Posts

Featured Post

నా దేశ విద్యా వ్యవస్థ విద్యార్థుల మనశ్శాంతిని కాపాడగలదా?.

Image
 నా దేశ విద్యా వ్యవస్థ విద్యార్థుల మనశ్శాంతిని కాపాడగలదా?... -భారతదేశంలోని తరగతి గదులు తీవ్రమైన పరీక్షల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. 2013 మరియు 2023 మధ్య జరిగిన ఆత్మహత్య సంఘటనలలో దేశం 1,17,849 మంది విద్యార్థులను కోల్పోయింది.  -పరీక్షల ఒత్తిడి దేశంలోని ప్రతిభావంతులను విచ్ఛిన్నం చేస్తోంది. - పాఠశాలలు కళాశాలలు యాజమాన్యలు మరియు తల్లిదండ్రులదే ప్రధాన బాధ్యత...  @ మార్పు రావాలి.. - తలిదండ్రుల ఆలోచన విధానం లో.. - యాజమాన్యల వ్యాపార ధోరణి లో... - ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణిలో... @@ సమాజ హితులు... విజ్ఞులైన.. తలిదండ్రులు... మార్పు తేవాలి ...మార్పుకు సహకరించాలి.. 🕊️ ది ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్ అసోసియేషన్ (PAAP) (రిజి. నెం. 6/2022) ఆంధ్రప్రదేశ్ కమిటీ.. 📞 +91 63053 13558 📧 parentsassociationap@gmail.com 🌐 #EducationForAll | #ParentsVoiceAP -

కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో వాగ్దానాలను విస్మరించింది

Image
 చిలకలూరిపేట: న్యూస్9 కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గిరిజన ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను విస్మరించిందని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.శ్రీను నాయక్ అన్నారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో చిలకలూరిపేట నియోజకవర్గ  స్థాయి ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించడం జరిగింది. సందర్భంగా శ్రీను నాయక్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అక్రవర్ణాల ఆదిపత్యం ఎక్కువగా ఉండటం వలన బడుగు, బలహీన వర్గాల ప్రజలు చితికి పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికల్లో వారిచేత ఓట్లు వేయించుకొని వారికి కావల్సిన చిన్నచితికా పనులు చేయడంలో విఫలమయ్యారన్నారు. ఇదే ధోరణి రానున్న రోజుల్లో కొనసాగితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మూడు మండలాల్లో, పట్టణంలో గిరిజన సమాఖ్యను బలోపేతం చేయడం కోసం కృషి చేయాలన్నారు. దీపావళి పండుగ తర్వాత నూతన కమిటీ ఏర్పాటుకు సన్నాహాలు చేసుకోవాలన్నారు. రాజ్యాంగబద్ధంగా మనకు రావాల్సిన హక్కుల కోసం పోరాటాలు చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏరియా కార్యదర్శి తాళ్లూరు బాబురావు,తోపాటు ఆయా మండలాలకు చెందిన గిరిజన నాయకులు పాల్గొన్నారు.

గిరిజన శాఖ మంత్రి రాజీనామా చేయాలి.

Image
 గిరిజన శాఖ మంత్రి రాజీనామా చేయాలి. గిరిజన సమాఖ్య డిమాండ్. రాష్ట్ర సహాయ కార్యదర్శి బి. శ్రీను నాయక్. చిలకలూరిపేట/ పట్టణ శివారులో గల పురుషోత్తమపట్నం నందు గిరిజన గురుకుల పాఠశాల నిర్మాణము కొరకు మండలంలోని కమ్మవారిపాలెం వద్ద సుమారుగా య. 2.50 సెంట్లు కేటాయించారు. అందుకు సంబంధించి రూ. 4 కోట్లు ప్రణాళికలు రూపొందించారు. నేటికి ఇంతవరకు నిర్మాణము జరుగలేదు. ప్రస్తుతము ఉన్న గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థుల మరుగుదొడ్లు అస్తవ్యస్తముగా ఉన్నాయి. దీనికి సంబంధించి నిధులు కేటాయించామని చెప్పి ఇంతవరకు మరమ్మత్తులు చేయించడంలో అధికారులు విఫలమయ్యారని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి శ్రీను నాయక్ అన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం మండల తాహసిల్దార్ మహమ్మద్ హుస్సేన్ కు వినతిపత్రం పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతు గిరిజన గురుకుల పాఠశాల నూతన భవన నిర్మాణము చేపట్టాలని కోరారు. తక్షణమే మరుగుదొడ్ల సమస్య లేకుండా చేయాలన్నారు. ఈ విషయంపై గత అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించినప్పటికీ సంబంధ...

కూటమి పాలనలో నకిలీ మద్యం విపరీతంగా పెరిగింది

Image
 *దేవినేని అవినాష్ కామెంట్స్*  *ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు* కూటమి పాలనలో నకిలీ మద్యం విపరీతంగా పెరిగింది చిత్తూరు జిల్లాలో దొరికిన నకిలీ మద్యం లింక్ NTR జిల్లా వరకు  ఉందిఇ బ్రహీంపట్నం లో నకిలీ మద్యం ఆనవాళ్లు స్పష్టంగా ఉన్నాయిరా ష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి టిడిపి నాయకులు నకిలీ మద్యం సప్లై చేస్తున్నారు  టీడీపీ నేతలు అందరికీ జనార్ధన్ రావు దగ్గర మనిషిఅ తని ద్వారా ఇబ్రహీంపట్నం చుట్టూ ప్రక్కల మొత్తం నకిలీ మద్యం అమ్ముతున్నారు కూటమి నేతలు పేద ప్రజల ప్రాణం తీస్తున్నారు విజయవాడ పార్లమెంట్,మైలవరం ముఖ్య టిడిపి నేతలు కి జనార్ధన్ రావు ప్రతి నెల కమీషన్లు ఇస్తున్నాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు పై కక్ష్య సాధింపు చర్యలకు దిగి అక్రమంగా అరెస్ట్ చేశారు నకిలీ మద్యం పై చంద్రబాబు,పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఏమి సమాధానం చెబుతారుఎ న్ని లీటర్ల నకిలీ మద్యం దొరికింది పోలీసులు చెప్పాలి గతంలో కూడా టీడీపీ నేతలు నకిలీ మద్యం అమ్మారు చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు నకిలీ మద్యం అమ్ముతున్నారు ఎక్కడిక్కడ బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి నకిలీ మద్యం  అమ్ముతున్నారు...

