినాయక చవితి సందర్భంగా కొత్త వీధి వేపచెట్టుదగ్గర భక్తులకు అన్నప్రసాద విథరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానిక యువత ముందడుగు వేసి భక్తులందరికీ ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది.

మహానేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా

Image
 పార్వతీపురం మన్యం జిల్లా. మన్యం జిల్లా సాలూరు. దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో గల రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించిన మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర. Ys రాజశేఖర్ రెడ్డి రాష్ట్రానికి చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరని ఆయన ముఖ్యమంత్రి గా ఉన్నపుడు ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు  ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరస్మరణీయులుగా మిగిలారని అన్నారు. అదే విధంగా అతని తనయుడు జగన్ మోహన్ రెడ్డి కూడా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల మన్ననలు పొందారని కానీ ఇప్పటి కూటమి ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు కావస్తున్న ఇప్పటికీ ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందించడం లేదని. సంపదను సృష్టిస్తామని చెప్పిన చంద్రబాబు నెలకు 10 కోట్లు వరకు ఆయన పర్యటనలకు ప్రజల సొమ్మును విచ్చల విడిగా ఖర్చుచేస్తున్నారని అన్నారు.గత 5 సంవత్సరాల పాలనలో జగన్ మోహన్ రెడ్డి 3లక్షల 38వేల కోట్లు అప్పు చేస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడి 14 నెలలకే చంద్రబాబు సుమారు 2లక్షల కోట్లు అప్పుచేశారని ఇటువంటి ముఖ్యమంత్రి భారత దేశంలో ఎక్కడ ఉండరని వి...