Posts

Featured Post

విజయవాడ గ్రేటర్ కమ్మ సంక్రాంతి సంబరాలలో పాల్గొన్న మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి..

Image
 న్యూస్ నైన్ ఛానల్ 11/01/2026 కృష్ణాజిల్లా  *విజయవాడ గ్రేటర్ కమ్మ సంక్రాంతి సంబరాలలో పాల్గొన్న మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి..* *రాజ్యసభ సభ్యురాలు, మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి..* నాకు మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం కల్పించారు.. మన అని, మన వాళ్ళు అందరూ ఇక్కడ ఉంటారని ఇక్కడకు వచ్చాము.. *అప్పుడు రాజకీయ పరిస్థితుల వల్ల ఆగ్రహంతో ఒక మాట అన్నాను..* *కొండపైన అమ్మ వారు.. కొండ కింద కమ్మ వారు..* *ఆ తల్లి ఆశీసులతో ఈ కులాన్ని కాపాడుకోవాలి..* ఈ అవకాశం నేను పోగొట్టుకోకూడదని ఇక్కడకు వచ్చాను.. నేను 13 సంవత్సరం నుండే ట్రాక్టర్ నడిపాను.. అన్నిట్లో నువ్వు సమానమే అని నా తల్లిదండ్రులు నన్ను పెంచారు.. నువ్వు ఆడపిల్లవు నువ్వు తగ్గు అని ఏనాడు చెప్పలేదు.. మన కులంలో మహిళలను ముందుకు తీసుక రండి.. *ఎక్కడ మనం తగ్గాల్సిన అవసరం లేదు..* అమరావతి రైతుల పోరాటం తో ఇక్కడ గవర్నమెంట్ మారెవరకు అందరూ సహకరించారు.. కరెంట్ లేకపోయిన కంఠం వినిపించాలి.. *అప్పట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కూడా మన కోసం వెతుకుతుండేవారు..* ఈ కులం లో పుట్టినందుకు నాకు ధైర్యం వచ్చింది.. *మనం ఆర్డినరీ పీపుల్ కాదు ఎక్స్ట్రార్డినరీ పీపుల్..* *అమ...

విజయవాడ పడమటలంక తొమ్మిదవ డివిజన్లో సంక్రాంతి ముగ్గులు పోటీలు

Image
 *ఎన్టీఆర్ జిల్లా  విజయవాడ* న్యూస్ నైన్ ఛానల్ 10/01/2026 విజయవాడ పడమటలంక తొమ్మిదవ డివిజన్లో సంక్రాంతి  ముగ్గులు పోటీలు ఘనంగా నిర్వహించిన  "ముకుటశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ యాజమాన్యం,   ఈ సందర్భంగా టిడిపి సీనియర్ నాయకులు చెన్నిపాటి గాంధీ మాట్లాడుతూ మకుటశ్రీ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్  మన విజయవాడలోనే ఉంది  ఈ సంక్రాంతి సంబరాలను మకుటశ్రీ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ యాజమాన్యం స్వయంగా నిర్వహిస్తామని తెలిపారు.  ఈ కార్యక్రమంలో పడమటలంక డివిజన్ చుట్టుపక్కల ప్రజలందరూ పాల్గొని ఘనవిజయం చేశారు.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న పడమటలంక ప్రజలందరూ కూడా ముకుటశ్రీ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ ను ఒకసారి సందర్శించవలెనని తెలియజేస్తున్నాను అని అన్నారు.  మకుటశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ డైరెక్టర్ చిట్టా విజయ్ అండ్ టీం మాట్లాడుతూ  పటమటలంక 9వ డివిజన్లో సంక్రాంతి సంబరాలు కార్యక్రమం నిర్వహించడం మాకు చాలా ఆనందంగా ఉంది.  మకుటశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థను 15 మంది కలిసి స్థాపించడం జరిగింది.  సుమారు 7500 స్క్వేర్ ఫీట్ తో షోరూమును ప్రారంభించాము. డైమండ్ క్యారెట్ ...

ప్రాపర్టీ షో ప్రారంభమైంది

Image
 న్యూస్ 9 ఛానెల్: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ 9/01/2026 ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం బందర్ రోడ్డు ఏ కన్వెన్షన్ లో క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాపర్టీ షోలో పాల్గొన్న  ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్  ఫౌండర్ బర్ల రఘుబాబు మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ చరిత్రలో నూతన వరవడిని సృష్టిస్తూ కస్టమర్ కోరే విధంగా,వారి కోరిక మేరకు మంచి లొకేషన్ లో వారికి తగిన విధంగా ప్లాట్స్ ను తక్కువ ధరకు అందిస్తున్నాము.ప్రాపర్టీ కొనే విషయంలో లేదా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే విషయంలో కచ్చితంగా ఒక మంచి ఎక్స్పర్ట్ యొక్క సలహా మేరకు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మోసపోకుండా మంచి రిటర్న్స్ పొందుతారని, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం అనేది చిన్న విషయం కాదని అది చాలా పెద్ద విషయం అన్నారు. మా టీం మీరు కోరిన విధంగా రియాల్టీని అర్థం చేసుకుని, వాస్తవాలను మీకు తెలియజేస్తూ, మీరు కోరిన విధంగా టైలర్ మే డే ప్రాపర్టీని అం...