సంస్కరణల్లో భాగంగా జీఎస్టీ

Image
 జీఎస్టీ పోస్టర్ ను ఆవిష్కరించిన తాసిల్దార్ షేక్ మొహమ్మద్ హుస్సేన్.  కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ప్రధాన సంస్కరణల్లో భాగంగా జీఎస్టీ  అనేక వస్తువులు పై తగ్గించి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకు వచ్చింది. సోమవారం వినియోగదారుల సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు వారు రూపొందించిన జీఎస్టీ పోస్టర్ ను తహసిల్దార్ షేక్ మొహమ్మద్ హుస్సేన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారుల సంఘం ప్రజలలో gst తగ్గింపు సందేశాన్ని కరపత్రికల ద్వారా  వాణిజ్య కూడళ్లలో ప్రచారం చేయటం జరిగింది అని తెలిపారు. వినియోగదారులు  తగ్గిన gst నీ పరిగణనలోకి తీసుకొని వస్తువులు కొనుగోలు చేయాలన్నారు. అదే విధంగా పోస్టర్ పై ఉన్న qr కోడ్ స్కాన్ చేయడం ద్వారా gst కాలిక్యులేటర్ వస్తుందన్నారు. ప్రజలు అవగాహన కలిగి ఉండాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్స్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం పల్నాడు జిల్లా అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్, రవి నాయక్, విక్రమ్, విద్యాసాగర్   తదితర  రెవెన్యూ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

గాలిగోపురం వద్ద మీడియా ప్రతినిధులపై పోలీసుల ఓవరాక్షన్

Image
 న్యూస్ నైన్ ఛానల్: విజయవా *గాలిగోపురం వద్ద  మీడియా ప్రతినిధులపై పోలీసుల ఓవరాక్షన్*  *కెమెరామెన్లు పాత్రికేయులను అడ్డుకుంటున్న పోలీసులు*  *ఉన్నతాధికారులు చెబుతున్నా, తీరు మార్చుకొని పోలీసులు*  *విధులు నిర్వహించేందుకు వచ్చే పాత్రికేయులను అడ్డుకుంటున్న పోలీసులు*  *పోలీసులు మాత్రేమే విధులు నిర్వహిస్తున్నారా??* *జర్నలిస్ట్ లు  విధులు నిర్వహించడం లేదా*??

నేషనల్ యోగాసన స్పోర్ట్స్ చాంపియన్షిప్ కార్యక్రమం

Image
 న్యూస్ నైన్ ఛానల్ *ఎన్టీఆర్ జిల్లా విజయవాడ*: విజయవాడ సిద్ధార్థ కాలేజీలో 6వ జూనియర్ మరియు సీనియర్ సి నేషనల్ యోగాసన స్పోర్ట్స్ చాంపియన్షిప్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ పాల్గొన్నారు.  **గద్దె రామ్మోహన్ కామెంట్స్*: యోగాసనాలు భారతదేశ యొక్క ముఖ్య సంపద  యోగాసనాల వలన మనుషులు కొన్ని వందల సంవత్సరాలు జీవించగలుగుతున్నారు  మన శరీరంలోని అన్ని అవయవాలను సక్రమంగా పని చేసే శక్తి యోగాసనాలకు మాత్రమే ఉన్నది

చీరాల రోడ్డు మలుపు అత్యంత ప్రమాదకరం

Image
 చీరాల రోడ్డు మలుపు అత్యంత ప్రమాదకరం  కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్  పట్టణంలో కళామందిర్ సెంటర్ మీదుగా చీరాల వెళ్ళు రహదారి నరసింహ స్వామి గుడిమలుపు రోడ్డు అంతా కూడా పూర్తిగా దెబ్బతిందని, ఇప్పటికే సగం రోడ్డు కోతకు గురై గుంటలు పడినవని ఇది జాతీయ రహదారుల శాఖ మరియు పురపాలక సంఘం సమన్వయంతో పనిచేసే ఈ సమస్యను పరిష్కరించాలని మురికిపూడి ప్రసాద్ కోరారు. రహదారికి ఒకవైపు నివాస గృహాలు ఉన్నాయని వాటికి కాలువ లేకపోవడం వల్ల ఎన్ని సార్లు బాగు చేసినా కూడా నీళ్లు నిలబడి రోడ్డు దెబ్బతిన్నదని ప్రసాద్ అన్నారు.  కావున మున్సిపల్ అధికారులు కూడా సమస్యను పరిశీలించి రహదారి పక్కన నీళ్లు నిలబడకుండా చేయాలని ఆయన కోరారు

మాజీ శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ తెలుగుదేశం పార్టీలో చేరారు

Image
 *చిలకలూరిపేట న్యూస్9: మాజీ శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ తెలుగుదేశం పార్టీలో చేరారు* *ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన టీడీపీకండువా కప్పుకున్నారు.*  *మర్రి రాజశేఖర్‌తో పాటు, మరో ఇద్దరు MLC లు కూడా టీడీపీలో చేరారు.* చిలకలూరిపేట నుంచి బయలుదేరిన మర్రి రాజశేఖర్ తన బృందంతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లారు. అక్కడ సీఎం చంద్రబాబు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

కరేడులో స్వచ్ఛందంగా భూ సేకరణ

Image
 *కరేడులో స్వచ్ఛందంగా భూ సేకరణ ఇప్పటికే 500 ఎకరాలు సేకరించాం రెవెన్యూ మినిస్టర్ అనగానే సత్యప్రసాద్* న్యూస్ నైన్ ఛానల్:అమరావతి 18.9.2025 అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు శాసనమండలిలో గురువారం కరేడు భూముల సేకరణపై సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్  పారిశ్రామిక హబ్ ను ఏర్పాటుచేయాలనే లక్ష్యంతో రైతుల నుండి భూములను సేకరణభూసేకరణ కారణంగా ఉపాధి కోల్పోయే కుటుంబాలకు ఉపాధిని కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే పారిశ్రామిక హబ్ ఏర్పాటు ద్వారా వచ్చే ఉద్యోగఅవకాశాల్లో  స్థానికులకే మొదటి అవకాశాలుకరేడులో మొత్తం ఇండోసోల్ కంపెనీ ఏర్పాటుచేయబోయే పారిశ్రామిక హబ్ కు 8,200 ఎకరాలు సేకరిస్తున్నాం.  రైతులను ఒప్పించి భూసేకరణ చేస్తున్నాం ఇప్పటికే 500 ఎకరాలు ఇచ్చేందుకు రైతులు లిఖిత పూర్వకంగా అంగీకారం పారిశ్రామిక హబ్ ఏర్పాటు ద్వారా తమ ప్రాంత రూపురేఖలు మారతాయని రైతులు నమ్మారు  నిజమైన పారిశ్రామికాభివృద్ధిని సాధించేందుకు మా సిఎం చంద్రబాబు కృషి  చేస్తున్నారు.  కియా పర...

ఆటో కార్మికులకు న్యాయం చేయాలని ధర్నా

Image
 సెప్టెంబరు 18, సాలూరు పట్టణం ఆటో కార్మికులకు న్యాయం చేయాలని ధర్నా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత మహిళలకు బస్సు పథకం వలన నష్టపోయిన ఆటో రంగా కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సాలూరు తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేసి అనంతరం తాసిల్దారి గారికి వినతిపత్రం అందించడం జరిగింది.   మనం జిల్లా సాలూరు పట్టణంలో సిఐటియు మరియు ఆటో డ్రైవర్ లు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్ వై నాయుడు మాట్లాడారు,  రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వెంటనే వాహన మిత్ర పథకం కింద ప్రతి ఆటో డ్రైవర్ కు 30,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు,  డ్రైవర్లకు ఉరితాడు లాంటి జీవో నెంబర్ 21న వెంటనే రద్దు చేసి రవాణా రంగ కార్మికులకు న్యాయం చేయాలని కోరారు.  రవాణా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆటో కార్మికులు మరియు రవాణా రంగంలో ఉండే కార్మిక వర్గానికి పథకాలు ఇవ్వాలని కోరారు.  ఈరోజు నుంచి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆటో కార్మికుల సమస్యలపై చర్చించి న్యాయం చేసేలా ప్రభుత్వం ప్రకటన విడుదల చేయాలని లేకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆటో కార్మికులు మరియు వారి క...

రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ మిషన్స్ డీలర్స్ కి అందించడం మరియు ట్రైనింగ్

Image
 పార్వతీపురం మన్యం జిల్లా. మన్యం జిల్లా సాలూరు. అందరికి నమస్కారం.  రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కొరకు ప్రభుత్వం వారు కొత్తగా ఈ పాస్ మిషన్స్ డీలర్స్ కి అందించడం జరిగినది.  డీలర్లు అందరికీ కొత్త ఈ పాస్ మిషన్ ఏ విధంగా వాడాలి అని చెప్పి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సాలూరు తాసిల్దార్ వారి కార్యాలయంలో సాలూరు డిపో డీలర్లు 58 మందికి ఉదయం ట్రైనింగ్ ఇవ్వడం అయినది.  మధ్యాహ్నం మక్కువ 28 డిపోలకి ఈపాస్ మిషన్లో ఏ విధంగా వాడాలో ట్రైనింగ్ ఇవ్వటమైనది.    సాయంకాలం పాచిపెంట 23 డిపోలకి డిపో డీలర్లకి ఏ విధంగా ఈ పాస్ మిషన్ వాడాలో ట్రైనింగ్ క్లాసు ఇవ్వటం అయినది. . ఇందులో   సురేష్ విజన్ టెక్  ట్రైనింగ్ అందరికీ ఇచ్చి ఉన్నారు.  ఈ ట్రైనింగ్ కాసులకి సాలూరు, పాచి పెంట, మక్కువ ఉప తాసిల్దారు ( పౌర సరఫరాలు) ముగ్గురు  తాసిల్దారు వారి కార్యాలయం లో హాజరైనారు.