ఆరేవాకలెక్షన్స్, ఆయేషా జువెలర్స్ ఎగ్జిబిషన్ను ప్రారంభించిన మేయర్ రాయన భాగ్యలక్ష్మి

Image
 *ఆరేవాకలెక్షన్స్, ఆయేషా జువెలర్స్ ఎగ్జిబిషన్ను ప్రారంభించిన మేయర్ రాయన భాగ్యలక్ష్మి* న్యూస్ 9 ఛానెల్: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం  9/01/2026 ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఏ కన్వెన్షన్ ఎదురుగాఆరెవా కలెక్షన్స్, ఆయేషా జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ ను  ప్రారంభించిన విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి. ఈ సందర్భంగా రాయన భాగ్యలక్ష్మి, నిర్వాహకులు సుకెన్ మాట్లాడుతూ  విజయవాడలో ఆరెవా కలెక్షన్ను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది, ఈ జువెలరీ షోరూంలో బ్రైడల్ కలెక్షన్ తో పాటు 20 గ్రాములలో అనేక రకాల వెరైటీలు అందుబాటులో ఉన్నాయన్నారు. మేకింగ్ చార్జీలు తరుగు చాలా తక్కువగా ఉంటుందని, విజయవాడ ప్రజలు తప్పకుండా ఈ జెవెలరీ షోరూం కి వచ్చి విజిట్ చేయవలసిందిగా కోరుచున్నామని మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. మా దగ్గర కుందన్, నక్షీ, డైమండ్,జువెలరీ నీ మేము సొంతంగా తయారు చేస్తున్నామని, ఈ అరెవా కలెక్షన్ బ్రాండ్ ను మొట్టమొదటిసారిగా ఆస్ట్రేలియాలో ప్రారంభించామని, ప్రస్తుతం విజయవాడలో మా జువెలరీ ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరిగిందన్నారు. మా కస్టమర్ లకు డైరెక్ట్ గా హోల్ సేల్ రేట్లలో ఇవ్వాలన...

అంగన్వాడీ స్కూల్ భవనానికి 35 లక్షల సి ఎస్ ఆర్ ఫౌండేషన్

Image
 న్యూస్ 9 ఛానెల్  7/01/2026 *ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం* *అంగన్వాడీ స్కూల్ భవనానికి 35 లక్షల సి ఎస్ ఆర్ ఫౌండేషన్, నిధులతో నిర్మించుటకు ముందుకు వచ్చిన డైరెక్టర్ తోటకూర కిషన్ కుమార్* విజయవాడ,తూర్పు నియోజకవర్గం, 4వ డివిజన్ ఏపీ. ఐ ఐ సి కాలనీ రైతు బజార్ ఏరియాలో  అంగనవాడి స్కూల్ శంకుస్థాపన  కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ మోహన్ పాల్గొన్నారు. గద్దె రామ్మోహన్, చెరుకూరి మురళీ మాట్లాడుతూ ఈ విధంగా  తెలిపారు. రోడ్డు నిర్మాణంలో పోయిన అంగన్వాడీ భవనానికి 35 లక్షల సి ఎస్ ఆర్ ఫౌండేషన్, విఎంసి నిధులతో నిర్మించుటకు ముందుకు వచ్చిన  డైరెక్టర్ తోటకూర కిషన్ కుమార్. విద్యార్థిని విద్యార్థులకు సరికొత్త రూమ్స్ ఏర్పరిచేందుకు కాంట్రాక్టర్ చెరుకూరు మురళి 15 లక్షలతో  నిర్మిస్తానని ముందుకు రావడం జరిగింది సేవా కార్యక్రమాలు, సోషల్ యాక్టివిటీస్,కాంట్రాక్టర్ల లో మంచి అనుభవం కలిగిన చెరుకూరి మురళి ముందుకు రావటం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజ్ఞప్తి మేరకు అనేకమంది ముందుకు వచ్చి విద్యాలయాలు, హాస్పిటల్స్, రహదారులు అభివృద్ధి చేస్తున్నారు అని అన్...

నూతన సంవత్సరం వేళ మద్యం అమ్మకాలలో ప్రథమ స్థానం కైవసం చేసుకున్న బొబ్బిలి...దామోదర్.

Image
 06-01-2026 నూతన సంవత్సరం వేళ మద్యం అమ్మకాలలో ప్రథమ స్థానం కైవసం చేసుకున్న బొబ్బిలి...దామోదర్...               నూతన సంవత్సరం వేడుకల సందర్బంగా   విజయనగరం జిల్లాలో జరిగిన మద్యం అమ్మకాలలో అత్యధికంగా మద్యం అమ్మకం అయినది మన బొబ్బిలిలోనే అని లోక్ సత్తా నాయకుడు ఆకుల దామోదర రావు అన్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత ఆనంద పడాలో లేక బాధ పడాలో తెలియని పరిస్థితి అని ఆయన అన్నారు. ఈ కొత్త సంవత్సరం వేళ మన రాష్ట్రంలో జరిగిన మద్యం అమ్మకాలను గమనిస్తే డిసెంబర్ 31 వ తేదీ ఒక్కరోజే దాదాపు 200 కోట్ల రూపాయల మద్యం మన మందు బాబులు తాగారని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. నూతన సంవత్సర వేడుకల కోసం సాధారణంగా మూడు రోజుల ముందు నుంచే డిపోల నుండి మద్యాన్ని దుకాణాలకు చేరవేస్తారు. ఈ సారి డిసెంబరు 29,30,31 తేదీలలో 542.89 కోట్ల విలువైన మద్యం దుకాణాలకు చేరితే, మొత్తం 6.75 లక్షల ఐఎమ్ఎల్ కేసులు, 2.94 లక్షల కేసుల బీరు వెళితే అందులో డిసెంబరు 31 ఒక్కరోజే 2.65 లక్షల ఐఎమ్ఎల్, 1.15 లక్షల బీరు కేసులు అమ్ముడయినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. దీని విలువ దాదాపు 200 కోట్లు ఉంటుందని అంచనా. ...

బ్యాంకు అకౌంట్ ఫ్రిడ్జ్ చేయడంపై వినియోగదారుల సంఘానికి బ్యాంకు ఖాతాదారు ఫిర్యాదు చిలకలూరిపేట

Image
 వినియోగదారుల సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్ కు ఫిర్యాదు చేస్తున్న బ్యాంకు ఖాతాదారు బ్యాంకు అకౌంట్ ఫ్రిడ్జ్ చేయడంపై  వినియోగదారుల సంఘానికి బ్యాంకు ఖాతాదారు ఫిర్యాదు  చిలకలూరిపేట  పట్టణానికి చెందిన శిఖాకొల్లి శ్రీనివాసరావు సుబ్బయ్య తోటలో కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. ఇటీవల కాలంలో తన భార్య పేరు మీద చీరాల రోడ్లో ఉన్న ఒక ప్రాపర్టీని విక్రయించడంతో ప్రాపర్టీ కొన్నటువంటి కొనుగోలుదారులు ఆ మొత్తాన్ని ఆయన భార్య అయిన రజనీకుమారి పేరిట ఆమె ఖాతా ఉన్న యాక్సిస్ బ్యాంకుకు ఆర్టిజిఎస్ చేశారు. అయితే కొంత కాలం తర్వాత ఆ డబ్బును డ్రా చేసుకునేందుకు వారిద్దరూ బ్యాంకుకు వెళ్ళగా బ్యాంకు ఖాతాను స్తంభింప చేసినట్టు బ్యాంకు మేనేజర్ వినియోగదారులకి తెలిపారు. బ్యాంకు మేనేజర్ ను సంప్రదించగా జీఎస్టీ డిపార్ట్మెంట్ కు మీరు 18 లక్షలు బకాయి ఉన్నట్టు, బకాయి చెల్లించని కారణంగా మీ ఖాతాను స్తంభింప చేయమని జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ తెలంగాణ రాష్ట్రం ఖమ్మం నుంచి ఉత్తర్వులు వచ్చాయని అందు కారణంగా ఖాతాను స్తంభింప చేసినట్టు బ్యాంకు మేనేజర్ వారికి వివరణ ఇచ్చారు. కాగా వినియోగదారులు తెలంగాణ రాష్ట్రం ...

క్రీడా రంగ అభివృద్ధికి మీడియా మద్దతు అమూల్యం ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ(శాప్) ఛైర్మన్ రవినాయుడు

Image
 **క్రీడా రంగ అభివృద్ధికి మీడియా మద్దతు అమూల్యం ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ(శాప్) ఛైర్మన్ రవినాయుడు*: న్యూస్ 9 ఛానల్: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం. 04 జనవరి 2026 **2026 నూతన సంవత్సర శుభాకాంక్షలతో క్రీడా శాఖ కృతజ్ఞతలు*: 2025 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా శాఖకు, ముఖ్యంగా క్రీడాకారుల సంక్షేమం మరియు క్రీడా రంగ అభివృద్ధికి నిరంతర సహకారం అందించిన మీడియా సోదర–సోదరీమణులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని క్రీడా శాఖ వెల్లడించింది. మీ ప్రోత్సాహం, మద్దతు 2026 సంవత్సరంలో కూడా ఇలానే కొనసాగాలని ఆకాంక్షిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని పేర్కొంది. గతంలో రాష్ట్ర క్రీడా విభాగం స్పష్టమైన పాలసీ లేకుండా, మౌలిక వసతులు లేని పరిస్థితుల్లో నిద్రాణావస్థలో కొనసాగింది. తాను బాధ్యతలు స్వీకరించిన సమయంలో సమగ్ర క్రీడా విధానం లేకపోవడంతో, ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు రాష్ట్రానికి సమగ్ర క్రీడా పాలసీని ప్రకటించడం జరిగిందని తెలిపారు. ఈ పాలసీపై మీడియా ప్రతినిధులు, క్రీడా సంఘాలు, ప్లేయర్స్ అసోసియేషన్ల నుంచి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకుని...