58వ ఇంజనీర్స్ డే ఘనంగా నిర్వహణ

Image
 చిలకలూరిపేట న్యూస్9 : 📌 58వ ఇంజనీర్స్ డే ఘనంగా నిర్వహణ ఈ రోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి 164వ జయంతి సందర్భంగా 58వ ఇంజనీర్స్ డే ను CLESA-AP స్టేట్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొమ్మసాని కమలాకరరెడ్డి గారు అతిధిగా  చిలకలూరిపేట మునిసిపల్ ఆవరణలో ఘనంగా నిర్వహించాం. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ పి. శ్రీహరిరావు, చైర్మన్ షేక్ రఫాని, టీపీఎస్ వెంకటేశ్వరరావు, టిపిబిఓ రాజేష్ చౌదరి, టిపిబిఓ ఖాదర్, చిలకలూరిపేట లైసెన్సుడ్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షులు డేవిడ్ కృపాదానం, శ్యామప్రసాద్, చంద్ర కుమార్, శ్రీనివాసు, జబ్బార్ గారు, ఫిరోజ్ వార్డ్ ప్లానింగ్ సెక్రటరీలు తదితరులు పాల్గొని, ఇంజనీరింగ్ మహానేతకు నివాళులు అర్పించారు. *✍️ చిలకలూరిపేట లైసెన్స్డ్ ఇంజనీర్స్ అండ్ సర్వేయర్స్ అసోసియేషన్*

సీనియర్ సిటిజన్ టిడిఎస్ సమస్యను వెంటనే పరిష్కరించండి.

Image
 సీనియర్ సిటిజన్ టిడిఎస్ సమస్యను వెంటనే పరిష్కరించండి. చిలకలూరిపేట హెడ్ పోస్ట్ మాస్టర్ కు వినియోగదారుల సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్ వినతి పత్రం అందజేత.   నరసరావుపేట  పోస్టల్ డివిజన్ పరిధిలో సీనియర్ సిటిజన్ డిపాజిట్లపై టిడిఎస్ జమ వెయ్యలేదని. అంతేకాకుండా ఇదే సమస్యను పోస్టులు ఏజెంట్లు కూడా ఎదుర్కొంటున్నారని వినియోగదారుల సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్ అన్నారు. ఈ మేరకు సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ హెడ్ పోస్ట్ మాస్టర్ తోట రామకృష్ణకు ఏజెంట్లతో కలిపి ఆయన వినతి పత్రం అందించారు. అనంతరం నరసరావుపేట సూపర్డెంట్ ఆఫ్ పోస్ట్ అధికారితో ఈ సమస్య గురించి మాట్లాడారు. సమస్యను వెంటనే పరిష్కరిస్తామని నరసరావుపేట డివిజన్ సూపరింటెండెంట్  సాదిక్  ప్రసాద్ కు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ ఏజెంట్లు సీనియర్ సిటిజన్లు  పాల్గొన్నారు.

విజయవాడలో ‘కలర్స్ హెల్త్ కేర్’ లాంచ్.. ప్రారంభించిన సినీనటి సంయుక్త

Image
 న్యూస్ నైన్ ఛానల్ కలర్స్ హెల్త్ కేర్ నూతన బ్రాంచ్ ని విజయవాడలో ప్రారంభించిన సినీనటి సంయుక్త ఎన్టీఆర్ జిల్లా విజయవాడ 10/9/25 విజయవాడలో ‘కలర్స్ హెల్త్ కేర్’ లాంచ్ చేసినసంయుక్త మీనన్.ప్ర‌ముఖ హెల్త్ కేర్ సంస్థ ‘కలర్స్’ హెల్త్ కేర్ విజయవాడలో కొత్త బ్రాంచీని ఏర్పాటు చేసింది. శ్రీనివాస్‌నగర్ బ్యాంకు కాలనీలో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ నూతన బ్రాంచ్‌ను హీరోయిన్ సంయుక్త మీనన్ ప్రారంభించారు. ఆధునిక సాంకేతికతతో ఏర్పాటు చేసిన సౌకర్యాలను ఆమె స్వయంగా పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా సంయుక్త మీనన్, కలర్స్ హెల్త్ కేర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట శివాజీ కూన ,డైరెక్టర్ అఫ్ ఆపరేషన్స్ కృష్ణ రాజ్ ,మేనేజంగ్ డైరెక్టర్ - డా. విజయ్ కృష్ణ" మాట్లాడుతూ  “ప్రతి ఒక్కరూ అందంగా, ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు. ఒకరిలా మనం అనుకరించడం కాదు, మనకు తగిన స్టయిల్ లో మనం ఉండాలి. ఆధునిక టెక్నాలజీతో నాణ్యమైన హెల్త్ కేర్ సేవలు అందిస్తున్న కలర్స్ హెల్త్ కేర్ నిర్వాహకులకు అభినందనలు. అందరూ అందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటాం. అలాంటి ఆహ్లాదకరమైన, విశ్వసనీయమైన సేవలను విజయవాడ ప్రజలకు అందించడానికి ఈ సంస్థ ముం...

గిరిజన సంఘాలు ఏకతాటి పైకి రావాలి

Image
 గిరిజన సమాఖ్యకు వన్నె తెచ్చే విధంగా కృషి చేయాలి.సీపీఐ నాయకులు. గిరిజన సంఘాలు ఏకతాటి పైకి రావాలి.ప్రజా సంఘాల నాయకులు. బి.శ్రీను నాయక్ కు ఘన సన్మానించారు.   చిలకలూరిపేట న్యూస్ 9 సెప్టెంబర్-9. ఆంద్రప్రదేశ్ గిరిజన సమాఖ్య ను వన్నె తెచ్చే విధంగా కృషి చేయాలని సీపీఐ ఏరియా కార్యదర్శి తాళ్లూరి బాబురావు అన్నారు. మంగళవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన తెలిపారు. గిరిజన సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి. కోటా నాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో  బాబూరావు మాట్లాడుతూ  గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. పిడిఎం రాష్ట్ర నాయకులు వెంకటేశ్వరరావు (వైవి) మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన ప్రజలపై అనుసరిస్తున్న ద్వంద వైఖరికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన సంఘాలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి దాసరి వరహాలు రావు, మహిళా సమాఖ్య ఏరియా కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో గిరిజన ప్రజలు అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారికోసం ఉద్యమాలు చేయా...