కాంచీపురం పెరుమాళ్ సిల్క్ షోరూంను ప్రారంభించిన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు.

Image
 *ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేతుల మీదుగా కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ షోరూం ప్రారంభోత్సవం* ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు   నియోజకవర్గం. 4/01/2026 విజయవాడ లబ్బీపేట పివిసి మాల్ దగ్గర కాంచీపురం పెరుమాళ్ సిల్క్ షోరూంను ప్రారంభించిన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు నిర్వాహకులు భయ్యా రవి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కాంచీపురం పెరుమాళ్ సిల్క్ షోరూమ్ లు  మొత్తం నాలుగు స్థాపించారని, నెల్లూరు నుండి మొదలై విజయవాడ అమరావతి వరకు వ్యాపించాయన్నారు. దేశంలోనే అన్ని రాజధానుల కంటే అమరావతి రాజధాని ముందుకు దూసుకుపోతున్నది. విజయవాడ నగరానికి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు రావాలనేది నా కోరిక.  ప్రతి కుటుంబంలో ఒక ఎంట్రప్రెన్యూర్  ఉంటే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటూ ఉండేవారన్నారు. మేము చిన్నప్పటినుండి కాంచీపురం సిల్క్స్ గొప్ప సంస్థ అని వింటూ ఉండేవాళ్ళమన్నారు. ఈ షో రూమ్ లో గద్వాల్,పోచంపల్లి,ఆరని,బెనారస్ శారీస్ కలవని, మగ్గం వర్క్ తో చేసిన బ్లౌజ్,కంచి పట్టు చీర కలిపి 999 రూపాయలకు అఫర్ లో ఇస్త...

బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సహజ రైతు సదస్సు

Image
 **ఎన్ టి ఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం* న్యూస్ 9 ఛానల్: 3/01/2026 బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సహజ రైతు సదస్సు విజయవాడలోని వెన్యూ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ సదస్సుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ హాజరయ్యారు. 4 *బీజేపీ ఏపీ అధ్యక్షులు పీవీయన్ మాధవ్ కామెంట్స్*: కష్టాలు వచ్చినా, గిట్టుబాటు ధరలు రాకున్నా.. లక్ష్యాన్ని సాధించే వరకు సేంద్రీయ వ్యవసాయాన్ని వదలనందుకు ధన్యవాదాలు ప్రకృతి మాతను ఆరాధిస్తూ సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులు భవిష్యత్ తరాలకు ఆదర్శం నేటికీ భారతదేశంలో అత్యధిక శాతం మంది వ్యవసాయం మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు వ్యవసాయంలో వస్తున్న మార్పులు, సాగులో కొత్త విధానాలపై ప్రతిఒక్కరూ తెలుసుకోవాలి నేడు పురుగు మందులు వాడకం ద్వారా ఉత్పత్తి అయ్యే పంటల వల్ల నష్టం జరుగుతుంది ఈ దేశంలో విషన్ని జిమ్మేలా అనేక కుట్రలు చేశారు. భారతదేశం నేడు ప్రపంచంలో నే అనేక వ్యాధుల్లో మనం నెంబర్ వన్ గా ఉన్నాం క్యాన్సర్ తో పాటు, అనేక వ్యాధుల బారిన పడేవారి సంఖ్య మన దేశంలోనే ఎక్కువుగా ఉంది ఫార్మా కంపెనీలు కుమ్మక్కై వారే సమస్యలను సృష్టించి, వారే మందులను విక్రయిస్తారు వారిపై ఆధారపడి ఎంత...

బృందావనం తెలుగు కిచెన్ ' హోటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యేగద్దె రామ్మోహన్

Image
 *విజయవాడ తూర్పు నియోజకవర్గం లో ' బృందావనం తెలుగు కిచెన్ ' హోటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యేగద్దె రామ్మోహన్* న్యూస్ 9 ఛానెల ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం 3/01/2026 ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం లో బృందావనం తెలుగు కిచెన్ హోటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఈ హోటల్ గురు నానక్ కాలనీ కనకదుర్గ గెజిటెడ్ ఆఫీసర్స్ కాలనీ, రోడ్ నెంబర్ 5 లో ప్రారంభోత్సవం కార్యక్రమం జరిపారు ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ విజయవాడలోనే ప్రజలు ఎప్పుడు చూడలేనటువంటి సరికొత్త రుచులను అందించేందుకు బృందావన్ తెలుగు కిచెన్ హోటల్ ప్రారంభించడం జరిగిందని. మా హోటల్ లో  చికెన్ దమ్ బిర్యాని, మటన్ బిర్యానీ,పచ్చిమిర్చి కోడి పలావ్, మష్రూమ్స్ మసాలా, ఫిష్ ప్రాన్ మసాలా, స్పెషల్ చాపల పులుసు తదితర ఐటమ్స్ మా దగ్గర కలవన్నారు. ఇంటిదగ్గర చిన్న చిన్న పార్టీలకు, హాఫ్ శారీస్, పంచెల ఫంక్షన్ లకు కేటరింగ్ చేయబడునన్నారు. ఈ కార్యక్రమంలో  బృందావన్ తెలుగు కిచెన్ హోటల్  సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మ‌స్జీద్ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని,తూర్పు నియోజ‌కవ‌ర్గ ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్, జమైత్ అహలె హదీసు విజయవాడ సిటీ ప్రెసిడెంట్ నశీర్ అహ్మద్, వైఎస్ఆర్సిపి పార్టీ ఎమ్మెల్సీ రాహుల్లా.

Image
 న్యూస్ నైన్ ఛానల్2/01/25  ఎన్ టి ఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం*:  విజయవాడ,ల‌బ్భీపేట లోని చెన్నుపాటి పెట్రోల్ బంక్ ద‌గ్గ‌ర‌, డాక్ట‌ర్ వై.వి.రావు హాస్ప‌ట‌ల్ రోడ్ లో కొత్తగా పునర్నిర్మించిన  మ‌స్జీద్ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని,తూర్పు నియోజ‌కవ‌ర్గ ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్, జమైత్ అహలె హదీసు విజయవాడ సిటీ ప్రెసిడెంట్ నశీర్ అహ్మద్, వైఎస్ఆర్సిపి పార్టీ ఎమ్మెల్సీ రాహుల్లా. **ఎంపీ కేశినేని శివనాద్ మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు*: ఎవరని సహాయం అడగకుండా కేవలం  8 నెలలలో నాలుగు ఫ్లోర్ లు మసీదు ను నిర్మించిన నిర్వాహకులకు అభినందనలు  విజయవాడలో అనేకచోట్ల సొంత ఖర్చులతో భవనాలను నిర్మిస్తున్నారు సోషల్ యాక్టివిటీస్ కోసం నాలుగో ఫ్లోర్ కేటాయించడం ఆనందం గా ఉంది ప్రతి ఒక్కరూ మసీదును సందర్శించి, మసీద్ ప్రాచుర్యాన్ని పెంపొందించాలన్నారు. స్థలదాతకు,మసీదు నిర్వాహకులకు, మసీదు నిర్మాణానికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా విజయవాడ ప్రజలు తరుపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. **ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మసీదు నిర్వాహకులు నసీర్ అహ్మద్ మాట్లాడుతూ ఈ విధంగా...

ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఆర్గనైజేషనల్ ఎన్నికల - ఆంధ్రప్రదేశ్

Image
 News9 reporter(central) ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఆర్గనైజేషనల్ ఎన్నికల - ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్రప్రదేశ్లోని సంస్థ ఎన్నికలలో ఈ ఎన్నికలు జరిగాయి, ఈ ఎన్నికలు సరసమైన, పారదర్శక మరియు పూర్తిగా డిజిటల్ ప్రక్రియ ద్వారా నిర్వహించబడతాయి, ఆంధ్రప్రదేశ్ యువకులకు ఇవ్వడం సంస్థలో నాయకత్వ పాత్రలను తీసుకోవడానికి అవకాశం. భారతీయ ఎన్నికలలో తన నాయకులను ఎంపిక చేసుకోవటానికి భారతదేశంలో భారతీయ యువత కాంగ్రెస్ భారతదేశంలో మొదటి రాజకీయ సంస్థ. ప్రతి అర్హతగల యువత మెన్బెర్ పాల్గొనడానికి మరియు ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన అవకాశం పొందుతారు. కమిటీ నిర్మాణం - ఆంధ్ర ప్రదేశ్ బ్లాక్ (కమిటీ సైజ్ -21) * అసెంబ్లీ కమిటీ -33 సభ్యులు • జిల్లా కమిటీ - 37 మంది సభ్యులు • రాష్ట్ర కమిటీ • 69 మంది సభ్యులు పాల్గొనగలవారు 18 నుండి 35 ఏళ్ళు ఉండాలి • భారత పౌరుడు ప్రెస్ విడుదల అయి ఉండాలి • ఏ ఇతర రాజకీయ పార్టీ సభ్యుడిగా ఉండకూడదు సభ్యత్వ వివరాలు • సభ్యత్వ రుసుము: 750 • రిజిస్ట్రేషన్ కోసం Addlyc మొబైల్ అనువర్తనం ద్వారా మాత్రమే నమోదు: ఓటరు ID (ఎపిక్) • ఫోటో • చిన్న 8-రెండవ వీడియో నామినేషన్ ప్రక్రియ • నామినేషన్ ద్వారా మాత్ర...