డూండీ గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నసమారాధన – పోలీసుల పటిష్ట బందోబస్తు

Image
 న్యూస్ నైన్ వెబ్  ఛానల్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ  డూండీ గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నసమారాధన – పోలీసుల పటిష్ట బందోబస్తు 📍 ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ – 06/09/2025 విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని విద్యాధరపురంలో డూండీ గణేష్ సేవా సమితి 72 అడుగుల మహా మట్టి గణపతి మేనేజ్‌మెంట్ కమిటీ ఆధ్వర్యంలో అన్నసమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి వేలాదిమంది భక్తులు హాజరై, భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ స్వయంగా పర్యవేక్షించి, వచ్చిన భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్నసమారాధనను విజయవంతంగా పూర్తి చేశారు. కార్యక్రమం కారణంగా మెయిన్ రోడ్డుపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్ ఏసీపీ రామచంద్రరావు, సీఐ సురేష్, ఎస్‌ఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో పోలీసులు సమర్థవంతంగా ట్రాఫిక్‌ను నియంత్రించారు. అదే విధంగా, లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా లా అండ్ ఆర్డర్ ఏసీపీ దుర్గారావు, సీఐ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్సైలు, కానిస్టేబుళ్లు కఠిన భద్రతా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా, ఈ రోజు జరిగే గణేష్ నిమజ్జనం దృష్ట్యా ఉదయం నుంచి రాత్రి వరకు ...

శ్రీకర రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ ఎంపీ సినీ నటులు మురళీమోహన్

Image
 *శ్రీకర రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ ఎంపీ సినీ నటులు మురళీమోహన్* న్యూస్ నైన్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ 5/9/25 విజయవాడ,గురుణానక్ కాలనీ లో శ్రీకర రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ ఎంపీ,సినీ నటులు మురళీ మోహన్, జబర్దస్త్ ఫేమ్ వర్ష, శ్రీకర రియల్ ఎస్టేట్ సి ఎం డి దేవినేని సుధీర్. ఈ సందర్భంగా మురళీమోహన్, వర్ష , దేవినేని సుధీర్లు మాట్లాడుతూ జీవితంలో బిజినెస్ కి అవ్వాలనేదే కల అని,కిసాన్ ఇంజనీరింగ్ బిజినెస్ ప్రారంభించామన్నారు.100 రూపాయలతో జీతం తో జీవితం ప్రారంభించానని, శోభన్ బాబు ఇచ్చిన సలహాతో భూమి పై పెట్టుబడి పెట్టానన్నారు.హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ప్రారంభించి లాభాలు సాధించామని, ల్యాండ్ కొనే ముందు భవిష్యత్తులో జరిగే అభివృద్ధి వివరాలు తెలుసుకోవాలన్నారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ నీతిగా నిజాయితీగా ఉంటే అభివృద్ధి చెందుతారని,అమరావతి ఈ పాటికి అభివ్రుద్ది చెందాల్సిన అవసరం ఉందని,గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో అమరావతి నీ అభివృద్ధి చెందనివలేదని, దేశానికి ఒకే రాజధాని ఉందని, రాష్ట్రానికి కూడా ఒకే రాజధాని ఉండాలన్నారు. ప్రస్తుతం ప్రజల్లో చైతన్యం వచ్చిందని, కూటమి ప్రభుత్వం మ...

ఆటో కార్మికులు ఆకలి కేకలు పట్టించుకోని కూటమి ప్రభుత్వం

Image
 *ఆటో కార్మికులు ఆకలి కేకలు పట్టించుకోని కూటమి ప్రభుత్వం* న్యూస్ నైన్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ 5/9/25 - ప్రమాణాలు ఉల్లంఘించి ఆటో కార్మికుల పొట్ట కొడుతున్న  రాపిడ్, ఓలా, ఉబర్ బైక్ సర్విస్ లు ,      ఆటో కార్మికుల ఆకలి కేకలు పట్టించుకోని కూటమి ప్రభుత్వం, ఎన్నికల హామీలో భాగంగా ఆటో డ్రైవర్లు కి రూ. 15000లు ఇవ్వాలని, ఓలా, ఉబర్, రాపిడ్ సర్వీస్ రద్దు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని ఎం. రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇప్టూ అనుబంధ సంఘం ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్ టి యు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.రామకృష్ణ మాట్లాడుతూ  రాష్ట్ర వ్యాప్తంగా ఆటో రంగంపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులు రోడ్డున పడ్డారని విమర్శించారు.  రాపిడ్, ఓలా, ఉబర్ బైక్ సర్విస్ లు ఎటువంటి ప్రమాణాలు పాటించడం కూడా సర్వీస్ కంపెనీలు తమ ఆదాయం పెంచుకుంటూ ఆటోవాలా పొట్ట కొడుతున్నప్పటీకి  ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఆటో కార్మికులకు సంక...

సాలూరు, పార్వతీపురం మణ్యం జిల్లా : కోట వీధి వేపచెట్టుదగ్గర వినాయక చవితి అన్నప్రసాదం..

Image
 కోట వీధి వేపచెట్టుదగ్గర వినాయక చవితి అన్నప్రసాదం సాలూరు, పార్వతీపురం మణ్యం జిల్లా : వినాయక చవితి సందర్భంగా కొత్త వీధి వేపచెట్టుదగ్గర భక్తులకు అన్నప్రసాద విథరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానిక యువత ముందడుగు వేసి భక్తులందరికీ ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది.

మహానేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా

Image
 పార్వతీపురం మన్యం జిల్లా. మన్యం జిల్లా సాలూరు. దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో గల రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించిన మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర. Ys రాజశేఖర్ రెడ్డి రాష్ట్రానికి చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరని ఆయన ముఖ్యమంత్రి గా ఉన్నపుడు ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు  ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరస్మరణీయులుగా మిగిలారని అన్నారు. అదే విధంగా అతని తనయుడు జగన్ మోహన్ రెడ్డి కూడా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల మన్ననలు పొందారని కానీ ఇప్పటి కూటమి ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు కావస్తున్న ఇప్పటికీ ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందించడం లేదని. సంపదను సృష్టిస్తామని చెప్పిన చంద్రబాబు నెలకు 10 కోట్లు వరకు ఆయన పర్యటనలకు ప్రజల సొమ్మును విచ్చల విడిగా ఖర్చుచేస్తున్నారని అన్నారు.గత 5 సంవత్సరాల పాలనలో జగన్ మోహన్ రెడ్డి 3లక్షల 38వేల కోట్లు అప్పు చేస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడి 14 నెలలకే చంద్రబాబు సుమారు 2లక్షల కోట్లు అప్పుచేశారని ఇటువంటి ముఖ్యమంత్రి భారత దేశంలో ఎక్కడ ఉండరని వి...

ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదం

Image
  ఘటన వివరాలు హైదరాబాద్ లోని మెహదీపట్నం బస్ స్టాప్ వద్ద ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదం జరిగింది.  ఇంజిన్ భాగంలో ఒక్కసారిగా మంటలు రావడం జరిగిందని తెలిపారు. డ్రైవర్ మంటలను గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు. బస్సును రోడ్డు పక్కకు నిలిపి, ప్రయాణికులను అందరినీ కిందకు దించేశారు. ప్రమాద నివారణ ఆర్టీసీ బస్సు ముందు భాగం పూర్తిగా దగ్దమైంది కానీ ఎవరికి గాయాలు కాలేదు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేశారు. ప్రమాదానికి కారణాలు షార్ట్  సర్క్యూట్ వల్లే ప్రమాదం సంభవించి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. మెకానికల్ విభాగం కారణాలను విశ్లేషిస్తోంది. విపరీతమైన ప్రమాదం తప్పింది డ్రైవర్ యొక్క చాతుర్యంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు.

ఏకగ్రీవంగా ఎన్నికైన *బోనం శ్రీనివాసరావు*

Image
 తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ టిఎన్టియుసి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన *బోనం శ్రీనివాసరావు* చిలకలూరిపేట    తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బోనం శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ  ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ సంస్థాగత  ఎన్నికలను నిర్వహించారు. ఈ  ఎన్నిక కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మరియు కాపు సంఘం నాయకులైన బోనం శ్రీనివాసరావు రెండోసారి తెలుగునాడు ట్రేడ్ యూనియన్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. దశాబ్ద కాలంగా నియోజకవర్గంలోని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఆయన ఎంతో కృషి చేశారు. ఎన్నికల సమయంలో ఆ వార్డుకు ప్రాతినిధ్య వహిస్తూ పార్టీ గెలిచేందుకు శ్రీనివాసరావు కష్టపడ్డారు. శ్రీనివాస రావు కృషిని గుర్తించిన మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారు వారి ఆశీస్సులతో శ్రీనివాసరావు రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వారి ఎన్నిక  పట్ల పార్టీ నాయకులు మరియు కాపు సంఘం నాయకులు, కార్మిక సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. తన పదవి కొరకు కృషి చేసిన కృషి చేసిన మాజీ మంత్రి పత్తిపాటి ప...

వినాయక విగ్రహాలు పెట్టే ఆర్గనైజర్స్ అందరికీ పోలీస్ వారి విజ్ఞాపన

Image
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సర్కిల్ పరిధిలో వినాయక విగ్రహాలు పెట్టే ఆర్గనైజర్స్ అందరికీ పోలీస్ వారి విజ్ఞాపన ....

నియోజకవర్గ విద్యుత్ వినియోగదారుల సమస్యలు

Image
 నియోజకవర్గ విద్యుత్ వినియోగదారుల సమస్యలను సిజిఆర్ ఎఫ్ చైర్మన్ కు వివరిస్తున్న కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్     పట్టణంలోని సింగు మినీ ఫంక్షన్ హాల్ లో మంగళవారం జరిగిన విద్యుత్ వినియోగదారుల న్యాయ సదస్సులో కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్ పాల్గొని పలు సమస్యలను విశ్రాంత న్యాయమూర్తి మరియు సిజిఆర్ఎఫ్ చైర్మన్ విక్టర్ ఇమ్మానియేల్ దృష్టికి తీసుకువచ్చారు.  పట్టణంలో విద్యుత్ స్మార్ట్ మీటర్లు వినియోగదారుల అనుమతి లేకుండా ఏర్పాటు చేయకూడదని, అదేవిధంగా నెహ్రు నగర్ మధ్యనగర్ గుర్రాల చావిడి ప్రాంతాల్లో లో వోల్టేజ్ సమస్య ఉందని వారి దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాకుండా విద్యుత్ ఎమర్జెన్సీ కాల్స్ కు సంబంధిత అధికారులు ఎవరూ కూడా సత్వరమే స్పందించడం లేదని ఫిర్యాదు చేశారు. విద్యుత్ షాక్ వల్ల చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ఇచ్చే నష్టపరిహారాన్ని జాప్యం చేయకుండా వెంటనే ఇవ్వాలని కోరేరు. విద్యుత్ బిల్లులు కట్టించుకునే కౌంటర్ను మరొకటి ఏర్పాటు చేయాలని, విద్యుత్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా శిథిలావస్థలో ఉన్న విద...