బెస్ట్ కన్స్యూమర్ ఆక్టివిస్ట్ బేబీ విక్రమ్ ను సత్కరించిన డిఎస్ఓ ఎంవి ప్రసాద్

Image
 బెస్ట్ కన్స్యూమర్ ఆక్టివిస్ట్ బేబీ విక్రమ్ ను సత్కరించిన డిఎస్ఓ ఎంవి ప్రసాద్  చిలకలూరిపేట టౌన్, డిసెంబర్ 24, (న్యూస్9) పట్టణానికి చెందిన రామచంద్రుల బేబీ విక్రమ్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం పల్నాడు జిల్లా కార్యవర్గ సభ్యుడిగా పనిచేస్తున్నారు. జిల్లాలో బెస్ట్ కన్జ్యూమర్ యాక్టివిస్ట్ గా గుర్తింపు పొందారు. బుధవారం నరసరావుపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో జరిగిన జాతీయ వినియోగదారుల దినోత్సవంలో బేబీ విక్రమ్ ను జిల్లా పౌర సరఫరాల అధికారి ఎంవీ ప్రసాద్ ఘనంగా  సత్కరించారు.ఈ సందర్భంగా ఆయనకు జిల్లా నాయకులు మురికిపూడి ప్రసాద్, డాక్టర్ విద్యాసాగర్, రవి నాయక్, గాలయ్య, ఫిరోజ్ తదితరులు అభినందనలు తెలియజేశారు.

ప్రైవేట్ ట్రావెల్స్ వసూలు చేస్తున్న అధిక ధరలను నియంత్రించాలి

Image
 ప్రైవేట్ ట్రావెల్స్ వసూలు చేస్తున్న అధిక ధరలను నియంత్రించాలి రవాణా శాఖ అధికారికి వినియోగదారుల హక్కుల పరిరక్షణ ఫోరం నాయకుల వినతి పండుగలు మరియు ప్రత్యేక రోజుల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలు వినియోగదారుల వద్ద నుంచి ఊహించని విధంగా అత్యధిక ధరలు వసూలు చేస్తున్నారు అని, ట్రావెల్స్ మరియు ఆర్టీసీ తో పోల్చుకుంటే ఆర్టీసీ కంటే  నాలుగు రెట్లు అదనంగా పెంచుతున్నారు అని, టికెట్ ధరలను నియంత్రణ  చేయాలని  కన్స్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం, ప్రజా సంఘాల నాయకులు శుక్రవారం చిలకలూరిపేట రవాణా శాఖ అధికారి గోపాల్ కు వినతి పత్రాన్ని అందించారు.  అదేవిధంగా స్కూల్  బస్సులను తనిఖీ చేయాలని, ఫిట్నెస్ లేని బస్సులను ఆపివేసే విధంగా చర్యలు తీసుకోవాలనీ వారు కోరారు. అనంతరం వినియోగదారుల సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్ మాట్లాడుతూ ధరలు పెంచేందుకు ఒక ప్రాతిపదిక ఉండాలని, ప్రాతిపదిక లేని పక్షంలో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఇస్తానుసారంగా ధరలు పెంచుకుంటే వినియోగదారులు నష్టపోతున్నారని, ఆర్టీసీ బస్సులు కేవలం 50% పెంపుతో నడుపుతున్నారు  అని అన్నారు. రవాణా శాఖ అధికారులు దీనిపై...

అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠా అరెస్టు

Image
 News9 central విజయవాడ:  అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠా అరెస్టు  విజయవాడ పోలిసులు అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠాపై దాడులు నిర్వహించి 10 మందిని అరెస్టు చేశారు  విరి వద్ద నుంచి అమ్మకానికి వుంచిన ఐదుగురు పిల్లలను రక్షించి రూ.3.30 లక్షలు స్వాధీనం చేసుకున్నారు పోలిస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆదెశాల మెరకు టాస్క్ ఫోర్స్, భవానీపురం నున్న, పోలీసులు ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించి ప్రధాన నిందితురాలు సరోజినీ తో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు

విజయ్ దివాస్ సందర్భంగా ఎన్సీసీ కాడెట్స్ క్యాండిల్ ర్యాలీ

Image
 *విజయ్ దివాస్ సందర్భంగా ఎన్సీసీ కాడెట్స్ క్యాండిల్ ర్యాలీ* ప్రతి సంవత్సరం డిసెంబర్ 16న జరుపుకునే *విజయ్ దివాస్* సందర్భంగా, *05-Coy NCC* ఆధ్వర్యంలో *నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాల* ఆవరణలో ఘనంగా *విజయోత్సవ క్యాండిల్ ర్యాలీ* నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి *కళాశాల వైస్ చైర్మన్ శ్రీ మిట్టపల్లి చక్రవర్తి గారు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.* ఆయన మాట్లాడుతూ, 1971 భారత–పాకిస్తాన్ యుద్ధంలో భారత సైన్యం సాధించిన చారిత్రాత్మక విజయాన్ని స్మరించుకునే రోజే విజయ్ దివస్ అని తెలిపారు. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన అమర జవాన్ల త్యాగాలు ఎప్పటికీ స్మరణీయమని పేర్కొంటూ, యువతలో దేశభక్తి భావం మరింత బలపడాలని ఆకాంక్షించారు. అనంతరం *కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎస్. వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ*, విజయ్ దివస్ వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ మరియు సేవాభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఎన్సీసీ శిక్షణ ద్వారా నాయకత్వ లక్షణాలు వికసిస్తాయని, ప్రతి క్యాడెట్ దేశ సేవనే పరమ లక్ష్యంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. కళాశాల ఎన్సీసీ అధికారి లెఫ్టినెంట్ మెడికొండ రాజేష్ బాబు గారి స...

అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమితులైన గంజం వెంకట శివప్రసాద్

Image
 *13వ అదనపు పల్నాడు జిల్లా సెషన్స్ కోర్టు, నరసరావుపేట, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమితులైన గంజం వెంకట శివప్రసాద్ ( *GVS ప్రసాద్)*గారికి శుభాకాంక్షలు

పేరెంట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ - వినతి పత్రం

Image
 పేరెంట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ - వినతి పత్రం ​తేదీ : 16.12.2025, అమరావతి గౌరవనీయులైన ​శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అమరావతి. ​ ​విషయం: ఆంధ్రా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (AU DDE) పరీక్షల నిర్వహణలో తీవ్ర ఆలస్యం, మూల్యాంకన (వాల్యూయేషన్) లోపాలు, ఫలితాల విడుదలలో జాప్యం – విద్యార్థుల ఒక విద్యా సంవత్సరం నష్టపోకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అత్యవసర వినతి. ​​హృదయపూర్వక నమస్కారాలు. ​ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులు తమ ఉన్నత చదువులను (డిగ్రీ/పీజీ/డిప్లొమా) ఆంధ్రా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (AU DDE, విశాఖపట్నం) ద్వారా అభ్యసిస్తున్నారు. అయితే, గత కొంతకాలంగా ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విభాగం నిర్వహణలో చోటుచేసుకున్న తీవ్ర అవ్యవస్థల కారణంగా విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడుతోంది. ​మేము పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున, విద్యార్థుల అభ్యసన హక్కును, విద్యా సంవత్సరాన్ని పరిరక్షించమని కోరుతూ ఈ క్రింది అత్యవసర సమస్యలను మీ దృష్టికి తీసుకొస్తున్నాం: ​ప్రధాన సమస్యలు ​పరీక్షలు, ఫలితాల విడుదలలో అసాధారణ ఆలస్యం: ​5 నుంచి 6 నెలల...

నరసరావుపేట టూ టౌన్ మహిళ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన B.R YASHNA

Image
 నరసరావుపేట టూ టౌన్ మహిళ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన B.R YASHNA* సాధారణ బదిలీలో భాగంగా సత్తనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న B.R YASHNA నరసరావుపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ మహిళ ఎస్ఐగా సోమవారం బాధ్యతలు స్వీకరించారు

మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమ ర్యాలీ

Image
 *2029 గెలుపుకు విజయ సంకేతాలు* *ఇచ్చిన వైఎస్ఆర్* *కాంగ్రెస్ పార్టీ మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమ ర్యాలీ* !  *ప్రభంజనంలా కొనసాగుతున్న* *వైఎస్ఆర్ కాంగ్రెస్* *పార్టీ మెడికల్ కాలేజీల*ప్రైవేటీకరణ *వ్యతిరేక ఉద్యమ ర్యాలీ!*    *పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి సారధ్యంలో  కలిసికట్టుగా ఒకే జట్టుగా* *పల్నాడు జిల్లా వైఎస్సార్* *కాంగ్రెస్ పార్టీ* !  *పల్నాడు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్* *పార్టీ నేతల సమన్వయంతో* *అంబరాన్నంటిన సంబరాలు!*   *వేలాది మంది వైయస్సార్* *_కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో_* *నరసరావుపేట పురవీధుల్లో కోలాహలంగా కొనసాగుతున్న* *మెడికల్ కాలేజీల*ప్రైవేటీకరణ *వ్యతిరేక ఉద్యమ ర్యాలీ* !

నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో నూతన పీఎస్ఐగా శ్రీకాంత్ బాధ్యతల స్వీకరణ

Image
 పల్నాడు జిల్లా  నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో నూతన పీఎస్ఐగా శ్రీకాంత్ బాధ్యతల స్వీకరణ  నరసరావుపేటరూరల్ పోలీస్ స్టేషన్ లో నూతనంగా నియమితులైన పీఎస్ఐ శ్రీకాంత్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణకు, నేర నియంత్రణకు, ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ న్యాయసేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు.