ఈనెల 19న జరగనున్న విద్యుత్ వినియోగదారుల సదస్సును విద్యుత్ వినియోగదారులు ఉపయోగించుకోవాలి..

Image
 ఈనెల 19న జరగనున్న విద్యుత్ వినియోగదారుల సదస్సును విద్యుత్ వినియోగదారులు ఉపయోగించుకోవాలి....   *మురికిపూడి ప్రసాద్ కన్స్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం అధ్యక్షులు*  పల్నాడు జిల్లా   చిలకలూరిపేట ఈనెల 19వ తేదీ పట్టణంలోని సింగ్ మినీ ఫంక్షన్ హాల్లో జరగనున్న విద్యుత్ వినియోగదారుల సదస్సును వినియోగదారులు ఉపయోగించుకోవాలని పల్నాడు జిల్లా అధ్యక్షులు మురికిపూడి ప్రసాద్ కోరేరు. ఈ సదస్సు జిల్లా విశ్రాంత న్యాయమూర్తి సమక్షంలో నిర్వహించబడుతుంది కాబట్టి ఇప్పటివరకు నియోజకవర్గ స్థాయిలో పరిష్కారం కానీ విద్యుత్ సమస్యలను ఆయన వెంటనే అక్కడే పరిష్కారం చేస్తారని తెలిపారు. వినియోగదారులు  తమ సమస్యలను ఒక పేపర్ పై వ్రాసి తెలియపరచినట్లయితే వెంటనే పరిష్కారం చేస్తారు అన్నారు. ఇది సమస్యల పరిష్కారానికి వినియోగదారులు ఎటువంటి ఖర్చు పెట్టకుండా పరిష్కరించుకోవచ్చు అని అన్నారు.ఈ విషయం లో వినియోగదారులకు ఫోరం అండగా ఉంటుందని ఎవరైనా తమ సమస్యలను స్వయంగా తీసుకెళ్లలేని పరిస్థితి ఉంటే వినియోగదారుల సంఘం సభ్యులు ఆ సమస్యను పేపర్ పై వ్రాసి  సహకరిస్తారని ఆయన తెలిపారు.

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ రాజ్‌భవన్‌లో గవర్నర్‌గారిని కలిసిన దాడి

Image
ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ రాజ్‌భవన్‌లో గవర్నర్‌గారిని  కలిసిన దాడి ఈరోజు ఆగస్టు 16వ తేదీన, ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని రాజ్‌భవన్‌లో, నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ జాతీయ వైస్ ఛైర్మన్, విశాఖపట్నం మాజీ డిప్యూటీ మేయర్, సీనియర్ తెలుగు దేశం పార్టీ నాయకుడు దాడి సత్యనారాయణ గారు, ఆయనతో పాటు డి. లక్ష్మణ్ కుమార్ వెంకటేష్ గారు, ఒడిశా గవర్నర్ కమ్మంపాటి హరిబాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా గవర్నర్ గారికి శుభాకాంక్షలు తెలియజేసి, నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ తరఫున వినియోగదారుల సమస్యలపై విస్తృతంగా చర్చించారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు అవసరమైన చర్యలను వివరించిన దాడి సత్యనారాయణ గారి అభిప్రాయాలకు, గవర్నర్ కమ్మంపాటి హరిబాబు గారు సానుకూలంగా స్పందించారు. ఒడిశా రాజధాని రాజ్‌భవన్‌లో జరిగిన ఈ సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో ముగిసింది.

అందరికీ 79 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు..

Image
 *అందరికీ 79 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు..           లోక్ సత్తా పార్టీ మాదాసు భాను ప్రసాద్..* ఎందరో మహానుభావుల త్యాగఫలం, ఈ స్వాతంత్ర పుణ్యఫలం. భారతీయులు అందరూ జరుపుకునే 2 పండుగలలో  1. స్వాతంత్ర దినోత్సవం 2. గణతంత్ర దినోత్సవం  ఎందరో మహానుభావులు తమ జీవితాలను, ప్రాణాలను, ఆస్తులను పణంగా పెట్టి బ్రిటిష్ వారి బానిసత్వం సంకెళ్ల నుండి మనకు స్వేచ్ఛను కల్పించారు.  ఈ 78 సంవత్సరాల్లో మనం సాధించిన లక్ష్యాలతో పాటుగా మనం సాధించాల్సిన అంశాలు కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది.  రాజ్య వ్యవస్థకు మూలం,, ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడం.  ప్రజాస్వామ్యానికి పునాది చట్టబద్ధ పాలన. చట్టబద్ధ పాలన లేకుండా ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిన అది సరియైన పరిపాలన కాజాలదు.  ఈ 79వ స్వాతంత్ర్యం ప్రజల ముందు కొన్ని సవాళ్లు కనబడుతున్నాయి. 1.  కర్ణాటక రాష్ట్రంలో వివాదాస్పద అంశంగా మారిన ధర్మస్థల్. విష సర్పాలను చంపొద్దు అని ప్రచారం చేసే భారతీయ సమాజంలో కనిపించకుండా పోతున్న ఆడపిల్లల గురించి తెలుసుకో లేకపోవడం విచారకం.  2. స్వాతంత్ర ప్రతిపత్తి కలిగి రా...

ప్లాట్ ఫామ్ పైకి దూసుకెళ్లి, మహిళను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు*

Image
 *విశాఖపట్నం బస్టాండ్‌లో ప్లాట్ ఫామ్ పైకి దూసుకెళ్లి, మహిళను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు* బస్టాండ్ పిల్లర్‌కి, బస్సుకి మధ్యలో నలిగిపోయి మృతి చెందిన మహిళ  మృతురాలు విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం పోతనాపల్లికి చెందిన గేదెల ముత్యాలమ్మ(45)గా గుర్తింపు   వైజాగ్ - ద్వారకా నగర్ బస్టాండ్‌లో నిన్న జరిగిన దుర్ఘటన..