సెల్ ఫోన్ లైట్ల వెలుగులలో ఖననం మున్సిపాలిటీ నిర్లక్ష్యం

Image
 *సెల్ ఫోన్ లైట్ల వెలుగులలో ఖననం*  సౌకర్యాలు లేమిలో ముస్లింల ఖబ్రస్థానం*   *మున్సిపాలిటీ  నిర్లక్ష్యం  నరసరావుపేట, డిసెంబర్ 15 చీకటి కప్పిన రాత్రి వేళల్లో, సెల్‌ఫోన్ లైట్లు మాత్రమే వెలుగు కాంతిగా మార్చుకుని, పార్దిపదేహాన్ని ఖననం చేయాల్సిన పరిస్థితి. ఇది  ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరిగిన సంఘటన  కాదు. పల్నాడు జిల్లా కేంద్రమైన  నరసరావుపేటలోని ముస్లిం ఖబ్రస్థానం వద్ద జరుగుతున్న హృదయవిదారక దృశ్యం. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ పవిత్ర స్థలం చీకటి, మురికి, అసౌకర్యాల మధ్య పడిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎన్నోసార్లు సౌకర్యాలు కల్పించాలని  మున్సిపాలిటీ అధికారులకు  విన్నపాలు చేసినా చర్యలు లేవని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు.  ఖబ్రస్థానం వద్ద రాత్రి ప్రార్థనల తర్వాత జరిగే అంత్యక్రియల సమయంలో, విద్యుత్ సౌకర్యం  లేకపోవడం వల్ల ప్రజలు బాధపడుతున్నారు. "మా తల్లిదండ్రులు, స్నేహితులు మమ్మల్ని వదిలి వెళ్లిన తర్వాత కనీసం శాంతిగా వారి స్మృతులకు సమాధి చేయాలి. కానీ ఇక్కడ చీకటి మధ్య సెల్‌ఫోన్ లైట్లు పట్టుకుని మట్టి చేయాల్సి వస్త...

రేపటి తరం" కోసం నెల్లూరులో కీలక తీర్మానం!

Image
  "రేపటి తరం" కోసం నెల్లూరులో కీలక తీర్మానం! ​రానున్న పరీక్షా కాలంలో విద్యార్థులను మానసిక, శారీరక ఒత్తిడి మరియు డ్రగ్స్ మహమ్మారి నుండి దూరం చేసేందుకు నెల్లూరు నగరంలో జరిగిన తలిదండ్రుల రౌండ్ టేబుల్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ​✨ ప్రధాన తీర్మానం: ​విద్యార్థి-తలిదండ్రుల ప్రత్యేక సమావేశాలు: జిల్లా, రాష్ట్రం లోని ప్రతి పాఠశాల మరియు కళాశాలలో ప్రత్యేక "విద్యార్థి-తలిదండ్రుల" సమావేశాలను ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ​సహాయ సహకారాలు: ఈ కార్యక్రమాలను ప్రభుత్వ సహకారంతో పాటు, ప్రముఖ సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్ మరియు స్వచ్ఛంద సంస్థల సహాయంతో నిర్వహించనున్నారు. ​🤝 నిర్వహణ: ​ఈ తీర్మానాన్ని ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (PAAP) (రిజిస్టర్ నెంబర్ 6/2022) యొక్క ఆంధ్రప్రదేశ్ కమిటీ రూపొందించి, పోస్టర్‌ను విడుదల చేసింది. ​సంప్రదింపు వివరాలు: ​📞 +91 63053 13558 ​📧 parentsassociationap@gmail.com

వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హౌస్ అరెస్ట్....

Image
 వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హౌస్ అరెస్ట్....  ఇటీవల పల్నాడు మాచర్ల లో జరిగిన డబల్ మర్డర్ కేసులో ముద్దాయిలుగా ఉన్న పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ని కోర్టు వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో లొంగిపోవాలని ఆదేశించిన నేపథ్యంలో వారిని మనోధైర్యం కల్పించేందుకు మరియు పరామర్శించేందుకు వెళుతున్న నేపథ్యంలో వెళ్లేందుకు అనుమతులు లేవని పోలీసులు ముందస్తు నోటీసులు జారీ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నట్లు నరసరావుపేట మాజీ శాసనసభ్యులు మరియు పల్నాడు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి.

పల్నాడు జిల్లా కలెక్టర్ కు 5వ ర్యాంక్

Image
 పల్నాడు జిల్లా కలెక్టర్ కు 5వ ర్యాంక్  కాకతీయ, కలెక్టరేట్ ప్రతినిధి: పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతికా శుక్లా కు 5వ ర్యాంక్ వరించింది. పల్నాడు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కృతికా శుక్లా అతి తక్కువ కాలంలోనే మంచిపేరు సంపాదించారు. వివిధ శాఖల ఫైల్స్ ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు ఆమె 110 ఫైల్స్ స్వీకరించారు. అందులో 73 క్లియర్ చేశారు. సగటున ఒక్కో ఫైల్ క్లియర్ చేయడానికి ఒక రోజు 3గంటల సమయం తీసుకున్నారు. దీంతో ఫైల్స్ క్లియరెన్స్ లో కలెక్టర్ కి సీఎం చంద్రబాబు 5వ ర్యాంకు ఇచ్చారు.