హోటల్లో దోశ ఆర్డర్ చేసినా, లేక అక్కడే తిన్నా సాంబారు ఇవ్వాల్సిన బాధ్యత హోటల్ వారిదే

Image
 హోటల్లో ఇడ్లీ, దోశ టిఫిన్. చేసినా, లేక అక్కడే తిన్నా సాంబారు ఇవ్వాల్సిన బాధ్యత హోటల్ వారిదే ....మురికిపూడి ప్రసాద్ అధ్యక్షులు కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం  పల్నాడు జిల్లా     ఏదైనా హోటల్ లో గాని రెస్టారెంట్లో గాని నగదు వెచ్చించి దోశ ఆర్డర్ ఇచ్చిన తర్వాత అక్కడ తిన్న లేదా పార్సెల్ చేసిన ఖచ్చితంగా సాంబార్ ను ప్రొవైడ్  చేయవలసిన బాధ్యత హోటల్ వారిది మాత్రమే.   ఇటీవల కాలంలో 2023లో జరిగిన ఒక సంఘటనపై స్థానిక వినియోగదారుల కోర్టు  50 రూపాయలు విలువ కలిగిన దోసె (అట్టు) కు సాంబారు ఇవ్వలేము అని చెప్పిన రెస్టారెంట్ కు 3500 రూపాయలు జరిమానా విధించింది.  కేసు వివరాలు  మనీష్ పాటక్  అనే న్యాయవాది రెస్టారెంట్ వారు సాంబారు వడ్డించినందుకు మరియు పార్సిల్ కూడా సాంబార్ ఇవ్వనందుకు స్థానిక వినియోగదారుల కోర్టును ఆశ్రయించగా మొత్తం 3,500 పెనాల్టీ విధించింది. 2000 రూపాయల వినియోగదారునికి మరియు 1500 రూపాయలు కోర్టు ఖర్చుకు చెల్లించాలని తీర్పు ఇచ్చింది. న్యాయవాది ముందుగా నోటీసు ఇచ్చినప్పటికీ స్పందించిన రెస్టారెంట్ వారిని కోర్టు మందలించింది  ఇలాంటి సంఘటన ...

ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న కూటమి ప్రభుత్వం".. మువ్వల

Image
 ప్రెస్ నోట్, " ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న కూటమి ప్రభుత్వం".. మువ్వల   ఇటీవలే కూటమి ప్రభుత్వ విద్యా శాఖ మంత్రి ఇచ్చిన ఆర్. సి.నెంబర్ 30/67/2025 రాజ్యాంగ హక్కులను కాలరాసే విధంగా ఉందని, ప్రతిపక్షాల,విద్యాసంఘాల గొంతులు నొక్కి ఏకపక్ష పరిపాలన చేసే విధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మరియు బొబ్బిలి నియోజకవర్గం ఇంచార్జ్ మువ్వల శ్రీనివాసరావు అన్నారు. విద్యార్థుల హక్కులు,విద్యలో నాణ్యత,సామాజిక సమస్యలు వీటి గురించి ఎవరు ప్రశ్నించకుండా, పాఠశాలలోకి,హాస్టల్లోకి విద్యార్థులు యూనియన్ నాయకులు గాని రాజకీయ నాయకులు గానీ ఏ అన ధికార వ్యక్తులు లోపలికి రాకూడదనే నిబంధనలు విధించడం అన్యాయం అన్నారు. విద్యాసంస్థల్లో జరుగుతున్న అనేక అవకతవకలు బయటకు రాని ప్రమాదం ఉందని అన్నారు. అనేక చోట్ల వసతి గృహాల భవనాలు శిథిలావస్థకు చేరుకుని ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయని, విద్యార్థులకు పెట్టే భోజనము, వసతులు పరిశీలించ దానికి ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చేయడం దుర్మార్గమన్నారు. దీనివల్ల విద్యాసంస్థల యాజమాన్యాలు మరింత రెచ్చిపోయి స్వలాభం కోసం విద్యార్థుల తల్లిదండ్రులను పీడించి విప్పి  చేసి...

విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి ప్రధాన సంస్థలు.

Image
 విద్యార్థి తల్లిదండ్రులారా... ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజనీరింగ్ విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు తమ పిల్లల విద్యకు సంబంధించిన సమస్యలపై ఫిర్యాదు చేయడానికి  కొన్ని ప్రధాన సంస్థలను సంప్రదించవచ్చు. , ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ (APHERMC) మరియు ఉన్నత విద్యా మండలి (APSCHE)..ఈ రెండు ..  విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి  ప్రధాన సంస్థలు. మీరు సంప్రదించదగిన వివరాలు కింద ఇవ్వబడ్డాయి: 1. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ (APHERMC) మరియు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి (APSCHE) ఇవి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ప్రధాన సంస్థలు. రుసుము సమస్యలు, కళాశాలల తీరుతెన్నులు వంటి విషయాలపై ఇక్కడ ఫిర్యాదు చేయవచ్చు.. . (APHERMC)..  * ఫోన్ నంబర్లు:    * సాధారణ ఫిర్యాదుల కోసం: 8712627318    * సాధారణ కార్యాలయ విచారణల కోసం: 08645 - 274443  * మెయిల్ ఐడి:    * ఫిర్యాదులకు సంబంధించి: grievanceaphermc@gmail.com    * సాధారణ కార్యాలయ విచారణల కోసం: aphermc@gm...